SNo
int64 0
21.6k
| date
stringdate 2017-01-01 01:34:20
2017-12-31 23:58:37
| heading
stringlengths 3
91
⌀ | text
stringlengths 13
38.7k
| label
stringclasses 5
values |
---|---|---|---|---|
7,437 | 02-09-2017 11:44:18 | పవన్ ఫస్ట్ లుక్ వెనుక కాన్సెప్ట్ ఇదే..! | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ఇంతకాలం అభిమాన గణం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. వారి ఆసక్తిని మరింత పెంచుతూ పవన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఇది ఓ వండర్. దాదాపు ఇంత వరకూ ఇలా జరగలేదు. పవన్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఫస్ట్ లుక్ను పవన్ బర్త్డే స్పెషల్గా రిలీజ్ చేశారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. రాజమౌళి బాహుబలి సినిమా రిలీజ్ అయిన దగ్గర్నుంచి ప్రేక్షకుల మదిలో మెదిలిన ఫస్ట్ క్వశ్చన్ అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? దీనికి రకరకాల ఊహాగానాలు.. ఇందుకు చంపాడంటూ సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం పవన్ పోస్టర్ చూసినా అంతే. సింపుల్గా అనిపిస్తోంది కానీ.. అసలు కాన్సెప్ట్ మాత్రం ఎవ్వరికీ అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేస్తోంది. దీనిపై కూడా ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఒక యాంగిల్.. మరోవైపు ఎటో నడుస్తున్నారు ఇదీ అసలు మనకు పోస్టర్లో కనిపిస్తున్న సీన్. దీని కాన్సెప్ట్ని క్యాచ్ చేయడం కష్టమే. ఇంకేముంది అభిమానులు తమ బుర్రలకు పని చెప్తున్నారు. ఒక మనిషి తన ఆలోచనకు అనుగుణంగా చేసే ఒక జర్నీయే ఈ పోస్టర్ కాన్సెప్ట్గా ఒకరు.. తన జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఓ వ్యక్తి చేసే ప్రయాణం అని మరొకరు.. తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న ఒక వ్యక్తి కథ అని ఇంకొకరు.. ఇలా రకరకాలుగా పోస్టర్ కాన్సెప్ట్ని విశ్లేషిస్తున్నారు. | entertainment |
4,053 | 13-03-2017 00:52:14 | ముఖమే కనిపించనప్పుడు ఇక అస్తిత్వం ఎక్కడ? | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న మహిళలను ఎంపిక చేసి సత్కరించింది. సాహిత్య విభాగంలో షాజహానా ఈ పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా ఆమెతో ఒక సంభాషణ:- స్త్రీవాద కవిత్వంలో ‘కొంగు’ను గుదిబండగా చూసి తగలబెట్టాలి అనే అగ్రవర్ణ స్త్రీవాదక్పథానికి వ్యతిరేకంగా, అది ‘బొచ్చె మీద కావలి ఉండే బొంత పేగు’ కాదన్న సుభద్రను మీరెలా చూస్తారు? అది స్త్రీవాద అవగా హనలో ఒక నిట్ట నిలువు చీలిక. సాంస్కృతిక వైరుధ్యాల నడకలో జరిగిన ఈ షిఫ్ట్ను ఎలా అర్థం చేసుకోవాలి? స్త్రీవాదంలో కొంగును తగులబెట్టడం అన్న ఆలోచన సరైందే. అలాగే దళితవాద కోణం నుంచి సుభద్ర రాసింది కూడా సరైందే. అగ్రవర్ణస్త్రీవాదలకు, దళిత, మైనారిటీ స్త్రీవాదలకు ఉన్న ఆకాశమంత తేడాని ఈ రెండు కవితలు ప్రతిబింబి స్తున్నాయి. రెండూ సమాంతరంగా ప్రవహిస్తున్న నదులు.. ఇవెప్పటికీ కలవవు అనిపిస్తుంది. ఎందుకంటే వీటి వెనక కులము, మతము, ప్రాంతాల బలమైన ప్రభావం ఉంది. వీరి వీరి సమస్యలు ఎంతో భిన్నంగా ఉన్నాయి. ఆర్థిక, సామాజిక, భావజాల రంగాల్లో ఎంతో తేడా ఉంది. నిజమే. ఇప్పుడిప్పుడే ఆ గడపలు దాటి వస్తోంది. అయినా ఇంకా సంపూర్ణంగా కాదు. వైరుధ్యాలు చాలా ఉన్నాయి...! ఇంకా బహుజనుల గురించి ముస్లింల గురించి ఇతర మైనారిటీల గురించి రాయాల్సిన అవసరం ఉంది. ‘మట్టిపూల’ గురించి ఎంతో చర్చ జరగాల్సిన అవసరముంది. ఎంతో సాహిత్యం వెలువడాలి. ముఖ్యంగా అగ్రవర్ణ స్త్రీవాదవాదులు తాము, తమ వారు, తమ వెనుకటితరాలు అణగారిన సీ్త్రలను చూసిన చిన్న చూపు, చూపెట్టిన వివక్ష, అణచివేతల గురించి రాయాల్సిన అవసరం ఉంది. పశ్చాత్తాపం వ్యక్తం చేయడమో మరోటో చేయడంతో పాటు ఆయా వర్గాల సీ్త్రలను ముందు నిలబెట్టి పని చేయాల్సిన అవసరముంది. తెలిసీ జవాబు చెప్పకపోతే తల పగిలిపోతుందంటారే! అలావుంది మీ ప్రశ్న. నిజమే, హిందూ అగ్రకుల స్త్రీవాదులు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దళిత, ముస్లిం, క్రిస్టియన్ వాదాలను అక్కునచేర్చుకుంటారో అప్పుడే వాళ్లను నమ్మేది. అప్పటివరకు ఇలాగే ఉంటుంది పరిస్థితి. కొందరు స్త్రీవాదులు దీనికి మినహాయింపు. బహుజన దృక్కోణమే ముస్లింవాద సాహిత్యానిది. కొన్ని ప్రత్యేకతలు అదనంగా ఉన్నాయి. హిందూయిజం అనేది వేరేగా ఉండదు. బ్రాహ్మణిజమే హిందూయిజం. నేడు ఇస్లాం సమాజం ఉనికి, భద్రత, సాంస్కృతిక అస్తిత్వం ప్రశ్నార్థకం అయిన సంక్షుభిత నేపథ్యంలో పరదాను ఒక ఆత్మగౌరవ చిహ్నంగా రెహానా సుల్తానా చూశారు, కనీజ్ ఫాతిమా లాంటి వాళ్ళు చూస్తున్నారు. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ముస్లిం సమాజంలో సగం అయిన స్త్రీవాదకు బురఖాలు తొడిగి అదొక ఆత్మ గౌరవ చిహ్నం అంటే ఎలా? అసలు ముఖమే కనిపించనప్పుడు అస్తిత్వం ఎక్కడుంటుంది? మా ఉనికే లేనప్పుడు అది ఆత్మ గౌరవ చిహ్నం ఎలా అవుతుంది? ఫలానావాళ్ళు అలా చూస్తున్నారంటే వాళ్ళ ఇష్టం. పరదా, బురఖా మమ్మల్ని మాయం చేసే చీకటి తెరలు. మమ్మల్ని వెనక్కి నెట్టే పురుషుల ఆధిపత్యపు (పొరలు) బెత్తాలు. ఆత్మగౌరవ చిహ్నాలుగా నెగెటివ్ ప్రతీకల్ని కాకుండా పాజిటివ్ ప్రతీకల్ని వాడడం అవసరం. ఉదా: సెల్వార్ కమీజ్. ఇంకా అవసరం అనుకుంటే దుపట్టా చాలు. ప్రవాహమై పరుగెత్తి పరుగెత్తి ఒక విశాలమైన నీటి సరస్సు ఏర్పడుతుంది. ఇదీ అంతే! మొదట చాలా సాహిత్యం వచ్చింది--స్త్రీవాదంలోనైనా, దళితవాదంలోనైనా. కానీ చూస్తుం డగానే అవే పాత గొంతుకలు... అదే రామాయణ భారతాలను తీసుకుని వెరైటీగా రాయడం... ఇక్కడికే స్త్రీవాద ఆగిపోయిం దనిపిస్తుంది. ఇక జగజ్జట్టీలయిన దళితకవులు మరణించడం దళితవాదానికి తీరని లోటు. మన పిల్లల్లో ఒక్కోరు ఒక్కోరకంగా ఎదుగుతారు. అందరూ ఒక్కలాగే ఉండరు కదా! ఉండాలనుకోవడం కూడా సరి కాదు. ‘నఖాబ్’ అంటే నాక్కూడా చాలా ఇష్టం. ఇప్పటికీ చదువుకున్నప్పుడల్లా చలించిపోతాను. అయితే ‘చాంద్తార’ విలక్షణమైన కవిత్వం. కేవలం రెండులైన్లలో జీవిత సారాంశం మొత్తం ఇచ్చేది. దానికి ‘నఖాబ్’కి పొంతన లేదు. అలాగే ‘దర్దీ’ కూడా. ‘దర్దీ’లో సీ్త్రల పెయిన్ ఉంటుంది. అదే టైటిల్. ‘దర్దీ’ చదువుకున్నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ‘దర్దీ’ మీద ఒక్క సరైన రివ్యూ కూడా రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. | editorial |
18,569 | 11-02-2017 12:48:19 | ఇమిగ్రేషన్పై త్వరలోనే కొత్త ఆదేశం: ట్రంప్ |
వాషింగ్టన్: అమెరికా భద్రత, రక్షణ కోసం వచ్చే వారం చివరి నాటికి వలస విధానంపై కొత్త ఆదేశాన్ని తీసుకొస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. శుక్రవారం భార్య మెలానియాతో ఫ్లొరిడా వెళుతూ మీడియాతో మాట్లాడారు. దేశ భద్రతకోసం ఏడు దేశాల పౌరులను దేశంలోకి నిషేధిస్తూ తాము సరైన నిర్ణయమే తీసుకున్నామని తెలిపారు. నిషేధ కార్యనిర్వాహక ఆదేశాలను ఫెడరల్ కోర్టు నిలుపుదల చేయటాన్ని ప్రస్తావిస్తూ.. చట్టం ముందు కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీని నుంచి బయట పడటానికి తమ వద్ద ఇంకా చాలా దారులున్నాయని తెలిపారు. కొత్త వలస విధానంపై ప్రశ్నించగా.. దేశ రక్షణకు కట్టుబడి ఉన్నామని, అందుకే కొత్త పాలసీని తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. దేశానికి చాలా పెద్ద ముప్పు ఉందని, భద్రతకు అవసరమైన అన్ని విధానాలను పరిశీలిస్తామన్నారు. | nation |
7,409 | 30-04-2017 23:33:19 | మిలన్లో ‘రాధ’ | శర్వానంద్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘రాధ’. బీవీయస్యన్ ప్రసాద్ సమర్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. భోగవల్లి బాపినీడు నిర్మాత. చిత్ర సమర్పకుడు బీవీయస్యన్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘మా సినిమా ఫస్ట్లుక్ పోస్టర్కు, టీజర్కు భారీ స్పందన వచ్చింది. ఇప్పటికే రెండు పాటలను మార్కెట్లోకి విడుదల చేశాం. ఇప్పుడు మిలన్ లో ఆఖరి పాట చిత్రీకరిస్తున్నాం. దీంతో నిర్మాణానంతర కార్యక్రమాలతో సహా సినిమా పూర్తవుతుంది. రథన్ సంగీతం హైలైట్ అవుతుంది. ఆడియో విడుదల కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహిస్తాం. మే 12న చిత్రాన్ని విడుదల చేస్తాం. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. దర్శకుడు చంద్రమోహన్కు ఇది తొలి సినిమా అయినా ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ సమపాళ్ళలో ఉంటుంది. క్లాస్ , మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. శర్వానంద్ కెరీర్లో రాధ మరో హిట్ సినిమా అవుతుంది’’ అని అన్నారు. లావణ్య త్రిపాఠి ఇందులో నాయిక. | entertainment |
13,924 | 19-12-2017 04:24:38 | ఆరంభంలోనే అదరగొట్టాం: కమల్నాథ్ | అహ్మదాబాద్, సిమ్లా, డిసెంబరు 18: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆరంభంలోనే రాహుల్గాంధీ అదరగొట్టారని ఆ పార్టీ సీనియర్ నేత కమల్నాథ్ అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఓడినప్పటికీ గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించగలిగామని తెలిపారు. అదే సమయంలో బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గాయని గుర్తుచేశారు. రాహుల్ రాజకీయ చరిత్రలో ఇది ఆరంభం మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. | nation |
3,082 | 17-05-2017 00:06:03 | ప్రభుత్వ బ్యాంకుల ‘బలవంతపు’ విలీనాలు | ఎన్పిఎలు, లాభాలే ప్రాతిపదిక..హిట్ లిస్టులో ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులు!ముంబై: దేశ బ్యాంకింగ్ రంగంలో కన్సాలిడేషన్ (పటిష్టీకరణ)కు రంగం సిద్ధమవుతోంది. మొండిబకాయిలు(ఎన్పిఎ), వరుస నష్టాలతో ఆర్థికంగా కుదేలవుతున్న ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకు (పిఎ్సబి)లను ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న ఇతర పిఎస్బిల్లో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల కట్టబెట్టిన అధికారాలతో ఆర్బిఐ ఇందుకోసం ఇప్పటికే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పిసిఎ) పేరుతో చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేని ఆరు పిఎ్సబిలను ఆర్బిఐ ఇప్పటికే గుర్తించింది. వీటిని ఆర్థికంగా బాగున్న ఏదో ఒక పిఎ్సబిలో లేదా పిఎ్సబిల్లో విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆర్బిఐ ఉన్నతాధికారులు గత వారం రోజులుగా ఇందుకోసం ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులతో పలు దఫాలు సమావేశమై వాటి ఆర్థిక పరిస్థితిపై చర్చించినట్టు సమాచారం. ఈ బలవంతపు విలీన ప్రయత్నాలు అమలుకు నోచుకుంటే ఈ బ్యాంకుల మేనేజ్మెంట్లపైనా వేటు పడినట్టేనని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదీ ప్రాతిపదికఒత్తిడిలో ఉన్న ఆస్తులు, మూలధనం పరిస్థితి, వరుస నష్టాలు, ఖర్చులు, భవిష్యత నిధుల అవసరాలపై ఆర్బిఐ అధికారులు గుచ్చిగుచ్చి అడుగుతున్నట్టు ఈ చర్చల్లో పాల్గొన్న కొన్ని బ్యాంకుల ఉన్నతాధికారులు చెప్పారు. ఈ ప్రమాణాల ప్రకారం చూస్తే ఐడిబిఐ బ్యాంక్, యూకో బ్యాంక్తో పాటు దాదాపు 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి కష్టంగా ఉంది. దీంతో ముందుగా ఆర్థికంగా బాగా నీరసించిన పిఎ్సబిలను, పిసిఎ కింద గాడిలో పెట్టేందుకు వాటి రుణ వితరణ, శాఖల విస్తరణ, కొత్త నియామకాలపై ఆంక్షలు విధిస్తారు. ఈ ఆంక్షలతో ఖర్చులు తగ్గడంతో పాటు, వాటి రుణాల వసూళ్లూ పెరుగుతాయని ఆర్బిఐ అంచనా. వరు సగా రెండేళ్ల పాటు నష్టాలు, మొత్తం రుణాల్లో ఎన్పిఎలు ఆరు శాతం మించినా, సొంతంగా కనీస మూలధన అవసరాలు తీర్చుకోలేక పోయినా, అలాంటి పిఎ్సబిలకు పిసిఎ వర్తిస్తుందని ఆర్బిఐ గత నెలలో స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఆర్థిక ఫలితాలు ప్రకటించిన పిఎ్సబిలను పరిగణనలోకి తీసుకుంటే దేనా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పరిధిలోకి వస్తాయి. ఈ రెండు బ్యాంకుల ఎన్పిఎలు ఆరు శాతం దాటడంతో పాటు, గత రెండేళ్లుగా నష్టాలు ప్రకటిస్తున్నాయి. జాబితాలో 15 బ్యాంకులుపిసిఎ కింద ఆర్బిఐ ప్రకటించిన ఎన్పిఎలనే పరిగణనలోకి తీసుకుంటే 15 పిఎ్సబిల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ల ఎన్పిఎలు ఇప్పటికే ఆరు శాతం మించి పోయాయి. అయితే ఎన్పిఎల పరిస్థితి హద్దులు దాటినా, నిర్ణీత 10.25 శాతాని కంటే ఎక్కువ స్థాయిలో కనీస మూల ధన నిల్వలు ఉండడం, వరసపెట్టి లాభా లు సంపాదించడం వంటి కొన్ని సానుకూల చర్యలు తమను ‘బలవంతపు’ విలీనాల నుంచి బయటపడేస్తాయని కొన్ని పిఎ్సబిల మేనేజ్మెంట్లు భావిస్తున్నాయి. లెక్కల్లో తేడాలు సమస్యేబ్యాంకింగ్ విశ్లేషకులు మాత్రం బ్యాంకులు చెప్పే మూల ధన నిల్వలు, లాభాల లెక్కల్లోనూ తిరకాసు ఉందని చెబుతున్నారు. వీటి అంచనా కోసం ఆర్బిఐ పాటించే లెక్కలకు, బ్యాంకులు పాటించే లెక్కలకు ప్రస్తుతం పొంతన లేదు. ఆర్బిఐ లెక్కల ప్రమాణాలు పాటిస్తే ఎన్పిఎల కోసం కేటాయించే మొత్తాన్ని పిఎ్సబిలు గణనీయంగా పెంచాల్సి ఉంటుంది. అదే జరిగితే పిఎ్సబిల లాభాలతో పాటు, వాటి మూలధన నిల్వలకూ భారీగా గండిపడుతుందని విశ్లేషకుల అంచనా. మొత్తం మీద పిసిఎ పేరుతో ఆర్బిఐ దేశంలో బ్యాంకింగ్ రంగ కన్సోలిడేషన్కు రంగం సిద్ధం చేస్తోంది. ప్రపంచ టెలికాం దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాషా్ట్రల్లో ప్రత్యేక డేటా రీచార్జ్ బొనాంజాను అందిస్తున్నట్లు టెలినార్ ఇండియా తెలిపింది. 57 రూపాయల స్పెషల్ టారిఫ్ వోచర్పై 17 వ తేదీన ఎలాంటి అదనపు వ్యయం లేకుండా 1జిబి.. 2జి డేటాను అందించనున్నట్లు టెలినార్ పేర్కొంది. | business |
6,903 | 23-10-2017 12:18:11 | ప్రభాస్ క్రేజ్ చూస్తే షాకైపోవాల్సిందే! | యంగ్ రెబల్స్టార్ ప్రభాస్.. `బాహుబలి` సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సూపర్ పాపులర్ అయిపోయాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాదిన, ఉత్తరాదిన అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆమిర్ఖాన్, సల్మాన్ కంటే కూడా ప్రభాస్కే క్రేజ్ ఎక్కువగా వుందంటే అతిశయోక్తి కాదు. తాజాగా ప్రభాస్ పుట్టిన రోజునాడు సోషల్ మీడియా ద్వారా వెల్లువెత్తిన సందేశాలే దీనికి నిదర్శనం. ప్రభాస్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నెటిజన్లు ట్విటర్ను హోరెత్తించారు. కేవలం పన్నెండు గంటల్లోనే రెండు మిలియన్ల సందేశాలు వచ్చాయి. ఈ రేంజ్లో బర్త్డే విషెస్ రావడమంటే మాటలు కాదు. ఆ సందేశాల వెల్లువ ఇప్పటికీ ఆగలేదు. | entertainment |
8,866 | 22-04-2017 23:29:42 | బాక్సాఫీస్ రాముడు | 1970ల తొలినాళ్ళలో ఎన్టీయార్ మీద ప్రత్యేక సంచిక వేస్తున్న ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ అప్పట్లో బి.ఎన్.రెడ్డి ఈ మాటలు అన్నారు. ఆ తరువాత కొన్నేళ్ళకు...ఎన్టీయార్కు అయిదున్నర పదుల ఏళ్ళు మీద పడ్డాయి. కెరీర్ జోరుగా సాగుతున్నా... ఎక్కడో చిన్న స్తబ్ధత. నవరసాల్లో ఏదైనా పండించగల అభినయ ప్రతిభ... అపారమైన మాస్ ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? ఏది ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు? సరిగ్గా అదే టైమ్లో కేవలం మూడే సినిమాల అనుభవమున్న ఒక యువ దర్శకుడికి ఎన్టీయార్ సినిమా చేసే అరుదైన ఛాన్స్... ఇంకా చెప్పాలంటే అదృష్టం తలుపు తట్టింది. అంతే... అప్పటికి సరైన హిట్లు కూడా లేని ఆ యువకుడు బోలెడంత హోమ్ వర్క్ చేశాడు. ఒక స్టార్ హీరోకు ఎలాంటి కథ, కథనం, వాణిజ్య అంశాలున్న సినిమా అయితే కరెక్టో కసరత్తు చేశాడు. సినిమా నేపథ్యం నుంచి ఆట, పాట, డ్రెస్సులు అన్నీ మార్చాడు. ఎన్టీయార్ కూడా గిరి దాటి, బాక్సాఫీస్ బరిలో గర్జించారు.అంతే... ఏ థియేటర్ దగ్గర చూసినా కిటకిటలాడే జనం. ఆగకుండా వేస్తున్న షోలు వేస్తూనే ఉన్నారు... చూస్తున్న జనం చూస్తూనే ఉన్నారు... టికెట్లు దొరక్క అంతకు అంతమంది జనం వెనక్కి వెళుతూనే ఉన్నారు. టికెట్ల కోసం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నారు.వంద రోజులు... రెండొందలు... మూడొందలు... ఏకంగా ఏడాది ఆడిందా సినిమా.వెరసి... వసూళ్ళ సునామీ.... బాక్సాఫీస్ దగ్గర ఒక కొత్త చరిత్ర... హీరోగా ఎన్టీయార్ మాస్ ఇమేజ్కు మరో సరికొత్త ఇన్నింగ్స్కు శ్రీకారం... అప్పటి ఆ యంగ్ డైరెక్టర్.... కె.రాఘవేంద్రరావు... కట్ చేస్తే... ఇప్పుడు ఆ సినిమాకు నాలుగు దశాబ్దాలు నిండాయి. అయినా సరే ఆరు పాటలు, అయిదు ఫైట్లు... మాస్ మెచ్చే వినోదం... స్టార్ హోదాను పెంచే చిత్రీకరణ... ఇలా కమర్షియల్ ఫార్ములాలన్నిటికీ ఇవాళ్టికీ ఆ సినిమాయే ఓ పెద్ద బాలశిక్ష. పాట... ఫైటు... ఇంటర్వెల్ లాక్... బ్లాస్టింగ్, ఫైట్స్తో యాక్షన క్లైమాక్స్... ఇలా ఆ సినిమా రీలు రీలుకీ వేసిన కొలతల గీతలు దాటి రావడం నాలుగు దశాబ్దాలు గడిచినా తెలుగు సినిమా వల్ల కావడం లేదు. తెలుగు సినిమా బాక్సాఫీస్ గరిష్ఠ వసూళ్ళను తొలిసారిగా నాలుగింతలు చేసి, నాలుగు కోట్ల మార్కు తాకిందా సినిమా. మంచికో, చెడుకో తెలుగు సినిమా గ్రామర్నే మార్చేసింది. | entertainment |
1,292 | 04-03-2017 22:58:12 | జూలై 1 నుంచి జిఎస్టి |
40 శాతం పన్నుకు వీలు రైతులు, చిరు వ్యాపారులకు ఊరట రియల్టీని జిఎస్టిలోకి తేవాలి చిన్న హోటళ్లపైనా పన్ను పోటు | business |
3,032 | 15-12-2017 01:20:08 | నాట్కో రూ.915 కోట్ల సమీకరణ | 6 శాతం లాభపడిన షేరుహైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : క్వాలిఫైడ్ సంస్థాగత ఇన్వెస్టర్లకు సెక్యూరిటీల జారీ ద్వారా 915 కోట్ల రూపాయలు సమీకరించినట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. గురువారం నాడు సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల కమిటీ ఒక్కో షేరును 915 రూపాయల ఇష్యూ ధరతో కోటి షేర్లను కేటాయించాలని నిర్ణయించింది. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యుఐపి) రూపంలో క్వాలిఫైడ్ సంస్థాగత కొనుగోలుదారులకు ఈ షేర్లను కేటాయించనున్నట్లు నాట్కో తెలిపింది. క్యుఐపి ద్వారా సమీకరించిన మొత్తాలను దేనికి కేటాయించనుందనేది మాత్రం నాట్కో వెల్లడించలేదు. కాగా క్యుఐపి రూపంలో నిధులను సమీకరించనున్నట్లు ఈ నెల 11న ప్రకటించనప్పటి నుంచి నాట్కో షేరు దూసుకుపోతోంది. వరుసగా నాలుగు సెషన్లలో షేరు 10 శాతానికి పైగా లాభపడింది. గురువారం నాడు బిఎ్సఇలో నాట్కో షేరు 6.08 శాతం లాభంతో 1020.85 రూపాయల వద్ద స్థిరపడింది. కాగా క్యుఐపి, గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జిడిఆర్), అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఎడిఆర్) ఫారిన్ కన్వర్టబులిటీ బాండ్స్, ఫుల్లీ కన్వర్టబులిటీ/పాక్షిక కన్వర్టబుల్ డిబెంచర్ల జారీ ద్వారా 1,500 ోట్ల రూపాయలు సమీకరించేందుకు నవంబరు 2న జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నాట్కో ఫార్మా ఆమోదం తెలిపింది. సమీకరించిన మొత్తాలను మూలధన వ్యయాల కోసం వినియోగించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులోభాగంగానే 600 కోట్ల రూపాయలను తెలంగాణలోని కొత్తూరు, మేకగూడ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సెజ్, హిమాచల్ప్రదేశ్లోని మనాలీ, చెన్నైలోని ఉత్పత్తి కేంద్రాల్లో భవనాలు, ఇతర సివిల్ పనులు, ప్లాంట్, పరికరాల కోసం వెచ్చించాలని నాట్కో భావిస్తోంది. | business |
4,279 | 03-08-2017 01:37:32 | ‘మూఢ నమ్మకాల’ చట్టం ఎప్పుడు? |
మూఢ నమ్మకాల నిర్మూలనా చట్టం అంటూ కేంద్ర ప్రకటించడం సంతోషం. ఆ వెంటనే మేమూ రడీ అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం చకాచకా జరిగిపోయింది. కానీ, నెలలు గుడుస్తున్నా మళ్లీ ఆ ఊసు ఎత్తకపోవడంతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే మతతత్వ ముద్ర పడిన బీజేపీ ప్రభుత్వం, యజ్ఞ యాగాదులతోనే అన్ని విజయాలు సాధించాలని భావిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాల గతాన్ని పరిశీలిస్తే ఇవి వట్టి ప్రకటనలుగానే మిగిలిపోతాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఒక వైపు అంతరిక్షానికి రాకెట్ ప్రయోగాలు చేస్తూ ప్రపంచంలోనే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకువెళుతూనే, ఆ ప్రయోగాలు విజయవంతం కావాలని దేవుళ్ళు, దేవతలకు మన శాస్త్రవేత్తలు, పరిశోధన సంస్థలు అధికారికంగా మొక్కులు చెల్లిస్తుండడం దురదృష్టకరం. ఎలా చేస్తే ఏమి? ప్రయోగాలు విజయవంతమయ్యాయి కదా అని వాదించే వారికి కొదవలేదు. కానీ దీనివల్ల మూఢనమ్మకాలు సమాజంలో రెండింతలై ప్రగతి కుంటుపడడమే కాక, మూఢ భక్తి, నమ్మకాల పేరున అనేక అన్యాయాలు, అక్రమాలు, అకృత్యాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. గుప్తనిధుల కోసం అక్కడక్కడా నరబలులు చోటుచేసుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన వర్గాలు చేతబడి, బాణామతి పేరున అమాయకులెంతోమంది బలైపోతున్నారు. మూఢనమ్మకాలు, ఆచారాలు, క్షుద్రపూజలను నమ్మవద్దన్నందుకు మహారాష్ట్రలో నరేంద్ర దభోల్కర్ను, గోవింద పన్సారేను హత మార్చారు. మూఢనమ్మకాలు, మత మూఢ త్వం పెరిగిపోతున్న నేపథ్యంలో మూఢ నమ్మకాల నిర్మూలనా చట్టం ఎంతో అవసరమని కేంద్రం, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. ఆస్తికవాద, హేతువాద, నాస్తిక, భౌతికవాద సంఘాలు, వ్యక్తులతో జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలి.- కన్నెబోయిన అంజయ్యహేతువాద సంఘం, ఖమ్మం జిల్లా | editorial |
5,903 | 03-11-2017 23:34:44 | లెట్స్ రాక్ రామూ |
నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ‘‘వర్మ దర్శకత్వంలో పోలీస్ డ్రామా కథాంశంతో స్టైలిష్ యాక్షన్తో రాబోతున్న సినిమా కోసం ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తున్నా’’ అని శుక్రవారం ట్విట్టర్లో రాసుకొచ్చారు నాగ్. ఆ ట్వీట్ చేసిన నాలుగు గంటల తేడాతో నాగార్జున మరో ట్వీట్ చేశారు. ‘‘1988లో వర్మతో ‘శివ’ సినిమా అంగీకరించినప్పుడు చాలామంది షాక్ అయ్యారు. వారి అంచనాలు తప్పని రామూ నిరూపించాడు. మళ్లీ 2017లో రామూతో సినిమా అనగాన కొందరు హ్యాపీగా ఉంటే మరికొందరు అదే షాక్లో ఉన్నారు. లెట్స్ రాక్ రామూ’’ అని పేర్కొన్నారు. ఆ ట్వీట్ను వర్మ స్ర్కీన్షాట్ తీసి తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసి ‘‘హే నాగ్ మీరెప్పుడూ తక్కువ మాట్లాడుతుంటారు. నేను ఎక్కువగా మాట్లాడుతుంటా. ఇప్పుడు మనిద్దరి భిన్న స్వభావాలతో రాక్ చేద్దాం’’ అని వర్మ ట్వీటారు. ఈ నెల 20న ప్రారంభంకానున్న ఈ సినిమాకు వర్మ ఆయన తల్లితో క్లాప్ కొట్టిస్తానని అంటున్నారు. అందుకు కారణాన్ని కూడా ఎఫ్బీలో రాశారు. చిన్నప్పుడు తను ఎందుకూ పనికిరాడని వర్మ తల్లి అనుకునేవారట. ఇప్పుడు ఆయన సక్స్సఫుల్ దర్శకుడు కాబట్టి నాగ్ సినిమాకు అమ్మతో క్లాప్ కొట్టించి పగ తీర్చుకుంటాననీ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా చిన్నప్పుడు తన తల్లితో దిగిన ఫొటోని ఆయన షేర్ చేశారు. | entertainment |
9,748 | 10-08-2017 17:43:47 | కళ్ళుచెదిరే ధరకు 2.0 తెలుగు హక్కులు | రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రోబో సినిమాకు సీక్వల్ గా '2.0' తెరకెక్కుతోంది. రాజుమహాలింగం నిర్మాతగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై అత్యంత భారీబడ్జెట్తో ఈసినిమా నిర్మాణపనులు జరుగుతున్నాయి. అయితే ఈసినిమా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ హక్కులు కళ్ళుచెదిరే ధరకు అమ్ముడుపోయాయని నిర్మాత రాజుమహాలింగం తెలిపాడు. డిస్ట్రిబ్యూటర్లతో కలిసి దిగిన ఫోటోలను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ ఈవిషయాన్ని తెలిపాడు. 'లైకా ప్రొడక్షన్స్ గ్లోబల్ సినిమా భాగస్వామ్యంలో చరిత్ర సృష్టిస్తాం..' అని రాసి పోస్ట్ పెట్టాడు.ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. వచ్చేఏడాది సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. | entertainment |
19,976 | 02-01-2017 09:51:45 | ఆ క్యాచ్ లు అలా పట్టేశా : ఎమ్మెస్కే ప్రసాద్ | గుంటూరు : మేడికొండూరులో పుట్టి పెరిగి గుంటూరు నగరంలో బ్యాట్, కీపింగ్ గ్లౌస్ చేతబట్టి క్రికెట్లో ఓనమాలు దిద్ది అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా భారత జట్టుని ఎంపికచేసే సెలక్షన్ కమిటీకి చైర్మన్ అయ్యారు ఎమ్మెస్కే ప్రసాద్. తెలుగు రాష్ఠ్రాల నుంచి ఇంతటి అత్యున్నతస్థాయికి ఎదిగిన తొలివ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. తెలుగుజాతి గర్వపడేలా చేసిన ఎమ్మెస్కే టెస్టు, వన్డే, టీ 20 ఫార్మాట్లలో టీం ఇండియాని నంబర్ వన స్థానంలో నిలపడమే తన ముందున్న లక్ష్యాలుగా చెబుతారు. ప్రతిష్టాత్మకమైన పదవిని చేపట్టినప్పటికీ తనకు గుర్తింపు తీసుకొచ్చిన ఆంధ్రాక్రికెట్ అసోసియేషనను మరిచిపోకుండా ఎప్పుడు ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా బిజీషెడ్యూల్లోనూ తీరిక చేసుకొని వచ్చి భావి క్రికెటర్లలో ఉత్తేజాన్ని నింపుతున్న ఎమ్మెస్కే తానీస్థాయికి చేరేందుకు దాటిన మలుపులను ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు. ప్రతీ ఆటగాడు కలలు కనాలని, ఆ కలలు సాకారమయ్యేవరకు కష్టపడాలంటున్న ఎమ్మెస్కే ఇంకా ఏమేంచెప్పారంటే..మాది గుంటూరు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడికొండూరు గ్రామం. నాన్న రవిప్రసాద్ గుంటూరులోని కేంద్రప్రభుత్వ రంగసంస్థ లేబొరేటరీలో పనిచేసేవారు. నాకు ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. మా ఊళ్లో ప్రతీ మూడిళ్లలో ఒక డాక్టరో, ఇంజనీరో ఉండేవారు. అలానే నా సోదరుడు ఇంజనీర్ కాగా, సోదరి డాక్టర్. నా ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరు లోని కేంద్రీయ విద్యాలయలో పూర్తయింది. గ్రాడ్యుయేషన్ హిందూ కళాశాలలో చేశా. పాఠశాల దశలోనే క్రికెట్పై ఆసక్తి కలిగింది. ఇంట్లో కూడా ప్రోత్సాహం లభించడంతో గుంటూరు వచ్చి పోలీసు పరేడ్గ్రౌండ్స్లో గంటల తరబడి ప్రాక్టీసు చేసేవాడిని. వికెట్ కీపింగ్ నాకు సహజసిద్ధంగానే అబ్బింది. గుంటూరులో జరిగిన కోచింగ్ క్యాంపునకు తొలిరో జు వెళ్లినప్పుడు సెలెక్షన్సుకు 200 మంది పిల్లలు వచ్చా రు. అందులో వికెట్కీపర్ నేనొక్కడినే. ఆ రోజున కోచ్ నాకు కష్టమైన క్యాచ్ లు ఇస్తుండగా వాటన్నింటినీ ఆరితేరినవాడిలా ఒడిసిపట్టుకొన్నాను. ఆరోజు నుంచి నాకోచ్ పూర్ణచంద్రరావు వికెట్ కీపింగ్లో సానపెట్టారు. దాంతో మూడు నెలల్లోనే ఆంధ్ర రంజీ జట్టులో ఆడే అవకాశం వచ్చింది. ఇంటర్ జోనల్ మ్యాచ్ లు ఆడే రోజుల్లో గౌరవ కార్యదర్శి ఎన.వెంకటరామ్ నా ఆటతీరుచూసి ఈ కుర్రాడు ఏరోజుకైనా భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదిస్తాడన్నారు. అందరి ప్రోత్సాహంతో... నా కోచ్ తోపాటు స్నేహితులు, కుటుంబసభ్యులంతా ప్రోత్సాహం అందించడంతో క్రికెట్లో ఉన్నతశిఖరాలకు చేరుకోవడానికి బాగా కష్టపడ్డా. నేను, ఫాస్టుబౌలర్ అజిత అగార్కర్ పాకిస్థాన్ ఏ టూర్ నుంచి దేశానికి వచ్చాం. ఆ వెంటనే ముక్కోణపు సిరీస్కు అగార్కర్ ఎంపికయ్యాడు. నాకు కూడా పిలుపు వస్తుందని ఎదురు చూశా. ఊహించినట్లుగానే 1998లో వికెట్కీపర్ నయన మోంగియా గాయపడటంతో భారతజట్టులో ఆడే అవకాశం లభించింది. కోకాకోలా ముక్కోణపు సిరీస్లో మొహాలీ క్రికెట్ గ్రౌండ్లో బంగ్లాదేశపై వన్డే మ్యాచతో నా అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం ప్రారంభమైంది. అది నా జీవితంలో మరిచిపోలేని రోజు. అంతకుముందు ఇండియా-ఏ తరపున ఐదువిదేశీ టూర్లలో పాల్గొన్నప్పటికీ తొలివన్డే మ్యాచ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. ఆ మ్యాచలో ఎక్కడా ఒత్తిడికి గురికాలేదు. అంతర్జాతీయ వేదికపై మనం ఆడుతోంది ఆస్ట్రేలియా, పాకిస్థాన్ తోనా బంగ్లాదేశతోనా అన్న వ్యత్యాసం ఉండదు. గట్టి ప్రత్యర్థులైతే చిన్నదేశాలతో పోల్చితే కొంచెంకష్టంగా ఉంటుంది. నా టెస్టు కెరీర్ ప్రస్థానం న్యూజిల్యాండ్తో ప్రారంభ మైంది. ఆ మ్యాచ్ లో భారతజట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 83పరుగులకే కుప్పకూలింది. నేను ఆ రోజున ఏడో నెంబర్ బ్యాట్స్మెనగా క్రీజులోకి వెళ్లా. అప్పటికే 43పరుగులకు ఆరువికెట్లు కోల్పోయింది. నా ఆరాధ్య క్రికెటర్ సచిన టెండుల్కర్ క్రీజ్లో ఉన్నారు. ఆయన మ్యాచ్ లో పరిస్థితి ఎలా చూస్తున్నావని ప్ర శ్నించారు. నేను ఒక్కటే సమాధానం చెప్పా. రోజం తా వికెట్ల ఎదుట పాతుకు పోయేందుకు ప్రయత్నిస్తానన్నా. ఆ జవాబు నా నుంచి వచ్చినందుకు సచిన్ సంతోషపడ్డారు. అయితే కొ ద్దిసేపటికే సచిన అవుట్కాగా ఆ తర్వాత శ్రీనాథ్, టెయిల్ ఎండర్లు క్యూకట్టారు. దాంతో 16 పరుగులతో నాటౌట్గా మిగిలిపోయా. నేను తొలిటెస్టు ఆడకముందే ఇండియా సిమెంట్స్లో పనిచేస్తున్నా. దాంతో తమిళనాడుకు చెందిన రంజీబౌలర్లు దేవానంద్, గోపీకృష్ణన్ బౌలింగ్లో కీపింగ్చేసిన అనుభవం ఉంది. ప్రపంచస్థాయి బౌలర్లు అనిల్కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్ లాంటి బౌలర్లకు కీపింగ్చేయలేదు. స్పిన్ తిరిగే పిచలపై బంతిని గింగరాలు తిప్పడంతోపాటు అధికబౌన్స రాబట్టేందుకు కుంబ్లే, హర్భజన్ ప్రయత్నిస్తారు. కుంబ్లే కంటే హర్భజన్ కు కీపింగ్ చేయడం చాలా కష్టం. అప్పట్లో బంతి భారీగా బౌన్స అవుతుండటంతో నేను తొలిసారిగా కీపింగ్ చేస్తూ హెల్మెట్ ధరించాను. అప్పట్లో కీపర్లు హెల్మెట్లు ధరించేవారు కాదు. ఒకసారి సచిన ఈ విషయంలో నన్ను ప్రశ్నించగా కొన్ని సందర్భాల్లో మన తల కంటే ఎక్కువ ఎత్తులో స్పిన్నర్ వేసిన బాల్ బౌన్సు అవుతుందని చెప్పా. నేడు కీపర్లంతా హెల్మెట్లు వాడుతున్నారు. నైరోబీలో జరిగిన ఆ టోర్నమెంట్లో ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్స్కు చేరుకున్నాయి. ఫైనల్స్లో దక్షిణాఫ్రికా 235 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్యఛేదనలో నన్ను నాల్గో నం బర్ బ్యాట్స్మెనగా ప్రమోట్చేశారు. నేనుఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీ దాటించా. అలవోకగా షాట్లు కొడుతూ లక్ష్యం వైపు వెళుతుండగా ఒక్కసారిగా కండరాలు పట్టేశాయి. అప్పటికి నేను 63పరుగులు చేశా. తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచనుంచి రిటైర్ హర్ట్ కావాల్సి వచ్చింది. చివరికి మళ్లీ బ్యాటింగ్కు రాగా ఆఖరి ఓవర్లో 12పరుగులు కొట్టాలి. నాకు బైరన్నర్గా రాహుల్ ద్రవిడ్ వచ్చారు. ఫస్టు బాల్ని నేను బాదగా రెండో పరుగు తీసే క్రమంలో రనౌట్ కావడంతో మ్యాచ ఓడిపోయాం. వెస్టిండిస్లోని టొరాంటోలో జరిగిన మ్యాచ్ లో ఆ దేశ దిగ్గజ బ్యా ట్స్మెచ్ బ్రియాన్ లారా క్యాచ్ ని ఎడమ పక్కకు డైవింగ్ చేస్తూ ప ట్టుకొన్నది నా కెరీర్లో మరిచిపోలేనిది. అది కళ్లుచెదిరిపోయే క్యాచ్ గా కా మెంటేటర్లు అభివర్ణించారు. నేను పట్టుకొన్న క్యాచ్ ల్లో అదే టాప్. ఆస్ట్రేలియా టూ ర్కు వెళ్లేటప్పుడు కౌలాలంపూర్లో లగేజ్ తీసు కుని వెళుతుండగా అది నా మోకాలుకు కొట్టు కొన్నది. దానిని నేను తేలికగా తీసుకున్నా. తీరా ఆసే్ట్రలియా వెళ్లాక చూస్తే నడవలేని పరిస్థితి. బాగా వాపు రావడంతో జట్టు ఫిజియో నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. దాంతో నయన మోంగియాను అప్పటికప్పుడు పిలిపిం చారు. ఆ తర్వాత వన్డే జట్టులో నేను ఉంటానని ఆశించా. అయితే నన్ను టీం నుంచి తొలగించి నట్లుగా కెప్టెన్ చెప్పడంతో షాక్కు గురయ్యా.ఏసీఏతో అవినాభావ సంబంధంటెస్టు టీంలో స్థానం కోల్పోయిన తర్వాత ఐదేళ్లపాటు ఆంధ్రా రంజీ జట్టులో ఆడా. మళ్లీ జట్టులో స్థానం పొందుతానని ఆశించారు. నాతోపాటు మరో ఇద్దరికి కూడా చోటు లభిస్తుందనుకున్నారు. ఆ అవకాశం రాకపోవడంతో 33 ఏళ్ల వయస్సులోనే క్రికెట్కు గుడ్బై చెప్పాశా. ఆ వెంటనే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)లో కీలక పదవులు చేపట్టా. జాగర్లమూడి నరేంద్రనాథ్ సహకారంతో జేకేసీ కళాశాలలో ఆంధ్రా ఉమెన్సు క్రికెట్ అసోసియేషన్ స్థాపించా. ఇక్కడే కోచింగ్ క్యాంపు ప్రారంభింపచేశారు. నా ఆలోచనలకు రూపుఇచ్చారు. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ జేకేసీ కళాశాల గ్రౌండ్స్ని సందర్శించి ఇదొక రోల్మోడల్ అని కితాబిచ్చారంటే దానివెనక ఎమ్మెస్కే కఠోరశ్రమ ఎంతవుందో అంచనా వేయొచ్చు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజుతో సాన్నిహిత్యం పెరిగింది. రికీ భుయ్ వంటి వర్థమాన క్రికెటర్లను వెలుగులోకి తెచ్చా. గంగరాజుతో సాన్నిహిత్యం మేలు చేసింది. సెలెక్షన కమిటీ చైర్మన్ పదవికి ముందే సెలెక్టర్గా ఎంపికయ్యా. ఏదో ఒక రోజు సెలెక్షన్ కమిటీ చైర్మన పదవి వస్తుందని ఆశించారు. అయితే నా కంటే సీనియర్ క్రికెటర్లు ఉన్నప్పటికీ గతేడాది సెప్టెంబర్లో నన్ను బీసీసీఐ సెలెక్షన కమిటీ చైర్మన్ గా నియమించింది. ఈ పదవిని ముందే ఊహించానని, ఎమ్మెస్కే క్రికెటర్గా భారత జట్టులోకి వచ్చి ఇప్పుడీ స్థాయికి ఎదగడం ఎంతో సంతోషంగా ఉంది. పదవితోపాటు కొన్ని బాధ్యతలు కూడా వస్తాయి. ఇది సవాలుతో కూడిన పని. వేలాదిమంది కలలను సాకారం చేసే పదవి ఇది. ఏసీఏలో ఏవిధంగా అయితే కష్టపడి ఒకస్థాయికి వచ్చానో అదే విధంగా భారతకు మంచి జట్టును అందించడంలో తోడ్పాటునందిస్తా. జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీకి తెలుగువాడు చైర్మన్ గా ఉండటం తెలుగురాష్ట్రాల క్రికెటర్లలో స్ఫూర్తిని నింపేదే. బాగా ఆడితే మనకు అవకాశం లభిస్తుందన్న నమ్మకం వారిలో పెరుగుతుంది. రెండు రాష్ట్రాల్లోని క్రికెటర్లు కష్టపడుతూ బాగా ఆడితే తప్పకుండా న్యాయం జరుగుతుంది. మన దగ్గర ప్రతిభావంతులకు కొదవలేదు. అలాంటివాళ్లకు నేను చెప్పేదొక్కటే. ప్రతిభను నమ్ముకుంటే తప్పక ఫలితం ఉంటుందని. పూర్తి పేరు : మన్నవ శ్రీ కాంత్ ప్రసాద్ | sports |
2,491 | 16-06-2017 00:46:03 | విమానయానం సిద్ధంగా లేదు.. | జిఎస్టి వాయిదాకు వినతివిమానయాన రంగం జిఎస్టికి సిద్ధంగా లేదని అందువల్ల అమలును మరో రెండు నెలలు వాయిదా వేయాలన పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. జిఎస్టికి అనుగుణంగా ఇప్పుడున్న వ్యవస్థను మార్చుకునేందుకు ఎయిర్లైన్స్ సంస్థలకు సమయం పడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటి నుంచి జిఎ్సటి అమల్లోకి తెచ్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సన్నాహాలు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఇప్పుడు జిఎస్టి సందడి తప్ప మరొకటి కనిపించడంలేదు. అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రతినిత్యం ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ సంస్థల సారధ్యంలో జిఎస్టిపై సదస్సులు, సమావేశాలు, వర్క్షాప్ లు జరుగుతున్నాయి. జిఎస్టి వాయిదా సమస్యే లేదని పుకార్లను నమ్మవద్దని ఆర్థిక శాఖ పలుమార్లు ప్రకటించింది కూడా. పైగా అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు జిఎస్టికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆఖరు క్షణంలో తాము సిద్ధంగా లేమంటూ ఎయిర్లైన్స్ సంస్థలు ప్రకటించడం గమనార్హం. జిఎస్టిలోని కొన్ని అంశాలపై ఎయిర్ఇండియాతో సహా పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. | business |
12,109 | 04-05-2017 17:24:57 | పాక్ పైశాచికంపై.. వినూత్న నిరసన | ఆనంద్: సరిహద్దులో భారత జవాన్ల శరీరాలను ఛిద్రం చేసిన పాకిస్థాన్ ఆర్మీ పైశాచికత్వంపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. గుజరాత్లోని ఆనంద్లో కొందరు వినూత్నంగా నిరసన తెలిపారు. ఓ రోడ్డుపై రంగులతో పాకిస్థాన్ జెండా వేశారు. ఆ తర్వాత దానిపై నుల్చొని, తొక్కుతూ పాక్ వ్యతిరేక నినాదాలు చేశారు. భారత్ జెండాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే దీనిపై స్పందించిన పోలీసులు పాక్ జెండా పెయింటింగ్ను చెరిపేశారు. స్థానికులపై కేసులు కూడా నమోదు చేశారు. | nation |
13,029 | 28-10-2017 12:10:44 | జయ వేలిముద్ర వివాదం | హైకోర్టులో డాక్టర్ సాక్ష్యంచెన్నై: తిరుప్పరంకుండ్రం ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి బిఫామ్లో ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో వేసిన వేలిముద్రకు సాక్షిగా వ్యవహరించిన ప్రభుత్వ డాక్టర్ బాలాజీ హైకోర్టులో శుక్రవారం జరిగిన విచారణకు హాజరయ్యారు. తిరుప్పరంకుండ్రం ఎన్నికల్లో పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి డాక్టర్ శరవణన్ ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి ఏకే బోస్ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు జయలలిత బిఫామ్పై వేలిముద్రను స్పృహలో ఉన్నప్పుడు వేసారా లేదా అనే అనుమానం కలుగుతోందని పిటిషనర్ ఆరోపించారు. జయలలిత చికిత్సకు సంబంధించిన అన్ని పత్రాలను సైతం కోర్టులో సమర్పించేలా ఉత్తర్వులివ్వాలని కూడా పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ నెల 13న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ విల్ఫోర్డ్ సాక్ష్యాన్ని నమోదు చేశారు. పార్టీ ప్రిసీడియం చేర్మన్ మధుసూదనన్ జయ వేలిముద్రలున్న బిఫామ్ను అంగీకరించమంటూ చేసిన సిఫారస్సు పరిగణనలోకి తీసుకునే అన్నాడీఎంకే అభ్యర్థికి గుర్తును కేటాయించినట్లు ఆయన పేర్కొన్నా రు. ఇక జయ వేలిముద్ర వేసినప్పుడు సాక్షిగా వ్యవహరించిన ఆ బిఫామ్పై సంతకం చేసిన ప్రభుత్వ వైద్యుడు బాలాజీ శుక్రవారం కోర్టు విచారణకు హాజరయ్యారు. అయితే డాక్టర్ బాలాజీ ఇచ్చిన సమాధానాలు, ఇతర వివరాలను ప్రసారమాధ్యమాల్లో ప్రచురించకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. | nation |
254 | 09-03-2017 23:46:49 | ఆస్తుల జాబితా నిజమేనా ? |
న్యూఢిల్లీ : మీ ఆస్తుల వివరాలన్నీ న్యాయస్థానానికి సత్య ప్రమాణంగా వెల్లడించారా? కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి 4 కోట్ల డాలర్లను మీ పిల్లలకు బదిలీ చేసినమాట నిజమేనా? బ్యాంకు రుణాల ఎగవేత కేసులో లిక్కర్ కింగ్ మాల్యాకు అత్యున్నత న్యాయస్థానం గురువారం నాడు సంధించిన ప్రశ్నలివి. తన చేతిలో బ్యాంకులకు చెల్లించేందుకు పైసా కూడా లేదని ప్రకటించిన మాల్యాను జస్టిస్ ఆదర్శ్ కుమార్, జస్టిస్ యుయు లలితతో కూడిన ధర్మాసనం తీవ్రంగా నిలదీసింది. మాల్యాపై దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ఉన్న కేసులన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేసే ప్రతిపాదన కూడా న్యాయమూర్తులు ముం దుకు తెచ్చారు. బ్యాంకుల తరఫు న్యాయవాదులను కూడా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. తీవ్రస్థాయిలో సుదీర్ఘంగా జరిగిన వాదోపవాదాల సందర్భంగా మాల్యా తరఫు న్యాయవాది కూడా కోర్టుపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే మాల్యా తరఫు న్యాయవాది వైద్యనాధన్ మాత్రం, తన క్లయింటు కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తే అక్కడే కోర్టు ధిక్కారణ కేసు నమోదుచేయాలని వాదించారు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కారణ అభియోగం చేపడితే తన క్లయింటుకు అప్పీల్ చేసుకునే హక్కు లేకుండా పోతుందని పేర్కొన్నారు. వ్యాపారంలో వచ్చిన నష్టాలకు తన క్లయింటును టార్గెట్ చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. దేశంలో 7 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల ఎగవేతలుండగా కేవలం మాల్యా వెనక బడటం ఏమిటని ప్రశ్నించారు. మాల్యాను టెర్రిరిస్టు కంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. | business |
2,438 | 01-12-2017 01:00:06 | ద్రవ్య లోటు భయాలతో సెన్సెక్స్ ఢమాల్ | సెన్సెక్స్ 453 పాయింట్ల పతనం రూ.1.06 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లుముంబై : స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 453.41 పాయింట్ల నష్టంతో 33149 వద్ద, 134.75 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 10226 వద్ద ముగిశాయి. గత ఏడాది కాలంలో సెన్సెక్స్, నిఫ్టీ ఇంత భారీగా నష్టపోవడం ఇదే మొదటిసారి. బ్యాంకింగ్, ఎనర్జీ, మెటల్, పిఎస్ యు, ఆటో, ఐటి, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, టెక్నాలజీ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ కంపెనీల షేర్లు మాత్రమే కొద్దిపాటి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ షేర్లలో డాక్టర్ రెడ్డీస్, ఎన్టిపిసి లాభాలతో క్లోజయ్యాయి. నిఫ్టీ కీలక మద్దతు స్థాయి 10300 దిగువకు రావడంతో మరింత ఒత్తిడి తప్పక పోవచ్చని టెక్నికల్ అనలిస్టుల అంచనా. గురువారంనాటి పతనం తో రూ.1.06 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచి పెట్టుకుపోయింది. స్టాక్ మార్కెట్ పతనానికి కారణమేమంటే.. ద్రవ్య లోటు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లోనే ద్రవ్య లోటు బడ్జెట్లో నిర్ణయించిన లక్ష్యంలో 96 శాతానికి చేరడం మార్కెట్ను భయపెడుతోంది. గత ఏడాది ఇదే సమయంలో ఇది 91.3 శాతం మాత్రమే. దీంతో ఈ సంవత్సరం ద్రవ్య లోటును జిడిపిలో 3.2 శాతం వద్ద కట్టడి చేయాలన్న ప్రఽభుత్వ లక్ష్యం సాధ్యంకాకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.జిడిపి అంచనాలు గురువారం మార్కెట్ ట్రేడింగ్ ముగిశాక వెలువడనున్న రెండో త్రైమాసిక జిడిపి గణాంకాలూ మార్కెట్ గమనాన్ని ప్రభావితం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక జిడిపి వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో రెండో త్రైమాసిక జిడిపి గణాంకాలు ఎలా ఉంటాయోనని మార్కెట్వర్గాలు ఆచితూచి వ్యవహరించాయి. ఎఫ్ అండ్ ఒ సెటిల్మెంట్ నవంబరు నెల ఆఖరి గురువారంకావడంతో చాలా మంది ఆపరేటర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఒ) సెగ్మెంట్లో తమ కాంట్రాక్ట్లు సెటిల్ చేసుకునేందుకు తమ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసుకోవడమూ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఒపెక్ సమావేశంచమురు ధరల సెగ మార్కెట్ను భయపెట్టింది. త్వరలో జరిగే సమావేశంలో ఒపెక్ దేశాలు, నాన్ ఒపెక్ దేశాలు ముడి చమురు ఉత్పత్తిలో కోతను వచ్చే ఏడాది చివరి వరకు పొడిగించేందుకు అంగీకరించబోతున్నాయన్న వార్త లు మార్కెట్ను భయపెట్టాయి. చమురు ధర పెరిగితే ద్రవ్య లోటు పెరగడంతో పాటు ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భయపెడుతున్నాయి.రూపాయి డీలాస్టాక్ మార్కెట్తో పాటు గురువారం రూపాయి మార కం రేటు నీరసించింది. గత మూడు రోజుల్లో డాలర్ మారకంలో 39 పైసలు పెరిగిన రూపాయి ఒక దశలో రూ.64.63 పైసలకు పడిపోయింది. చివరికి 15 పైసల నష్టంతో రూ.64.46 వద్ద ముగిసింది. ద్రవ్య లోటు భయంతో పాటు చమురు ధరల పెరుగుదల రూపాయిని భయ పెడతున్నాయి. దిగుమతిదారుల నుంచి డిమాండ్ పెరగడమూ డాలర్కు కలిసొచ్చింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఐపిఒకు గ్రీన్ సిగ్నల్రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు సెబి ఆమోదం తెలిపింది. తాజా షేర్లలో పాటు ఈ కంపెనీ 6.7 కోట్ల షేర్లను పబ్లిక్ ఇష్యూ ద్వారా జారీ చేయబోతోంది. ఇష్యూ ధర, సమీకరించే మొత్తాన్ని త్వరలో నిర్ణయిస్తారు. | business |
4,259 | 29-05-2017 01:07:40 | గుదిమెళ్ళ రామానుజాచార్య పురస్కారం |
కవిరత్న గుదిమెళ్ళ రామానుజాచార్య కవితా పురస్కారాన్ని డా.అద్దంకి శ్రీనివాస్గారికి మే 29న సా.5గం.లకు ప్రదానం చేస్తున్నాం. వేదిక హైదరా బాద్ బిహెచ్ఈల్లోని వెంకటేశ్వరస్వామి ఆలయం.- కవిరత్న గుదిమెళ్ళ ఫౌండేషన్ | editorial |
3,494 | 19-02-2017 23:54:17 | భారతీయ సాహిత్యం - యువత |
- జి. ధనలక్ష్మి | editorial |
5,766 | 09-03-2017 19:42:51 | మెగా ఫ్యాన్స్పై సెటైర్ వేసిన అనసూయ |
స్మాల్ స్క్రీన్ యాంకర్లకు గ్లామర్ పాఠాలు నేర్పిన అనసూయ సిల్వర్ స్క్రీన్పై అదే రేంజ్లో చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. బుల్లితెరను, వెండితెరను సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ అల్లల్లాడిస్తున్న సెక్సీ సుందరి మరోసారి మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయింది. గతంలో ఓ సారి ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ఐటమ్ సాంగ్ను రిజెక్ట్ చేసి, మెగా ఫాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొన్న అనసూయ సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’ చిత్రంలో తళుక్కుమనడంతో దాని నుంచి బయటపడుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ సారి నేరుగా మెగా ఫ్యామిలీపైనే సెటైర్ వేసిన అనసూయ మరోసారి కొరివితో తలగొక్కున్నట్లయింది. ఇటీవల విన్నర్ టీంతో ఇంటర్వూ నిర్వహించింది అనసూయ. మాటల మధ్యలో మెగా అభిమానుల ప్రస్తావన రావడంతో వారెప్పుడు పొంగిపొర్లుతూ ఉంటారని కామెంట్ చేసింది. అసలే తనపై కత్తి ఎక్కుపెట్టారని నోటితో చెప్పకపోయనా సైగలతో అదే అర్థం వచ్చేటట్లు స్పష్టం చేసింది. ఇంతలో ధరమ్తేజ్ కల్పించుకుని మ్యాటర్ను పక్కకు తప్పించాడు. | entertainment |
19,555 | 10-01-2017 19:23:37 | ధోనీ మాస్టర్ మైండ్ స్కెచ్కు వెంటవెంటనే వికెట్లు డౌన్ | ముంబై: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ధోనీ చివరిగా ఇంగ్లండ్తో జరుగుతున్న మొదటి వార్మప్ మ్యాచ్కు సారధిగా వ్యవహరిస్తున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ధోనీ సేన ఐదు వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. అయితే తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాట్స్మన్ దూకుడుగా ఆట మెదలుపెట్టారు. 95 పరుగుల వరకూ ఒక్క వికెట్ పడలేదు. నెహ్రా, హార్ధిక్ పాండ్యా, మోహిత్ శర్మలు 15 ఓవర్లపాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో కూల్ కెప్టెన్ ధోనీ తన స్కెచ్ మార్చి కుల్దీప్ యాదవ్, చహల్లను రంగంలోకి దించాడు. అంతే వెంట వెంటనే వరుస ఓవర్లలో మూడు వికెట్లు పడ్డాయి. దీంతో మ్యాచ్ అదుపు తప్పుతున్న పరిస్థితి భారత్ చేతిలోకి మారింది. ఓపెనర్లు జాసన్ రాయ్ 62, అలెక్స్ హేల్స్ 40 పరుగుల వద్ద ఉండగా కుల్దీప్ యాదవ్ తన మొదటి రెండు ఓవర్లలోనే ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లేనే చహల్ మూడో వికెట్గా ఇయాన్ మోర్గాన్ను 3 పరుగుల వద్ద పెవీలియన్కు పంపాడు. అయితే ఇక్కడ ధోనీ ఏం చేశాడంటే కుల్దీప్ యాదవ్ను మూడు ఓవర్లు మాత్రమ వేయించి మళ్లీ మోహిత్ శర్మను రంగంలోకి దించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ లెవన్ జట్టు స్కోర్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 122/3. మ్యాచ్ గెలిచేందుకు ఇంకా 183 పరుగులు చేయాల్సి ఉంది. స్కోర్ వివరాలు..ఇండియా ఏ బ్యాటింగ్ : మన్దీప్ సింగ్ 8, శిఖర్ ధావన్ 63, అంబటి రాయుడు 100, యువరాజ్ సింగ్ 56, ధోనీ 68(నాటౌట్), సంజూ శాంమ్సన్ 0, హర్ధిక్ పాండ్యా 4(నాటౌట్). మొత్తం 50 ఓవర్లకు 304/5. ఇంగ్లండ్ లెవన్ బ్యాటింగ్ : జాసన్ రాయ్ 62, అలెక్స్ హేల్స్ 40, శ్యామ్ బిల్లింగ్స్ 12(బ్యాటింగ్) , ఇయాన్ మోర్గాన్ 3, జోస్ బట్లర్ 5 బ్యాటింగ్.. | sports |
5,284 | 04-03-2017 10:46:58 | సమంత కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసే బయటకు వెళ్తాడట! | తాజాగా చైతూకు సంబంధించిన ఓ కొత్త విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా తెలియజేసింది. చైతూ గ్యాస్ స్టౌవ్ దగ్గర నిల్చుని తన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. ‘తను నాకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసిన తర్వాతే బయటకు వెళ్తాడు. ఈ ప్రపంచానికి నేనే మహారాణి అనుకునేలా చేసిన దేవుడికి మోకాళ్లపై కూర్చుని అభివాదం చేస్తున్నాన’ని సమంత పోస్ట్ చేసింది. | entertainment |
15,812 | 15-05-2017 17:59:55 | ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో.. తొలి రోజే విపక్షాల రగడ | లక్నో: ఉత్తర ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే తొలి రోజే విపక్షాలు సభలో గొడవ చేశాయి. ఆ రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి. సమాజ్వాదీ, బీఎస్సీ సభ్యులు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. స్పీకర్తో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విపక్ష పార్టీల సభ్యులను సముదాయించేందుకు ప్రయత్నించారు. | nation |
16,265 | 07-06-2017 02:32:03 | లౌకిక విలువల్ని కాపాడే వ్యక్తే రాష్ట్రపతి: సీపీఎం | న్యూఢిల్లీ, జూన్ 6(ఆంధ్రజ్యోతి): లౌకిక, రాజ్యాంగ విలువల్ని కాపాడే వ్యక్తిని రాష్ట్రపతిగా నియమించాలని సీపీఎం పొలిట్ బ్యూరో నిర్ణయించిందని బీవీ రాఘవులు తెలిపారు. పొలిట్ బ్యూరో రెండ్రోజుల సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికపై ప్రముఖంగా చర్చించామని, లౌకికవాదినే రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించామని రాఘవులు తెలిపారు. | nation |
15,650 | 01-09-2017 02:27:52 | టీచర్ కాదు.. శాడిస్ట్! | చిన్నారిని 40సార్లు కొట్టిన ఉపాధ్యాయినిహాజరు చెప్పనందుకే..లఖ్నవ్, ఆగస్టు 31: మితిమీరిన కోపంతో మానవత్వం మరిచి ఓ చిన్నారిపై ప్రతాపం చూపించింది ఓ ఉపాధ్యాయురాలు. హాజరు పలకలేదని బాలుడిని 40 సార్లు కొట్టింది. లఖ్నవ్లోని ఓ పాఠశాల క్లాస్రూమ్లో జరిగిన ఈ ఉదంతాన్ని సీసీటీవీ రికార్డు చేసింది. హాజరుపలకలేదనే కారణంతో రేతిక వి జాన్ అనే ఉపాధ్యాయురాలు మూడో తరగతి చదువుతున్న చిన్నారిని టై పట్టుకుని లాక్కొచ్చి రెండు చేతులతోనూ ఆపకుండా ఏడాపెడా 40 సార్లు కొట్టింది. దీంతో ఆ చిన్నారి బుగ్గలు కమిలిపోయాయి. బాలుడు ఇంటికొచ్చాక స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల యజమాన్యానికి ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ చూసిన ప్రిన్సిపాల్ ఆ టీచర్ను విధుల్లోంచి తొలగించారు. బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదుతో ఆమెను పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, ఇటీవల అంకెలు సరిగ్గా చదవడం లేదని ఓ చిన్నారిని ఆమె తల్లి కొట్టిన వీడియో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. | nation |
3,602 | 09-09-2017 04:34:08 | మృత్యుబాటలు! | దేశంలో రోడ్డు ప్రమాదాలు నాలుగుశాతం మేరకు తగ్గినందుకు సంతోషించాలో, ఇప్పటికీ రోజుకు నాలుగువందల మంది మరణిస్తున్నందుకు విచారించాలో అర్థంకావడం లేదు. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ‘భారత్లో రోడ్డు ప్రమాదాలు– 2016’ నివేదిక అటు ప్రభుత్వమూ, ఇటు ప్రజలూ ఎంతో మారవలసిన అవసరం తెలియచెబుతున్నది. ఈ నివేదిక ప్రకారం గత ఏడాది నాలుగు లక్షల ఎనభైవేల ప్రమాదాలు జరిగితే, అందులో లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ 5 లక్షల మంది తీవ్రంగా గాయపడ్డారు. రికార్డుల్లోకి ఎక్కని ప్రమాదాలు అధికసంఖ్యలోనే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న నాలుగువందల మందిలో దాదాపు సగం 18 నుంచి 35 ఏళ్ళలోపు వారే కావడం సమస్య తీవ్రతను తెలియ చెబుతున్నది. ఈ నివేదిక ప్రకారం 86 శాతం ప్రమాదాలు 13 రాష్ట్రాల్లోనే జరిగాయి. అధిక రోడ్డుప్రమాదాలు జరుగుతున్న వాటిలో తెలుగురాష్ట్రాలు రెండూ ఉన్నాయి. తొలిస్థానాల్లో కాకున్నా జాగ్రత్తపడాల్సిన ర్యాంకుల్లోనే ఉన్నాయి. 85 శాతం రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని నివేదిక తేల్చింది. 80 శాతం మరణాలకు, 83 శాతం మంది గాయపడ్డానికీ డ్రైవర్ల అలసత్వం, తప్పిదాలే కారణమట. గంటకు 17 మందిని బలితీసుకుంటున్న ఈ ప్రమాదాలకు ప్రధానకారణాలు అతివేగం, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం. 2015తో పోల్చినప్పుడు రోడ్డుప్రమాదాల సంఖ్య నాలుగుశాతం తగ్గినా, మృతుల సంఖ్య మాత్రం బాగా హెచ్చిందంటే దానర్థం ప్రమాదాల్లో అధికం ప్రాణాంతకంగా మారినట్టు. నడుపుతున్న వాహనం సమర్థతతోగానీ, రోడ్డు స్థితిగతులతో గానీ, వేగచిహ్నాలతో గానీ నిమిత్తం లేకుండా దూసుకుపోతున్నందునే మరణాలు హెచ్చుతున్నాయన్నది నిర్వివాదాంశం. అతివేగమే 70 శాతం ప్రాణాలను తీస్తున్నదని నివేదిక తెలియచెబుతున్నది. 1970ల తరువాత అత్యధిక మరణాలు నమోదైన సంవత్సరం ఇదే. నిజానికి రోడ్ల నిర్మాణంలో నాణ్యత పెరుగుతూ, నిర్వహణలో అధునాతన సాంకేతిక వినియోగం హెచ్చుతున్నప్పుడు ప్రమాదాలు, మరణాల సంఖ్య వేగంగా పడిపోవాలి. కానీ, ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తూండటమే భయం కలిగిస్తున్నది. దేశంలోని మొత్తం రోడ్లలో జాతీయరహదారులు కేవలం 2 శాతమే అయినా 30 శాతం ప్రమాదాలు వీటిమీదే జరుగుతున్నాయి. రాష్ట్ర రోడ్లను కూడా కలిపిచూస్తే ఈ ప్రమాదాల సంఖ్య 65 శాతానికి పెరుగుతున్నది. అంటే, రోడ్డు కాస్తంత విశాలంగా, ఖాళీగా కనిపిస్తే అనేకులకు ఒళ్ళు తెలియడం లేదని అర్థం. ద్విచక్రవాహనాల ప్రమాదాల్లో సంభవించిన మరణాల్లో అధికం హెల్మెట్ లేని కారణంగానే జరిగినట్టు నివేదికను బట్టి అర్థమవుతున్నది. మొబైల్ పిచ్చి బాగా ముదిరిపోయినందున అది కూడా ప్రాణాలు తీస్తున్నది. వాహనం మీద వెడుతూ మొబైల్ వాడినందున రెండున్నర వేలమంది మరణించారు. మొబైల్ మాట్లాడుతూ వాహనం నడుపుతున్న వారిపై విధిస్తున్న వెయ్యి రూపాయల పెనాల్టీని ఐదువేలకు పెంచేందుకు వీలుగా మోటారువాహనాల చట్టాన్ని కేంద్రప్రభుత్వం సవరించబోతున్నది. నిర్లక్ష్యం మూర్తీభవించిన వారిలో ఇది ఎంతమేరకు మార్పు తీసుకువస్తుందో చూడాలి. ప్రమాదాల సంఖ్యలో తమిళనాడు, మరణాల సంఖ్యలో ఉత్తర్ప్రదేశ్ ఈ నివేదికలో ప్రథమస్థానాలు సంపాదించుకున్నాయి. రోడ్డుమీద బాధ్యతారాహిత్యంగా వాహనాన్ని నడిపి, దారినపోతున్న వారి ప్రాణాలు తీయడం ఇటీవలి కాలంలో బాగా హెచ్చింది. వీరి నిర్లక్ష్యం కారణంగా స్కూలు పిల్లల్లో, వాకింగ్కు వచ్చిన వృద్ధులో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ను ఖాతరు చేయకపోవడం, తప్పుడుదారుల్లో ప్రయాణించడం ఫ్యాషన్గా మారిపోయింది. రాంగ్రూట్ ప్రయాణాలు 17వేలకు పైగా ప్రమాదాలకు, 5వేలకు మించిన మరణాలకు కారణమని ఈ నివేదిక చెబుతున్నది. మద్యం సేవించి వాహనాలు నడపడం గతంలో సుదీర్ఘ ప్రయణాలు చేసే లారీ డ్రైవర్లలోనే ఉండేది. కానీ, అది ఇప్పుడు అందరిలోనూ హెచ్చింది. పట్టపగలు పబ్బులో పూటుగా తాగి, ఆ మత్తులో కారును వేగంగా నడిపి కొందరు యువకులు ఓ చక్కని కుటుంబాన్ని నాశనం చేసిన ఘటన ఈ మధ్య హైదరాబాద్లో చూశాం. ఇక, వాహనదారుల నిర్లక్ష్యం ఒక్కటే ప్రమాదాలకు, మరణాలకు కారణం కాదని నితిన్ గడ్కరీ అంగీకరించినందుకు సంతోషం. వచ్చే రెండేళ్ళలో ప్రమాద మరణాల సంఖ్యను యాభైశాతం తగ్గిస్తామని ఆయన మాట ఇస్తున్నారు. పార్లమెంటులో ఆమోదం కోసం ఎదురుచూస్తున్న రోడ్సేఫ్టీ బిల్లు ఆమోదం పొందగానే ప్రభుత్వం రంగంలోకి దిగుతుందనీ, 12వేల కోట్లతో రహదారులను మెరుగుపరచే పని చేపడుతుందనీ అంటున్నారు. విశాలంగా, నునుపుగా కనిపించే చాలా రహదారులు ఇంజనీరింగ్ లోపాల కారణంగా ప్రాణాంతంగా పరిణమించిన విషయం తెలిసిందే. జాతీయ రహదారుల్లో ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించి సరిదిద్దడం, ఎక్కడికక్కడ బారికేడ్లను, హెచ్చరిక లైట్లను ఏర్పాటు చేయడం వంటివి ప్రధానంగా జరగాలి. జాతీయ రహదారుల్లో వాహనదారులు వేగాన్ని నియంత్రించుకోకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణం కనుక వేగనియంత్రణ వ్యవస్థలు విస్తృతంగా ఏర్పాటు కావాలి. రిపేరుకొచ్చి రోడ్డుమీద నిలిచిపోయిన వాహనాలను తక్షణమే పక్కకు తరలించే ఏర్పాట్లు అధికం కావాలి. పార్కింగ్ జోన్లంటూ ఉన్నా అక్కడిదాకా పోకుండా వాహనాలను రోడ్డుమీదే నిలిపివేస్తున్న డ్రైవర్ల నుంచి వాటిని స్వాధీనం చేసుకొని, భారీ పెనాల్టీ విధించాలి. ఇక, రాష్ట్ర రహదారుల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత శ్రద్ధగా ఉన్నాయో కనిపిస్తూనే ఉన్నది. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు వద్దని సుప్రీంకోర్టు అనగానే, అతివేగంగా వాటిని రాష్ట్ర రహదారులుగా మార్చివేసి మద్యం దుకాణదారులను, మద్యం వ్యాపారాన్నీ కాపాడుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డుప్రమాదాలనుంచి ప్రజలను కాపాడటానికి ఎంతోకొంత చేస్తే సంతోషం. | editorial |
9,183 | 04-11-2017 19:04:49 | కాజల్ కామెడీ స్పూన్.. | కామెడీ చేయడం మాకు కూడా వచ్చంటూ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఓ సెన్సేషనల్ పోస్ట్ చేసింది. తన ఇన్స్ట్రాగ్రమ్ పేజీలో ఓ పెద్ద స్పూన్ పట్టుకుని తినబోతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో చూస్తే ఎవరికైనా నవ్వు రావాల్సిందే. అంతేకాదు 'స్పూన్ నిండుగా సుగర్. మరి ఈ స్పూన్ సైజ్ ఎంతో ఎవరైనా చెప్పగలరా?' అంటూ ఓ ప్రశ్న కూడా సంధించింది కాజల్. మరి ఇంత పెద్ద స్పూన్తో కాజల్ కామెడీ చేయాలని చూస్తే.. కాజల్పై అదిరిపోయే కామెంట్స్తో నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఓ కామెంట్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'అంత పెద్ద స్పూన్తో తింటే లావైపోతావ్ జాగ్రత్త' అంటూ నెటిజన్ పెట్టిన కామెంట్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'ఓ మై గాడ్' అంటూ ఈ ఫొటో చూసిన వారంతా రిప్లైలు ఇస్తుండటం విశేషం. | entertainment |
7,591 | 15-12-2017 10:13:24 | రాజమౌళి సూచనపై కత్తి మహేశ్ సంచలన కామెంట్..! | ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఏదో ఒక అంశంపై సందర్భానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న కత్తి మహేశ్.. రాజమౌళి సూచన(తెలుగుతల్లిపై సూర్య కిరణాలు)పై సంచలన కామెంట్ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమరావతిలో జరగబోయే నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లపై కొన్ని సూచనలు చేయాలంటూ రాజమౌళిని చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అసెంబ్లీ భవన డిజైన్పై రాజమౌళి ఒక సూచన చేశాడు. ఏపీలో నిర్మించనున్న అసెంబ్లీ భవనానికి సంబంధించిన డిజైన్లలో ఒక దానిని దాదాపు ఖరారు చేశారు. అందులో ఎత్తైన టవర్ నుంచి అసెంబ్లీ సెంట్రల్ హాలులోకి సూర్యకిరణాలు పడేలా నార్మన్ ఫోస్టర్ డిజైన్ రూపొందించింది. అయితే దర్శకుడు రాజమౌళి తన మార్కు కళాత్మకతకు పదును పెట్టి, అసెంబ్లీ సెంట్రల్ హాలులో తెలుగు తల్లి విగ్రహంపై సరిగ్గా ఉదయం 9.15 గంటలకు కిరణాలు పడేలా ఏర్పాటు చేయాలని సూచించారు. అలా సూర్య కిరణాలు పడుతున్న తెలుగుతల్లి గ్రాఫిక్ వీడియోను రూపొందించిన రాజమౌళి దానిని విడుదల చేశాడు. దీనిపై కత్తి మహేశ్ సోషల్ మీడియాలో స్పందించాడు. ‘‘తొలి కిరణం.. తెలుగు తల్లి పాదాలను తాకకపోతే వచ్చే నష్టం ఏదైనా ఉందా..?’’ అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే అతడు పెట్టిన పోస్టుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన వాదనను సమర్ధిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రాజమౌళి గురించి కొన్ని సరికొత్త సంగతులు పవన్ ఫ్యాన్స్ మహేశ్పైకి ఎందుకు ‘కత్తి’ దూశారు? | entertainment |
19,573 | 15-11-2017 00:53:45 | సైనాకు అనుష్క సర్‘ప్రైజ్’..! | న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ను బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రత్యేక గిఫ్ట్తో సర్ప్రైజ్ చేసింది. ఇటీవలే అనుష్క ‘నుష్’ పేరుతో దుస్తుల బ్రాండ్ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కొన్ని షర్ట్లను సైనాకు బహుమతిగా ఇచ్చింది. అనూహ్య బహుమానంతో సంభ్రమాశ్చ ర్యాలకు లోనైన సైనా.. ట్విటర్ వేదికగా అనుష్కకు ధన్యవాదాలు తెలిపింది. ‘వ్యాపారంలోకి అడుగుపెట్టినందుకు శుభాకాంక్షలు.. త్వరలో ఈ షర్ట్లను ధరిస్తాన’ని ట్వీట్ చేసింది. విరాట్ కోహ్లీ ఫౌండేషన్.. గత వారం నిర్వహించిన ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్ అవార్డుల కార్యక్రమంలో అనుష్క శర్మను సైనా కలుసుకుంది. | sports |
18,806 | 22-01-2017 13:56:34 | హర్షాతిరేకాలతో జల్లికట్టు... విజేతలకు నగదు బహుమతులు | చెన్నై : తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆదివారం జల్లికట్టును నిర్వహించారు. తిరుచిరాపల్లి సహా చాలా చోట్ల సంప్రదాయబద్ధంగా ఎద్దులతో పోరాడారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి అళంగనళ్ళూరులో జల్లికట్టును ప్రారంభించవలసి ఉంది. కానీ అక్కడి ప్రజలు తమకు శాశ్వత పరిష్కారం కావాలని, తాత్కాలిక ఆర్డినెన్స్ కాదని పట్టుబట్టడంతో జల్లికట్టు రద్దయింది. దీంతో ఆయన దిండిగల్లులో జల్లికట్టును ప్రారంభిస్తారని సమాచారం. తిరుచిరాపల్లిలోని మనపురాయ్లో జల్లికట్టు ఆనందోత్సాహాల మధ్య ప్రారంభమైంది. వేలాది మంది ప్రజలు సంతోషంతో కేరింతలు కొట్టారు. దూసుకొస్తున్న ఎద్దును అదుపు చేసేందుకు యువకులు సాహసోపేతంగా ప్రయత్నించారు. వందలాది ఎద్దులతోపాటు యువత ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గెలిచిన ఎద్దులకు, యువతకు నగదు బహుమతులు ఇచ్చారు. జల్లికట్టుకు మరో రూపమైన మంజువిరాట్టును ధర్మపురి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో నిర్వహించారు. | nation |
15,439 | 18-07-2017 15:03:48 | వ్యక్తిగత గోప్యతపై ప్రత్యేక ధర్మాసనం |
న్యూఢిల్లీ : వ్యక్తిగత గోప్యతకు రక్షణ ఉండాలా? ఈ హక్కు రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుల్లో భాగమేనా? అనే అంశాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని మంగళవారం ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనంలో 9 మంది న్యాయమూర్తులు ఉంటారు. ఆధార్ సంఖ్యను పాన్ సంఖ్యతో అనుసంధానం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఈ 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం నుంచి విచారణ ప్రారంభిస్తుంది. 1954లో 8 మంది న్యాయమూర్తుల ధర్మాసనం, 1962లో ఆరుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుల్లో ప్రైవసీ హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదని స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఈ తీర్పులపై ఆధారపడింది. వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ) హక్కు అనేది సాధారణ చట్టం ప్రకారం లభించినదని, దానిని ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం గుర్తించలేదని కేంద్ర ప్రభుత్వం వాదించింది. | nation |
3,310 | 06-06-2017 01:17:47 | ధర్మకాంట దండి కొట్టొద్దు! | తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఎదగాలనుకున్న భారతీయ జనతా పార్టీ కేసీఆర్కు, తెరాసకు వ్యతిరేకంగా మాట్లాడడంలో అభ్యంతరం లేదు. కానీ, యావత్ దేశం, అంతర్జాతీయ యవనికపై తెలంగాణ రాష్ట్రం కీర్తి ప్రతిష్టలకు మసకబారే విధంగా మాట్లాడటంపైనే అభ్యంతరం. తెలంగాణను, ఇక్కడి ప్రజలను అవమానించే విధంగా వ్యవహరించడం వల్ల ఒక రాజకీయ పార్టీగా ఎంత నష్టపోతుందో బీజేపీ తెలుసుకోవాలి. అమిత్ షా తెలంగాణ పర్యటనతో భారతీయ జనతా పార్టీ వైఖరి అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో పెట్టినట్టుగా ఉందని మరోసారి రుజువయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినా కేంద్రం వివక్ష మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆంధ్రానాయకుల అభీష్టానికి వ్యతిరేకంగా ఏర్పడిన రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష భాజపా పాలనలోనూ తారాస్థాయికి చేరింది. అరవై ఏండ్ల ఆంధ్ర పాలనలో అన్ని రకాల దోపిడీకి, వివక్షకు, అవమానాలకు, అణచివేతలకు గురైన ప్రాంతం సత్వర అభివృద్ధికి చర్యలు తీసుకోవడంలో కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతున్నది. కేంద్రంలో ధర్మపీఠంపై కూర్చున్న పార్టీ ఇరు ప్రాంతాలను సమదృష్టితో చూడాలి. కానీ, ఒక ప్రాంతం వైపే త్రాసు దండి (మొగ్గు చూపడం) కొడుతున్నది. భారతీయ జనతాపార్టీ మొదటి నుంచీ పుండు మీద కారం చల్లినట్టుగా, ఉరికేటోని కాళ్లల్ల కట్టె పెట్టినట్టుగా తెలంగాణ కాలుపట్టి గుంజే యత్నం ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నదో తెలుసుకోలేని తెలివి తక్కువవారు కారు ప్రజలు. ఉద్యమంలో రాటు దేలిన ప్రజలు ప్రతి పరిణామాన్ని సులువుగా, శీఘ్రంగా విశ్లేషించి, అవగతం చేసుకుంటారు. దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి అన్ని ప్రాంతాలను, ముఖ్యంగా ఇటీవలనే వేరుపడ్డ ఇరు రాష్ట్రాలను సమదృష్టితో చూడాలనే సోయి ఉండాలి. కానీ, భాజపా అధ్యక్షుని మూడు రోజుల తెలంగాణ పర్యటన ఆంధ్రావైపు దండి గొట్టే విధంగా ఉంది. పైగా కావాలనే దండి కొట్టినట్టు తెలంగాణ ప్రజలకు తెలిసే విధంగా నడుచుకోవడం ఆగ్రహం తెప్పించే అంశం. తెలుగుదేశం పార్టీతో అంటకాగడం వల్ల, తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా భాజపాకు నష్టదాయకమని గ్రహించే ఇంగితం ఆ పార్టీ నాయకులకు కొరవడింది. లీవ్ టీడీపీ, సేవ్ బీజేపీ అని అమరావతిలో వినిపించిన నినా దాలను బట్టి రాష్ట్ర, జిల్లా నాయకత్వం భాజపా అధిష్టానం దృష్టిలో పిపీలికంతో సమానమని తేలింది. తెలంగాణ పర్యటన పూర్తయిన మరునాడే చంద్ర బాబు నాయుడుతో అమిత్ షా జతకట్టి భుజం భుజం రాసుకొని తిరుగడంతో కథ ఏమిటో బయట పడింది. అమిత్ షా, చంద్రబాబు నాయుడు ఒకే విమా నంలో పయనమై విజయవాడలో కలిసి లంచ్ చేశారు. కలసి వేదికలు పంచు కున్న సభలు, సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వంపై ఒక్క నెగటివ్ మాట కూడా మాట్లాడకపోవడం, పైసా లెక్క అడుగక పోవడం వంటి పరిణామాలు మాంత్రి కుని మాటలు చిలుక నోటి నుంచి వచ్చినట్టు తెలంగాణలో అమిత్ షా పలుకులు ఏ మాంత్రికునివో ఇక్కడి ప్రజలు అర్థం చేసుకోలేరనే భ్రమల్లో భాజపా నాయత్వం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఎదగాలనుకున్న పార్టీ కేసీఆర్కు, తెరాసకు వ్యతిరేకంగా మాట్లాడడంలో అభ్యంతరం లేదు. కానీ, యావత్ దేశం, అంతర్జాతీయ యవనికపై తెలంగాణ రాష్ట్రం కీర్తి ప్రతిష్టలకు మసకబారే విధంగా మాట్లాడటంపైనే అభ్యంతరం. తెలంగాణను, ఇక్కడి ప్రజలను అవమానించే విధంగా వ్యవహరించడం ఒక రాజకీయ పార్టీగా తానూ ఎంత నష్టపోతుందో బీజేపీ తెలుసుకోవాలి. ఈత రానోన్ని నమ్ముకొని ఈతొచ్చినోడూ మునిగినట్టు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించి నష్టపోయిన పార్టీల వెంటపోయి ఉన్న ఊపిరినీ ఉఫ్ మనిపించే కాడికి తెచ్చుకుంటున్నది. నీళ్లు, నిధులు, నియామకాల పునాదిగా ఏర్పడిన తెలంగాణకు అన్ని రకాలుగా నష్టం కలిగించే పోలవరం ప్రాజెక్టును కేంద్రంలో ఉన్న భాజపా సర్కార్ జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తున్నది. మరి విభజన సమయంలో తెలంగాణకూ జాతీయ ప్రాజెక్టు ఇస్తామన్న హామీ కేంద్ర నాయకత్వానికి గుర్తులేదా? రాష్ట్ర నాయకత్వమూ మర్చిపోయిందా ? ఎన్నికల పొత్తు పెట్టుకున్న తేదేపాను సంతోష పెట్టడానికి అన్యాయంగా ఏడు మండలాలను తెలంగాణ నుంచి దూరం చేసి, ఆంధ్రలో విలీనం చేయడం ఇంకా ప్రజల మదిలో తాజాగా ఉన్నది. పోలవరం ప్రాజెక్టు కింద మునుగుతున్న అనేక గ్రామాలు, లక్షలాది మంది ఆదివాసి నిర్వాసితుల గురించి తెలంగాణ నాయకులతో సహా ఏ ఒక్కరూ మాట్లాడరు. న్యాయ వ్యవస్థతో పాటు రాష్ట్రంలోని ఆస్తుల పంపకాలు జరిగితేనే రాష్ట్ర విభజన పరిపూర్ణం అవుతదన్న రాజ్యాంగపరమైన సోయి కేంద్రానికి ఉండొద్దా? పైగా హైకోర్టు విభజన గురించి అడిగితే ‘‘హైకోర్టు హైదరాబాద్ లోనే ఉంది కదా?’’ అని ఆంధ్రపార్టీల మాదిరిగా మాట్లాడటం భాజపా పక్షపాతానికి నిదర్శనం. నష్టపోయిన వాటిని దక్కించుకునేందుకు, రాజ్యాంగ హక్కులు రాబట్టుకునేందుకు ఇప్పటికైనా తెలంగాణ పౌరసమాజం అంతా కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతాపార్టీలో తెలంగాణ నుంచి ఉన్న ఏకైక ఎం.పిదత్తన్న. అడుక్కోంగా అడుక్కోంగా ఒక్క పదవి ఇచ్చారు. అదీ కూడా క్యాబినెట్ ర్యాంకు లేకుండా. అందుకేనేమో ఆయన అసలే మాట్లాడడు, మాట్లాడితే వినటోడే ఉండడు. ఆంధ్రలో మాత్రం వెంకయ్యనాయుడు, సృజనా చౌదరి, నిర్మలా సీతారామన్ ముగ్గురికి క్యాబినెట్ ర్యాంకే. మోదీ తర్వాతి స్థానంలోని వెంకయ్య నాయుడైతే చక్రం తిప్పని చోటు లేదు. ఇది తెలంగాణ పట్ల వివక్ష కాక మరేమైతది? తెలంగాణ ఏర్పడిన మూడేండ్లలో కేంద్రం తీరుతో రాష్ట్ర అభివృద్ధి మూరెడు ముందుకు, బారెడు వెనుకకు పోయింది. ఆంధ్ర అవసరాలకు కావలసినవి ప్రపంచంలో ఎక్కడున్నా కొని పెడుతారు. లెక్కలు మాత్రం అడుగరు. తెలంగాణలో అమిత్ షా ఉన్న మూడు రోజుల్లో ముప్పై సార్లు పొంకనాలు కొట్టే లక్షకోట్లు ఇచ్చినామని. ఇదంతా తెలం గాణ ప్రజలు గమనిస్తలేరని అనుకోవటం ఇక్కడ ఉన్న కాస్త పరపతిని బొందపెట్టుకోవడమే అవుతుంది. రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన ప్రజలు తెలంగాణను అవమానించే ఏ విషయాన్నైనా తొందరగా గుర్తిస్తారు. అధికారం కోసం రాజకీయం చేసే హక్కు రాజకీయ పార్టీగా భాజపాకు ఉన్నది గానీ, తెలంగాణ ఆర్థిక అభివృద్ధిని మాత్రం అన్యాయంగా అడ్డుకునే హక్కు లేదు. ‘‘దక్షుడు లేని ఇంట వేలక్షలు వచ్చిపడిన నిలువ నేరునే?’’ అన్నట్లు, అమిత్ షా ఆంధ్ర పెట్టుబడిదారులతో కలిసి ఊరేగడం తెలంగాణలో నష్టదాయకంగా మారింది. ఒక్క తప్పుడు మాట మాట్లాడినందుకు కల్వకుర్తిలో స్వయానా ఎన్టీఆర్నే ఓడించిన చైతన్యం తెలంగాణ ప్రజలది. అమిత్ షాలను మించిన పాదుషాలను సైతం మట్టి కరిపించిన చైతన్యం తెలంగాణకు ఉందని భాజపా యాదుంచుకుంటే మంచిది.-కౌడె సమ్మయ్య అమిత్ షా తెలంగాణ పర్యటనతో భారతీయ జనతా పార్టీ వైఖరి అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో పెట్టినట్టుగా ఉందని మరోసారి రుజువయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినా కేంద్రం వివక్ష మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆంధ్రానాయకుల అభీష్టానికి వ్యతిరేకంగా ఏర్పడిన రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష భాజపా పాలనలోనూ తారాస్థాయికి చేరింది. అరవై ఏండ్ల ఆంధ్ర పాలనలో అన్ని రకాల దోపిడీకి, వివక్షకు, అవమానాలకు, అణచివేతలకు గురైన ప్రాంతం సత్వర అభివృద్ధికి చర్యలు తీసుకోవడంలో కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతున్నది. కేంద్రంలో ధర్మపీఠంపై కూర్చున్న పార్టీ ఇరు ప్రాంతాలను సమదృష్టితో చూడాలి. కానీ, ఒక ప్రాంతం వైపే త్రాసు దండి (మొగ్గు చూపడం) కొడుతున్నది. భారతీయ జనతాపార్టీ మొదటి నుంచీ పుండు మీద కారం చల్లినట్టుగా, ఉరికేటోని కాళ్లల్ల కట్టె పెట్టినట్టుగా తెలంగాణ కాలుపట్టి గుంజే యత్నం ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నదో తెలుసుకోలేని తెలివి తక్కువవారు కారు ప్రజలు. ఉద్యమంలో రాటు దేలిన ప్రజలు ప్రతి పరిణామాన్ని సులువుగా, శీఘ్రంగా విశ్లేషించి, అవగతం చేసుకుంటారు. దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి అన్ని ప్రాంతాలను, ముఖ్యంగా ఇటీవలనే వేరుపడ్డ ఇరు రాష్ట్రాలను సమదృష్టితో చూడాలనే సోయి ఉండాలి. కానీ, భాజపా అధ్యక్షుని మూడు రోజుల తెలంగాణ పర్యటన ఆంధ్రావైపు దండి గొట్టే విధంగా ఉంది. పైగా కావాలనే దండి కొట్టినట్టు తెలంగాణ ప్రజలకు తెలిసే విధంగా నడుచుకోవడం ఆగ్రహం తెప్పించే అంశం. తెలుగుదేశం పార్టీతో అంటకాగడం వల్ల, తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా భాజపాకు నష్టదాయకమని గ్రహించే ఇంగితం ఆ పార్టీ నాయకులకు కొరవడింది. లీవ్ టీడీపీ, సేవ్ బీజేపీ అని అమరావతిలో వినిపించిన నినా దాలను బట్టి రాష్ట్ర, జిల్లా నాయకత్వం భాజపా అధిష్టానం దృష్టిలో పిపీలికంతో సమానమని తేలింది. తెలంగాణ పర్యటన పూర్తయిన మరునాడే చంద్ర బాబు నాయుడుతో అమిత్ షా జతకట్టి భుజం భుజం రాసుకొని తిరుగడంతో కథ ఏమిటో బయట పడింది. అమిత్ షా, చంద్రబాబు నాయుడు ఒకే విమా నంలో పయనమై విజయవాడలో కలిసి లంచ్ చేశారు. కలసి వేదికలు పంచు కున్న సభలు, సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వంపై ఒక్క నెగటివ్ మాట కూడా మాట్లాడకపోవడం, పైసా లెక్క అడుగక పోవడం వంటి పరిణామాలు మాంత్రి కుని మాటలు చిలుక నోటి నుంచి వచ్చినట్టు తెలంగాణలో అమిత్ షా పలుకులు ఏ మాంత్రికునివో ఇక్కడి ప్రజలు అర్థం చేసుకోలేరనే భ్రమల్లో భాజపా నాయత్వం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఎదగాలనుకున్న పార్టీ కేసీఆర్కు, తెరాసకు వ్యతిరేకంగా మాట్లాడడంలో అభ్యంతరం లేదు. కానీ, యావత్ దేశం, అంతర్జాతీయ యవనికపై తెలంగాణ రాష్ట్రం కీర్తి ప్రతిష్టలకు మసకబారే విధంగా మాట్లాడటంపైనే అభ్యంతరం. తెలంగాణను, ఇక్కడి ప్రజలను అవమానించే విధంగా వ్యవహరించడం ఒక రాజకీయ పార్టీగా తానూ ఎంత నష్టపోతుందో బీజేపీ తెలుసుకోవాలి. ఈత రానోన్ని నమ్ముకొని ఈతొచ్చినోడూ మునిగినట్టు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించి నష్టపోయిన పార్టీల వెంటపోయి ఉన్న ఊపిరినీ ఉఫ్ మనిపించే కాడికి తెచ్చుకుంటున్నది. నీళ్లు, నిధులు, నియామకాల పునాదిగా ఏర్పడిన తెలంగాణకు అన్ని రకాలుగా నష్టం కలిగించే పోలవరం ప్రాజెక్టును కేంద్రంలో ఉన్న భాజపా సర్కార్ జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తున్నది. మరి విభజన సమయంలో తెలంగాణకూ జాతీయ ప్రాజెక్టు ఇస్తామన్న హామీ కేంద్ర నాయకత్వానికి గుర్తులేదా? రాష్ట్ర నాయకత్వమూ మర్చిపోయిందా ? ఎన్నికల పొత్తు పెట్టుకున్న తేదేపాను సంతోష పెట్టడానికి అన్యాయంగా ఏడు మండలాలను తెలంగాణ నుంచి దూరం చేసి, ఆంధ్రలో విలీనం చేయడం ఇంకా ప్రజల మదిలో తాజాగా ఉన్నది. పోలవరం ప్రాజెక్టు కింద మునుగుతున్న అనేక గ్రామాలు, లక్షలాది మంది ఆదివాసి నిర్వాసితుల గురించి తెలంగాణ నాయకులతో సహా ఏ ఒక్కరూ మాట్లాడరు. న్యాయ వ్యవస్థతో పాటు రాష్ట్రంలోని ఆస్తుల పంపకాలు జరిగితేనే రాష్ట్ర విభజన పరిపూర్ణం అవుతదన్న రాజ్యాంగపరమైన సోయి కేంద్రానికి ఉండొద్దా? పైగా హైకోర్టు విభజన గురించి అడిగితే ‘‘హైకోర్టు హైదరాబాద్ లోనే ఉంది కదా?’’ అని ఆంధ్రపార్టీల మాదిరిగా మాట్లాడటం భాజపా పక్షపాతానికి నిదర్శనం. నష్టపోయిన వాటిని దక్కించుకునేందుకు, రాజ్యాంగ హక్కులు రాబట్టుకునేందుకు ఇప్పటికైనా తెలంగాణ పౌరసమాజం అంతా కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతాపార్టీలో తెలంగాణ నుంచి ఉన్న ఏకైక ఎం.పిదత్తన్న. అడుక్కోంగా అడుక్కోంగా ఒక్క పదవి ఇచ్చారు. అదీ కూడా క్యాబినెట్ ర్యాంకు లేకుండా. అందుకేనేమో ఆయన అసలే మాట్లాడడు, మాట్లాడితే వినటోడే ఉండడు. ఆంధ్రలో మాత్రం వెంకయ్యనాయుడు, సృజనా చౌదరి, నిర్మలా సీతారామన్ ముగ్గురికి క్యాబినెట్ ర్యాంకే. మోదీ తర్వాతి స్థానంలోని వెంకయ్య నాయుడైతే చక్రం తిప్పని చోటు లేదు. ఇది తెలంగాణ పట్ల వివక్ష కాక మరేమైతది? తెలంగాణ ఏర్పడిన మూడేండ్లలో కేంద్రం తీరుతో రాష్ట్ర అభివృద్ధి మూరెడు ముందుకు, బారెడు వెనుకకు పోయింది. ఆంధ్ర అవసరాలకు కావలసినవి ప్రపంచంలో ఎక్కడున్నా కొని పెడుతారు. లెక్కలు మాత్రం అడుగరు. తెలంగాణలో అమిత్ షా ఉన్న మూడు రోజుల్లో ముప్పై సార్లు పొంకనాలు కొట్టే లక్షకోట్లు ఇచ్చినామని. ఇదంతా తెలం గాణ ప్రజలు గమనిస్తలేరని అనుకోవటం ఇక్కడ ఉన్న కాస్త పరపతిని బొందపెట్టుకోవడమే అవుతుంది. రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన ప్రజలు తెలంగాణను అవమానించే ఏ విషయాన్నైనా తొందరగా గుర్తిస్తారు. అధికారం కోసం రాజకీయం చేసే హక్కు రాజకీయ పార్టీగా భాజపాకు ఉన్నది గానీ, తెలంగాణ ఆర్థిక అభివృద్ధిని మాత్రం అన్యాయంగా అడ్డుకునే హక్కు లేదు. ‘‘దక్షుడు లేని ఇంట వేలక్షలు వచ్చిపడిన నిలువ నేరునే?’’ అన్నట్లు, అమిత్ షా ఆంధ్ర పెట్టుబడిదారులతో కలిసి ఊరేగడం తెలంగాణలో నష్టదాయకంగా మారింది. ఒక్క తప్పుడు మాట మాట్లాడినందుకు కల్వకుర్తిలో స్వయానా ఎన్టీఆర్నే ఓడించిన చైతన్యం తెలంగాణ ప్రజలది. అమిత్ షాలను మించిన పాదుషాలను సైతం మట్టి కరిపించిన చైతన్యం తెలంగాణకు ఉందని భాజపా యాదుంచుకుంటే మంచిది.-కౌడె సమ్మయ్య | editorial |
19,536 | 17-09-2017 01:19:02 | ప్రాంజల జోడీకి టైటిల్ | న్యూఢిల్లీ: థాయ్లాండ్లో జరిగిన ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీలో తెలుగు క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ టైటిల్ గెలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ప్రాంజల-జీల్ దేశాయ్ జోడీ 6-2, 7-5తో వరుస సెట్లలో రుతుజా బోస్లే (భారత్)-వాల్టర్స్ అలెగ్జాండ్రా (ఆస్ర్టేలియా) ద్వయంపై నెగ్గింది. | sports |
12,763 | 12-11-2017 20:30:47 | ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుంటాం... | భోపాల్: చిత్రకూట్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో 14 వేల పైచిలుకు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఓటమిపాలవడంపై ఆ పార్టీలో అంతర్మథనం మొదలైంది. కాంగ్రెస్ అభ్యర్థి నీలాంశు చతుర్వేది తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి శంకర్ దయాళ్ త్రిపాఠిపై 14,133 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. దీనిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని తెలిపారు. ఉప ఎన్నికల్లో స్వీప్ చేసేందుకు బీజేపీ శక్తివంచన లేకుండా కృషి చేసినప్పటికీ ఫలితం నిరాశపరిచిందని అన్నారు. కారణాలను విశ్లేషించుకుంటామని, ఆత్మపరిశీలన చేసుకుంటామని ఆయన మీడియాకు తెలిపారు. నవంబర్ 9న జరిగిన పోలింగ్లో 65 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ మరణించడంతో ఈ ఉపఎన్నికను నిర్వహించారు. | nation |
3,080 | 07-01-2017 01:33:33 | నీతి ఆయోగ్ పరిధి పెంచండి | కేంద్రానికి స్థాయీ సంఘ సూచన న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): నీతి ఆయోగ్ పరిధిని విస్తరించాలని కేంద్ర ప్రణాళికా శాఖకు పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసింది. ఈ సంస్థ విధివిధానాలపై మరింత స్పష్టతనివ్వాలని తెలిపింది. కాంగ్రెస్ సభ్యుడు వీరప్ప మొయిలీ అధ్యక్షతన స్థాయీ సంఘం నీతిఆయోగ్ పనితీరుపై అధ్యయనం చేసి, పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. నీతి ఆయోగ్ సంస్థ ఆవిర్భవించి ఇటీవల రెండేళ్లు పూర్తయ్యింది. ప్రణాళికా సంఘం పాత్ర, బాధ్యతల్లో ఉపయోగకరమైనవి, ఇప్పుడు కూడా ఆచరించతగినవి ఏమేమిఉన్నాయో వాటన్నింటినీ వ్యవస్థీకరించి, మెరుగైన ఫలితాల సాధనకు వాడుకోవాలని కమిటీ సిఫారసు చేసింది. | business |
8,949 | 28-10-2017 17:16:55 | విక్రమ్ ను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ! | ఒకే ఒక్క సినిమాతో తన రేంజ్ పెంచుకున్న టాలీవుడ్ అప్కమింగ్ స్టార్కు అనుకోని ఆహ్వానం లభించిందట. కోలీవుడ్ స్టార్ హీరో నుంచి పిలుపు రావడంతో ఎగిరి గంతేసి కలిసొచ్చాడట మన యంగ్ హీరో. 'అర్జున్ రెడ్డి' తరువాత హీరో విజయ్ దేవరకొండ రేంజ్ మారిపోయింది. ఈ సినిమా ఎవరూ ఊహించనంత బిగ్ సక్సెస్ కావడంతో రెండేళ్ల పాటు ఈ యంగ్ హీరో కాల్షీట్స్ బుక్ అయిపోయాయి. అంతలా తన కొత్త సినిమాలతో బిజీగా ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, అతడి తనయుడు ధ్రువ్తో కలసి ఒక రోజు గడిపాడని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 'అర్జున్ రెడ్డి' కోలీవుడ్ రీమేక్ ద్వారా తన తనయుడు ధ్రువ్ను వెండితెరకు పరిచయం చేయాలని నిర్ణయించుకున్న హీరో విక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతను దర్శకుడు బాలాకు అప్పగించాడు. అయితే 'అర్జున్ రెడ్డి'గా అదరగొట్టిన విజయ్ దేవరకొండ ఇచ్చే సలహాలు, సూచనలు తన కుమారుడికి ఎంతగానో పనికొస్తాయని భావించిన విక్రమ్ ఒక రోజు తమతో మాట్లాడేందుకు రావాలని విజయ్ దేవరకొండను ఇన్వైట్ చేశాడట. విక్రమ్ వంటి టాలెంటెడ్ స్టార్ నుంచి ఆహ్వానం అందగానే వీలు చూసుకుని చెన్నైలో వాలిపోయిన టాలీవుడ్ 'అర్జున్ రెడ్డి' విక్రమ్, ధ్రువ్తో కలిసి అర్జున్ రెడ్డి సినిమా అనుభవాలను పంచుకున్నాడట. దర్శకుడు బాలా కూడా అర్జున్ రెడ్డిగా నటించిన విజయ్ దేవరకొండను అభినందించినట్టు వినికిడి. విక్రమ్ తనయుడు ధ్రువ్కు కొన్ని సలహాలు ఇచ్చిన విజయ్ దేవరకొండ స్టార్ గా జాతీయ అవార్డు అందుకున్న విక్రమ్ నుంచి సలహాలు తీసుకున్నాడని సమాచారం. 'అర్జున్ రెడ్డి'గా నేచురల్ పెర్ఫామెన్స్ ఇచ్చిన విజయ్ టాలెంటెడ్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడట. మరి విజయ్ సలహాలు విక్రమ్ కుమారుడికి ఏ మేరకు ఉపయోగపడతాయో చూద్దాం. | entertainment |
5,585 | 18-12-2017 16:40:41 | కొత్త సినిమాకు సన్నీ లియోన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? | హైదరాబాద్: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ బాషలో ఓ చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు వడి వుడయన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నీ యువరాణి పాత్రలో నటిస్తున్నారు. ఇందుకు సన్నీలియోన్ రూ.3.25 కోట్ల రెమ్యూనరేషన్ అడిగారట. నాలుగు భాషల్లో ఈ సినిమా తీస్తున్నారు కాబట్టి ఆమె అడిగిన డబ్బు ఇచ్చేందుకు నిర్మాత కూడా అంగీకరించారట. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. 2018 ఫిబ్రవరి నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుంది. తెలుగులో సన్నీలియోన్ యువరాణి పాత్రలో నటించడం ఇదే తొలిసారి. సన్నీ లియోన్ తెలుగులో కరెంట్ తీగ, గరుడవేగ మూవీల్లో నటించిన విషయం తెలిసిందే. | entertainment |
11,683 | 02-01-2017 02:05:29 | ఒక ‘క్షణం’ ఆలస్యం! | మన గడియారాల్లోనూ లీప్ సెకన్ను కలిపిన శాస్త్రవేత్తలున్యూఢిల్లీ: భారత గడియారంలో ఆదివారం ఒక అదనపు సెకనును కలిపారు. లీప్ సెకనుగా పిలిచే ఈ అదనపు క్షణాన్ని ఉదయం 5 గంటల 29 నిమిషాల 29 సెకన్లపుడు కలిపారు. జాతీయ భౌతిక ప్రయోగశాలలోని అటామిక్ గడియారం శనివారం రాత్రి 23 గంటల 59 నిమిషాల 59 సెకన్లపుడు ఆగిపోయింది. ఈ గడియారాన్ని 2017లో ఒక అదనపు క్షణం యాడ్ చేసేలా ప్రోగ్రామ్ చేశారు. భూ స్వయ భ్రమణంలో వేగం మందగించినపుడు ప్రపంచ వ్యాప్తంగా గడియారాల్లో ఇలా ఒక లీప్ సెకనును కలుపుతుంటారు. ఒక క్షణం నిజజీవితంలో ఎలాంటి ప్రభావం చూపదు. కానీ అంతరిక్షం, కమ్యూనికేషన్, ఖగోళ రంగాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జాతీయ భౌతికశాస్త్ర ప్రయోగశాలలో అరుదైన 5 అటామిక్ గడియారాలున్నాయని.. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటివి 300 మాత్రమే ఉంటాయని ప్రయోగశాల అధికారులు తెలిపారు. ఈ గడియారాలు అత్యంత కచ్చితత్వంతో పని చేస్తాయని.. 10 కోట్ల సంవత్సరాలకు ఒక సెకన్ తేడా రావొచ్చని వివరించారు. | nation |
21,041 | 13-08-2017 10:02:39 | భగవాన్... జీసెస్... అల్లా... థాంక్స్ | జకర్తా: జీవితంలో ఏ రంగంలో రాణించాలన్నా భగవంతునిపై నమ్మకం కూడా అవసరమని అన్ని మతాలు బోధిస్తుంటాయి. దీనిని నమ్మేవారు అందుకు అనుగుణంగా నడుచుకుంటుంటారు. ఇటువంటి ఘటనే ఇటీవల ఇండోనేషియా ఫుట్బాల్ క్లబ్ మైదానంలో దర్శనమిచ్చింది. ఇప్పుడు ఈ ఫొటో వైరల్గా మారింది. ఫొటోలో మూడు మతాల క్రీడాకారులు వారి పద్దతుల్లో భగవంతుణ్ని ప్రార్థిస్తున్నదృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చిత్రంలో హిందూ మతానికి చెందిన ఢిఫెండర్ నుగ్రహ్ నానక్, క్రైస్తవ మతానికి చెందిన ఫార్వర్డ్ ఆటగాడు యెబస్ రోనీ, ముస్లిం వర్గానికి చెందిన హమ్దీలు.. తాము గోల్ చేసిన తరువాత భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ ఫొటోను ఇండోనేషియాకు చెందిన బాలీ యునైటెడ్ క్లబ్ ఇంటర్నెట్లో షేర్చేసింది. దీనిని నెటిజన్లు అమితంగా ఇష్టపడుతున్నారు. | sports |
4,103 | 07-01-2017 02:17:53 | సరికొత్త అధ్యాయం |
భారత్లోనే కాదు ప్రపంచ క్రికెట్లోనే తమకు తిరుగులేదని, తామేం చేసినా చెల్లుతుందని తలబిరుసుగా వ్యవహరించిన బీసీసీఐకి సుప్రీం తీర్పు గొడ్డలిపెట్టు. ఈ తీర్పుతో భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సిఫారసులను అమలు చేయాల్సిందేనని ఎన్నిసార్లు చెప్పినా, ఎంత సమయమిచ్చినా ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. బీసీసీఐలో పాలనాపరమైన సంస్కరణల కోసం సుప్రీం కోర్టు ఆమోదించిన లోధా కమిటీ ప్రతిపాదనల్లో కొన్నింటిని వ్యతిరేకిస్తున్న బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగించింది. ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని జస్టిస్ ఏఎం ఖన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పునిచ్చింది. లోధా కమిటీ ప్రతిపాదించిన సంస్కరణల అమలును అడ్డుకోవడం కోర్టు ధిక్కారం కింద పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ఠాకూర్, షిర్కేలకు నోటీసులు కూడా జారీ చేసింది. కాగ్ సభ్యుడిని బీసీసీఐకి నామినేట్ చేయడంపై ఠాకూర్ అసత్య ప్రమాణం చేశాడని, దానికతను క్షమాపణ కోరని పక్షంలో చర్యలు తప్పవని సుప్రీం కోర్టు తీవ్రస్వరంతో హెచ్చరించింది. అలాగే బీసీసీఐతోపాటు రాష్ట్ర సంఘాలన్నీ తాము ఆమోదించిన లోధా సిఫారసులను అమలు చేసి తీరాల్సిందేనని లేకుంటే కార్యవర్గ సభ్యులందరూ పదవుల్ని వదులుకోక తప్పదని కోర్టు స్పష్టం చేసింది. లోధా కమిటీ సిఫారసుల ప్రకారం 70 ఏళ్లకు పైబడినవాళ్లు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, నేరారోపణలు రుజువైనవాళ్లు, తొమ్మిదేళ్లపాటు పదవులు అనుభవించిన వాళ్లు బీసీసీఐ, రాష్ట్ర సంఘాల పదవుల్లో కొనసాగడానికి వీల్లేదు. ఒక రాష్ట్రానికి ఒకే ఓటు హక్కు. ఒకవేళ ఒక రాష్ట్రంలో ఒకటికంటే ఎక్కువ సంఘాలుంటే రొటేషన్ పద్ధతిలో ఓటు హక్కు కేటాయించాలి. ఒక పర్యాయం పదవి చేపట్టాక మరో పర్యాయం విరామం తీసుకుని ఆ తర్వాతే బోర్డులో, రాష్ట్ర సంఘాల్లో పదవులు చేపట్టాలి. అలా గరిష్ఠంగా తొమ్మిదేళ్లు మాత్రమే పదవిలో ఉండాలి. బీసీసీఐ ఈ మూడు సిఫారసులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. చివరకు తగిన మూల్యం చెల్లించుకుంది. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంతో రంగంలోకి దిగిన లోధా కమిటీ దానిపై విచారణ జరిపి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై వేటు వేసి హెచ్చరికలు పంపినా బీసీసీఐ మేలుకోలేదు. ఆ తర్వాత లోధా కమిటీనే బోర్డులో విప్లవాత్మక మార్పులు చేపట్టకపోతే క్రికెట్ మనుగడకే ప్రమాదమని గుర్తించి పలు సిఫారసులు చేసింది. వాటిని ఆమోదించిన సుప్రీంకోర్టు అమలు చేసి తీరాల్సిందేనని బోర్డుకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.మొండిగా వ్యవహరించిన బోర్డుకు తగిన గుణపాఠం చెప్పింది. ఇది ఇంతటి తో ఆగేది కాదు. బీసీసీఐ ఇకనైనా సంస్కరణలు అమలు చేసి తీరాల్సిందే. లేకపోతే మరింత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కోర్టు వ్యవహారం అటుంచితే వన్డే, టీ20 కెప్టెన్సీని వదులుకుని జట్టులో మాత్రం కొనసాగుతానని ప్రకటించి మహేంద్ర సింగ్ ధోనీ అందర్నీ విస్మయానికి గురిచేశాడు. 2017లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ వరకు ధోనీనే కెప్టెన్ అని సెలెక్టర్లు గతంలోనే ప్రకటించినా మహీ అప్పటి వరకూ ఆగలేదు. మైదానంలో అతను వేసే ఎత్తుగడలాగే ఇది కూడా సాహసోపేతమైనదే. కానీ 2014లోనే టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన మహీ నేడు పరిమిత ఓవర్ల కెప్టెన్సీని త్యజించేందుకు సైతం వెనకాడలేదు. టెస్టు కెప్టెన్గా కోహ్లీ నిరూపించుకున్న తరుణంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇదే సరైన సమయమని భావించాడు. 2019 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమిది. కాస్త ముందుగానే ప్రకటించినా ఇది సరైనదే. క్రికెట్లో ధోనీ అందుకోని ఘనతలు లేవు. 2007 వన్డే వరల్డ్కప్ వైఫల్యంతో భారత్ సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో పగ్గాలు అందుకున్న మహేంద్రుడు.. దాదాపు పదేళ్లపాటు జట్టును సజావుగా నడిపించాడు. టీ20, వన్డే వరల్డ్కప్లతోపాటు చాంపియన్స్ ట్రోఫీని కూడా దేశానికి అందించిన సారథి. అతని హయాంలోనే భారత్ నెంబర్వన్ టెస్టు టీమ్గా వెలుగొందింది. భారత్కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గానూ ధోనీ ఘనత వహించాడు. ఇవన్నీ అతనికి అంత తేలిగ్గా దక్కలేదు. సీనియర్లు, జూనియర్లతో కూడిన జట్టును అతడు ఎంతో నేర్పుగా నడిపించాడు. తన వల్లే జట్టు గెలిచిందని గొప్పలు చెప్పుకోలేదు కానీ.. ఓటమికి మాత్రం తానే బాధ్యుడినని చెప్పుకునే గొప్ప గుణమే అతన్ని శిఖరాగ్రాన నిలబెట్టింది. సంధికాలంలోనూ టీమిండియాను సరైన దిశలో నడిపించిన మహీ ఒక పరిపూర్ణమైన జట్టును తన వారసుడు విరాట్కు అందించాడు. ఇన్నాళ్లూ టెస్టులకు మాత్రమే పరిమితమైన విరాట్ కోహ్లీ సారథ్యం ఇకపై మూడు ఫార్మాట్లకూ విస్తరించనుంది. సవాళ్లకు ఎదురెళ్లే కోహ్లీకి ఇది అతిపెద్ద సవాల్. దాన్ని ఎలా అధిగమిస్తాడన్న ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2014లో ధోనీ నుంచి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న కోహ్లీ తన కర్తవ్యానికి సంపూర్ణ న్యాయం చేశాడు. ఈ రెండేళ్లకాలంలో ఆటగాడికానే కాదు సారథిగానూ ఎంతో పరిణతి సాధించాడు. ఓ పక్క జట్టుని విజయపథంలో నడుపుతూనే మరోపక్క బ్యాట్స్మన్గా పరుగుల వరద పారించాడు. వరుసగా ఐదు టెస్టు సిరీస్లు నెగ్గి ధోనీకి తగ్గ వారసుడని నిరూపించుకున్నాడు. పైగా అన్ని విభాగాల్లోనూ అదరగొడుతున్న యువ జట్టుతోపాటు కెప్టెన్గా వైదొలిగినా ఆటగాడిగా కొనసాగుతానన్న ధోనీ అండ కూడా కోహ్లీకి ఉంది. కాబట్టి విరాట్కు తిరుగుండకపోవచ్చు! | editorial |
12,730 | 11-08-2017 02:09:47 | రిటైర్ కాబోతున్న ఏచూరికి ప్రశంసలు | రిటైర్ కాబోతున్న సీతారాం ఏచూరి(సీపీఎం) మరో ఇద్దరు సభ్యులకు రాజ్యసభ గురువారం వీడ్కోలు పలికింది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు శుక్రవారం ముగుస్తున్న నేపథ్యంలో...వారి సేవలను ఘనంగా కొనియాడుతూ ప్రసంగా లు కొనసాగాయి. ఏచూరి గొప్ప పార్లమెంటేరియన్ అని డిప్యూటీ చైర్మన్ కురియన్ అన్నారు. | nation |
18,036 | 19-03-2017 19:09:56 | మోదీ అభివృద్ధి మంత్రమే ప్రభుత్వ ఎజెండా | లక్నో: ఉత్తరప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధి బాటలోనే పయనించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని వాగ్దానం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం తొలిసారి ఆదిత్యనాథ్ మీడియాతో మాట్లాడారు. యూపీలో శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. మహిళా భద్రతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. గ్రామీణాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా సమాజంలోని అన్ని వర్గాల కోసం పనిచేస్తామని, ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం జవాబుదారీగా ఉంటుందని చెప్పారు. | nation |
19,721 | 08-02-2017 19:20:58 | కోహ్లీ, అశ్విన్లో బంగ్లాదేశ్ కెప్టెన్ ఎవరికి ఎక్కువ భయపడుతున్నాడో తెలుసా? | హైదరాబాద్: రేపటి నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్తో టెస్ట్ మ్యాచ్ మొదలు కానుంది. అయితే ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ మీడియాతో మాట్లాడాడు. కోహ్లీ, అశ్విన్లలో ఎవరంటే ఎక్కువగా టెన్షన్ పడుతున్నారని విలేకర్లు అడగ్గా రహీమ్ ఏం చెప్పాడో తెలుసా? నిజాయితీగా చెప్పాలంటే ఒక జట్టు నెంబర్ వన్ అయ్యిందంటే అది ఒకరిద్దరి వల్ల కాదన్నాడు. కోహ్లీ, అశ్విన్లతో పాటు పుజారా, రాహుల్, నాయిర్ వంటి ఆటగాళ్లు ఇంగ్లండ్పై బాగా ఆడారు. అశ్విన్ అన్ని సార్లు ఐదు వికెట్లు తీయలేకపోయినప్పటికీ అద్భుతమైన బౌలర్. ఇక విరాట్ కోహ్లీ అయితే ప్రపంచ ఉత్తమ బ్యాట్స్మన్లో ఒకడు. ఇద్దరూ మాకు టెన్షన్ పెట్టే ఆటగాళ్లే, కానీ ఇతర ఆటగాళ్లు కూడా బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా బౌలర్లు కూడా బ్యాటింగ్ చేయగలుగుతున్నారని అన్నాడు బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్. టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్లో కోహ్లీ రెండో స్థానంలో ఉంటే బౌలింగ్లో అశ్విన్ మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. | sports |
2,993 | 16-04-2017 23:33:37 | ఇపిఎఫ్లో ఈ మార్పులు గమనించారా? | రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ప్రధాన ఆసరా ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్). ఈ భవిష్య నిధికి సంబంధించి ఇటీవల ఐదు ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటంటే... బీమా కంపెనీలు అపుడపుడు పాలసీదారులకు లాయల్టీ బోనస్ చెల్లిస్తుంటాయి. అయితే ఉద్యోగం చేసినన్నాళ్లూ క్రమం తప్పకుండా నెలనెలా ఇపిఎఫ్ చెల్లించే ఉద్యోగులకు మాత్రం ఇప్పటివరకు అలాంటి ప్రయోజనం లేదు. ఇక కొత్తగా 20 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఇపిఎఫ్లో చందాదారులుగా ఉన్న ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో రూ.50,000 వరకు లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్గా చెల్లిస్తారు. ఏదైనా అంగవైకల్యం ఏర్పడి చందాదారుడు 20 ఏళ్ల కంటే తక్కువ కాలం ఇపిఎఫ్ చందా చెల్లించివారికీ ఈ పథకాన్ని వర్తింప చేయాలని ఇపిఎఫ్ఒ బోర్డు నిర్ణయించింది. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే ఇపిఎఫ్ చందాదారులకు ఈ పథకం అమలులోకి వస్తుంది. ఇప్పటి వరకు ఇపిఎఫ్ చందాదారుడు చనిపోతే, వారి వారసులకు రూ.6 లక్షల వరకు బీమా కింద నష్ట పరిహారంగా లభిస్తోంది. అయితే దీనికి కనీస పరిమితి అంటూ లేదు. శాశ్వత అంగవైకల్యం పొందిన ఇపిఎఫ్ సభ్యులకూ ఎలాంటి సర్వైవింగ్ ప్రయోజనాలూ లేవు. ఇక నుంచి ఎవరైనా ఇపిఎఫ్ చందాదారుడు చనిపోతే, వారి కుటుంబ సభ్యులకు బీమా కింద కనీసం రూ.2.5 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని ఇపిఎఫ్ఒ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (సిబిటి) సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనకూ కేంద్ర ప్రభుత్వ ఆమోద ముద్ర పడాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పిఎఫ్పై 8.65 శాతం వడ్డీ చెల్లిస్తారు. గత ఏడాది డిసెంబర్లోనే ఇపిఎఫ్ఒ ట్రస్టీలు దీనిపై నిర్ణయం తీసుకున్నారు. నిజానికి పిఎఫ్ వడ్డీ రేటు అర శాతమైనా తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి కార్మిక శాఖపై ఒత్తిడి వచ్చింది. ట్రస్టీలు మాత్రం అందుకు తలొగ్గకుండా 8.65 శాతం వడ్డీ రేటుకు ఓటేశారు. ఈ వడ్డీ రేటు చెల్లించినా ఇపిఎఫ్ఒ దగ్గర ఇంకా రూ.158 కోట్ల మిగులు ఉంటుందని కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పడం విశేషం. ఇప్పటి వరకు ఏటా పిఎఫ్ ద్వారా సమకూరే నిధుల్లో 10 శాతం నిధులను ఇటిఎఫ్ల ద్వారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని 15 శాతానికి పెంచాలని ప్రతిపాదించినా, కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదనను తాత్కాలింగా పక్కన పెట్టారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.18,069 కోట్ల నిధులను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ పెట్టుబడులపై సగటున 18.13 శాతం రాబడులు వచ్చాయి. రాబడులు బాగానే ఉన్నా, స్టాక్ మార్కెట్ ఆటుపోట్లతో అసలుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. | business |
21,559 | 12-02-2017 00:44:30 | పోరాటమే ఆయుధం | తొలి రెండ్రోజులూ టీమిండియా బ్యాట్స్మెన్ జోరు ప్రదర్శిస్తుంటే.. బంగ్లాదేశ్ నిస్సహాయతను చూసిన భారత అభిమానులు మ్యాచ్ మూడ్రోజులా.. నాలుగు రోజులా అని లెక్కలేసుకున్నారు. కానీ.. మూడోరోజు బంగ్లా పోరాటంతో అంచనాలన్నీ తారుమారయ్యాయి. బౌలర్లు విఫలమైనంత మాత్రాన తమ పనైపోలేదు.. బ్యాటింగ్లో తమ పోరాటం ఇంకా మిగిలే ఉందని పర్యాటక జట్టు నిరూపించింది! కాస్త లేటైనా.. లేటె్స్టగా రేసులోకొచ్చి మ్యాచ్ను ఆసక్తిగా మార్చింది! సీనియర్ ఆటగాళ్లు షకీబల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ బాధ్యతగా ఆడడం.. స్పిన్ సంచలనం మెహ్దీ హసన్ మిరాజ్ కూడా బ్యాట్తో మెరవడంతో.. మ్యాచ్ రసపట్టులో పడింది. వాస్తవానికి బౌలింగ్లో స్వయం తప్పిదాలతో అవకాశాలు చేజార్చుకున్న పర్యాటక జట్టు వాటిని పునరావృతం చేసి మూడో రోజునూ పేలవంగానే ఆరంభించింది. అవసరం లేని చోట రన్కు వెళ్లిన తమీమ్ ఇక్బాల్ ఓవర్నైట్ స్కోరుకు మరో పరుగైనా జోడించకుండానే పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత వెంటవెంటనే మరో రెండు వికెట్లు కోల్పోయి 104/4తో నిలిచిన బంగ్లా ఇన్నింగ్స్ ఇక ఎంతోసేపు సాగదనిపిం చింది. కానీ.. కీలక సమయంలో షకీబల్ సత్తా చాటాడు. 103 బంతుల్లోనే 14 ఫోర్లతో 82 పరుగులు చేశాడు. మరోఎండ్లో కెప్టెన్ రహీమ్ ఇబ్బంది పడుతున్నా ఎదురుదాడి అస్త్రంతో ఆతిథ్య బౌలర్లపై పైచేయి సాధించే ప్రయత్నం చేశాడు. షకీబల్, రహీమ్ క్రీజు లో ఉన్నంత సేపూ ఆటలో బంగ్లాదే పైచే యి. అయితే, అవసరం లేని సమయంలో ఆవేశానికి పోయిన షకీబల్ వికెట్ పారేసుకున్నాడు. ఆ వెంటనే.. షబ్బీర్ ఆరో వికెట్గా వెనుదిరిగాడు. ఈ దశలో మరో వికెట్ పడితే బంగ్లా కోలుకోవడం కష్టమయ్యేది. అయితే ఈ ప్రభావం జట్టుపై పడకుండా చూసిన ఘనత ముష్ఫికర్దే! తన అనుభవాన్నంతా రంగరించి.. మెహ్దీ హసన్తో కలిసి ఇన్నింగ్స్ను పునర్నిర్మించాడు. దాదాపు ఐదు గంటలపాటు క్రీజులో నిలిచి భారత బౌలర్లకు ఎదురొడ్డి పోరాడాడు. ఒక దశలో 65 బంతుల వరకూ బౌండ్రీల జోలికెళ్లలేదంటే అతనెంత సహనంతో బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో హసన్ పోరాటాన్ని తక్కువ చేయలేం. ఈ టెస్టుకు ముందు అతణ్ని నాణ్యమైన స్పిన్నర్గానే పరిగణించిన భారత్.. అతనిలా బ్యాట్తో రెచ్చిపోయి ఆడగలడని ఊహించి ఉండదు. ఈ మ్యాచ్కు ముం దు నాలుగు టెస్టులే ఆడిన మిరాజ్ వాటిలో చేసింది 20 పరుగులే. కానీ, ఫస్ట్క్లాస్లో ఐదు అర్ధ సెంచరీలు చేసిన అనుభవం ఈ మ్యాచ్లో అక్కరకొచ్చింది. ఆడుతుంది నెంబర్వన్ జట్టుతో అయి నా.. అతని గుండె నిబ్బరం ముచ్చటగొలిపింది. రెండు గంటలకు పైగా క్రీజులో నిలిచిన మెహ్దీ తానెదుర్కొన్న 103 బంతుల్లో ఎక్కడా ఇబ్బంది పడలేదు. పేసర్లు సంధించిన బౌన్సర్లు, షార్ట్పిచ్ బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్న హసన్.. స్పిన్నర్లకు తన డిఫెన్స్ను ఛేదించే అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్లోనే అతను నాలుగు ఫోర్లు కొట్టడం విశేషం. మన స్పిన్ ద్వయం మెహ్దీని ఇబ్బంది పెట్టలేకపోయింది. బంగ్లా ఎంత పోరాడినా భారత స్కోరుకి ఇంకా 350 పైచిలుకు పరుగుల దూరంలోనే ఉంది. గెలుపు అసాధ్యమే. డ్రా చేసుకోవాలంటే మరో రెండు రోజులు పోరాడాలి. మూడో రోజు అజేయంగా నిలిచిన ముష్ఫికర్, మిరాజ్ జోడీ ఆదివారం ఎంత సేపు నిలుస్తుందన్నదానిపైనే ఫలితం ఆధారపడనుంది. | sports |
15,254 | 14-05-2017 02:16:38 | రాన్సమ్వేర్ అంటే? | రాన్సమ్వేర్ అనేది మాల్వేర్లలో ఒకరకం. చెడు చేసే ఉద్దేశంతో రాసేదేదైనా మాల్వేరే. ‘వైరస్’ కూడా మాల్వేర్లో ఒకరకం. ఇంకా.. యాడ్వేర్, స్పైవేర్, న్యాగ్వేర్ ఇలా మాల్వేర్లు చాలా రకాలుంటాయి. వీటిలో ఒక్కోదాన్ని వ్యాపింపజేయడం వెనుక ఒక్కో ఉద్దేశముంటుంది. యాడ్వేర్ మన సిస్టమ్లోకి ప్రవేశిస్తే ఇంటర్నెట్లో మన వినియోగాన్ని బట్టి మనకు ఇష్టమైన అంశాలకు సంబంధించిన యాడ్లు మాత్రమే కనబడేలా చేస్తుంది. అదే స్పైవేర్ ప్రవేశిస్తే.. కంప్యూటర్ ద్వారా మనం చేసే పనులన్నిటిపైనా నిఘా వేస్తుందన్నమాట. ఇక హ్యాకర్లు రాన్సమ్వేర్ను వ్యాపింపజేయడం వెనుక ప్రధాన ఉద్దేశం.. కేవలం డబ్బు దోచుకోవడమే. రాన్సమ్ అంటే.. డబ్బులిచ్చి చెర నుంచి విడిపించుకోవడం అని అర్థం. ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది ఈ తరహా మాల్వేరే. తాజాగా వ్యాపిస్తున్నది వాన్నా క్రై అనే రాన్సమ్వేర్. దీని అసలు పేరు.. వాన్నా క్రిప్ట్. ఏడిపించే ఉద్దేశంతో రూపొందించింది కాబట్టి ‘క్రిప్ట్’ అనే పదంలో పీటీ అక్షరాలను తొలగించి ‘వాన్నా క్రై’గా వ్యవహరిస్తున్నారు. వ్యాప్తి ఇలా..ఒకేసారి కొన్ని వేల మందికి ఈమెయిల్స్ను పంపే సాఫ్ట్వేర్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా.. ‘మీకు జాబ్ వచ్చింది’.. ‘మీకు లాటరీ వచ్చింది’.. అంటూ ఊరించే మెయిల్స్ను పంపారు. అందులోని లింకులను క్లిక్ చేయగానే రాన్సమ్వేర్ తనపని తాను చేయడం మొదలుపెట్టింది. సిస్టమ్లోని ఫైల్స్ అన్నీ లాక్ అయిపోయి, ఒక హెచ్చరిక విండో ప్రత్యక్షమవుతోంది. హ్యాకర్లు అడిగిన 300 డాలర్ల సొమ్మును బిట్కాయిన్లలో చెల్లించిన తర్వాత డీక్రిప్ట్ చేయడానికి అవసరమైన కీవర్డ్స్ పంపుతున్నారు. వాన్నాక్రై రాన్సమ్వేర్ వ్యాప్తి.. గుర్తుతెలియని ఒక క్రిమినల్ నెట్వర్క్ చేసిన నిర్వాకంగా టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. మన దేశంలో ఎన్ని ఐటీ కంపెనీలపై ఈ దాడులు జరిగాయో కచ్చితమైన సమాచారం లేదు. విప్రో కంపెనీలోని కొన్ని సిస్టమ్స్పై దాడులు జరిగాయనే వార్తలు వచ్చాయి. ఇలా భద్రంయాంటీవైర్స ఇన్స్టాల్ చేసుకోవాలి. తెలియని వ్యక్తుల దగ్గర నుంచి వచ్చే మెయిల్స్ను, వెబ్సైట్ లింక్లను ఓపెన్ చేయకూడదు.కంప్యూటర్లో ఉన్న ఫైళ్లన్నిటినీ బ్యాకప్ చేయడం కష్టం కానీ.. కీలకం అనుకున్న ఫైళ్లకు మాత్రం తప్పనిసరిగా వేరే చోట కూడా ఒక కాపీ పెట్టుకోవడం చాలా ముఖ్యం. క్లౌడ్ సర్వీసులను వినియోగించుకోవడం మరో మార్గం. | nation |
15,307 | 20-03-2017 03:44:26 | యూపీ పీఠంపై బీజేపీ యోగి | లఖ్నవ్, మార్చి 19: ఉత్తరప్రదేశ్లో 14 ఏళ్ల వనవాసాన్ని ముగించుకుని బీజేపీ మళ్లీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. గోరఖ్నాథ్ దేవాలయ ప్రధాన పూజారి, గోరఖ్నాథ్ మఠాధిపతి, గోరఖ్పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ (44) రాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం చేశారు. కాషాయ వస్త్రాలను ధరించే ఆయన ప్రమాణం చేశారు. ఆదివారం మధ్యాహ్నం లఖ్నవ్లోని కాన్షీరాం స్మృతి ఉపవన్ మైదానంలో.. ప్రధాని మోదీ సమక్షంలో.. బీజేపీ, ఎన్డీఏలకు చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల నడుమ.. యోగితో గవర్నర్ రామ్నాయక్ ప్రమాణం చేయించారు. ఉపముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. మరో 44 మందిని యోగి తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. 22 మంది కేబినెట్ మంత్రులు, 9 మంది స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, ఇంకో 13 మంది సహాయ మంత్రులతోనూ గవర్నర్ ప్రమాణం చేయించారు. వీరిలో సూర్యప్రతాప్ షాహి, సురేశ్ ఖన్నా, స్వామి ప్రసాద్ మౌర్య, సతీశ్ మహానా, రీటా బహుగుణ జోషీ, ధరంపాల్సింగ్, బ్రిజేశ్ పాఠక్, బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత శర్మ, పార్టీ ఏపీ ఇన్చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ తదితరులు ఉన్నారు. అనంతరం కొత్తగా నిర్మించిన లోక్భవన్లో ఆదిత్యనాథ్ పదవీబాధ్యతలు స్వీకరించారు. | nation |
14,299 | 15-09-2017 13:21:27 | అన్నా డీఎంకే గుర్తుపై హైకోర్టు ఆదేశాలు |
చెన్నై : అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు ‘రెండు ఆకులు’ కోసం వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మద్రాస్ హైకోర్టు గడువు విధించింది. వచ్చే నెల 31లోగా ఈ సమస్యను పరిష్కరించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అన్నాడీఎంకేలోని పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు ఎన్నికల గుర్తు కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ‘రెండు ఆకులు’ గుర్తు తమదంటే తమదంటూ ఈ వర్గాలు ఎన్నికల సంఘానికి అఫిడవిట్లు సమర్పించాయి. వీరిలో ఏ వర్గానికి ‘రెండు ఆకులు’ గుర్తును కేటాయించాలో వచ్చే నెల 31 లోగా నిర్ణయించాలని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని శుక్రవారం ఆదేశించింది. | nation |
16,883 | 13-12-2017 18:57:52 | మరో కేజ్రీవాల్ పుట్టకూడదు : అన్నా హజారే |
న్యూఢిల్లీ : అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఉద్యమం ద్వారా మరో అరవింద్ కేజ్రీవాల్ ఉద్భవించకూడదన్నారు. మంగళవారం ఆగ్రాలో షాహిద్ స్మారక్ వద్ద బహిరంగ సభలో హజారే మాట్లాడారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ మార్చి 23న న్యూఢిల్లీలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. పెద్ద ఎత్తున రైతులు ఈ సభకు హాజరు కావాలని కోరారు. రైతుల కోసం పని చేసే ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. అన్నా హజారే 2011లో నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్న సంగతి తెలిసిందే. హజారేతో కేజ్రీవాల్కు 2012లో విభేదాలు వచ్చాయి. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. అనంతరం ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. | nation |
18,447 | 18-12-2017 02:32:07 | ఆలూ కిలో 20పైసలే! | ఆగ్రా, డిసెంబరు 17: ఆలూ రైతుకు గడ్డుకాలం దాపురించింది. ఎన్నడూ లేనివిధంగా ఆలుగడ్డల ధర ఒక్కసారిగా పతనమైంది. హోల్సేల్ మార్కెట్లో 50 కేజీల బ్యాగ్ కేవలం రూ.10 మాత్రమే పలుకుతోంది. అంటే కిలో ధర కేవలం 20పైసలే అన్నమాట. గత జూలైలో ఇదే బ్యాగ్ రూ.400 వరకూ పలికింది. నాటినుంచీ ధర పతనమవుతూనే వస్తోంది. ఇదిలా ఉండగా, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన పంట దిగుబడిని మార్కెట్కు తరలించాలంటే అక్కడి నిర్వాహకులకు ఒక్కో బ్యాగ్కు రూ.110 చొప్పున చెల్లించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో స్టోరేజీ, రవాణా చార్జీలు భరించలేని రైతులు ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో ఒక్క ఆగ్రా జిల్లాలోనే 240 వరకూ కోల్డ్స్టోరేజ్లుండగా, అధిక శాతం తమ ప్రిజర్వేషన్ మిషన్లను స్విచ్ ఆఫ్ చేసేశాయి. వాటిలో ఉంచిన సరుకు కుళ్లిపోతుండటంతో ఇప్పటి వరకూ 2.5లక్షల టన్నులకు పైగా ఆలుగడ్డలను పశువులకు మేతకోసం రోడ్ల వెంబడి పారబోశారు. | nation |
4,506 | 03-06-2017 03:44:48 | నవజాగృతిలో ‘విద్యావంతులు’ | తెలంగాణ సాధన కోసం ఒక పోరాటం, అభివృద్ధికై మరో పోరాటం అని జయశంకర్ అందించిన సిద్ధాంత బలంతో ప్రజలు కేంద్రంగా ప్రజాస్వామిక సూత్రాల ఆధారంగా అభివృద్ధి జరగాలి. ఒక విజయం మరో ఉదయం కోసమంటూ సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ సాధనకై కొత్త ఉద్యమ ప్రస్థానాన్ని తెలంగాణ విద్యావంతుల వేదిక ఆరంభించింది. దశాబ్దాలుగా కొనసాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజాస్వామిక, ప్రజాసంఘాలు ఒకవైపు రాజకీయపార్టీలు మరొకవైపు వేర్వేరు పాయలుగా అందోళనలు జరిపాయి. ప్రధానంగా 90వ దశకంలో ప్రజాస్వామిక శక్తుల, ప్రజాసంఘాల ఉద్యమాలతో తెలంగాణ పోరాటం గుణాత్మక మార్పు తీసుకుంది. ఉద్యమం తన పరిధిని, విస్తృతిని పెంచుకుంటున్న సందర్భంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం సాగించిన తీవ్ర నిర్బంధం, అణచివేతలను ఎదుర్కొంటూనే 2000 సంవత్సరంలో తెలంగాణ గడ్డమీద మరొక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అదే టీఆర్ఎస్ పార్టీ. ఓట్లు, సీట్లు, లాబీయింగ్ల పేరుతో కాలయాపన చేస్తూ తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలపై జరుగుతున్న దాడిని ఎదుర్కోవడానికి సమర్థమైన వ్యూహాన్ని గాని నిర్మాణాన్ని గాని టీఆర్ఎస్ రూపొందించుకోలేక పోవడంతో ప్రజలలో నిరాశ పెరిగింది.ఆనాటి పరిస్థితులలో తెలంగాణకు విద్యావంతుల మీద తెలంగాణ ఉద్యమ గురుతర బాధ్యత ఉన్నదని భావించి ప్రొఫెసర్ జయశంకర్ సర్ ఏర్పాటుచేసిన సంస్థ తెలంగాణ విద్యావంతుల వేదిక. టీఆర్ఎస్లో భాగం కాకుండా ఉద్యమానికి దోహదపడాలి అనుకొని వైయక్తికంగా ఎవరికి వారు కృషి చేస్తున్న సందర్భంలో ఆ వ్యక్తుల, శక్తుల కలయికతో 2004లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆవిర్భవించింది. ఆధునిక తెలంగాణ చరిత్ర అన్ని ప్రధాన ఘట్టాల్లో విద్యావంతులు ప్రధాన పాత్ర పోషించారు. అది వందేమాతరం ఉద్యమం కావచ్చు, ఆర్యసమాజం ఆవిర్భావం కావచ్చు, అంటరాని తనానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ముల్కీ ఉద్యమం, తెలంగాణ సాయుధపోరాటం, ప్రాతినిధ్య ప్రభుత్వం కొరకు ఆందోళన, స్టేట్ కాంగ్రెస్ నిర్మాణం, సోషలిస్టు ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, నక్సల్బరీ పోరాటం... ఇలా ప్రతి ఘట్టంలోను ప్రజా చైతన్యాన్ని వ్యక్తీకరించడం, ప్రజాసమస్యలను వెలుగులోనికి తేవడం, ఆ సమస్యల పరిష్కారానికై తలెత్తిన ఉద్యమాలకు మార్గదర్శకం చేయడం మనం చూశాం. ఈ నేపథ్యంలో ఆ చారిత్రక వారసత్వాన్ని అందిపుచ్చుకొని తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ సాధన మలిదశ ఉద్యమంలో తన కార్యాచరణను రూపొందించుకొని ఉద్యమంలో భాగమైంది. తెలంగాణ భావజాల వ్యాప్తి నుంచి లక్ష్యసాధన దిశగా ఉద్యమ సంస్థగా అన్ని శక్తులను ఏకం చేసింది తెలంగాణ విద్యావంతుల వేదిక. తెలంగాణ రాష్ట్ర డిమాండ్కు సానుకూలంగా, క్రీయాశీలకంగా రాజకీయపార్టీలు పనిచేసే విధంగా ఒత్తిడి తెచ్చింది. తెలంగాణ భాష, చరిత్ర, సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తూ, సీమాంధ్ర వలసవాద పెట్టుబడిదారీ రాజకీయ శక్తులపై ప్రజాప్రతిఘటన ఉద్యమాలను బలోపేతం చేసింది తెలంగాణ విద్యావంతుల వేదిక. సకల జనుల గొంతుక తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో ప్రధాన భాగస్వామిగా ఉంటూ ఉత్తుంగ తరంగ కెరటంలా సాగుతున్న తెలంగాణ పోరులో వెల్లడవుతున్న ప్రజా ఆకాంక్షలను పోగుపడుతున్న ప్రజా చైతన్యాన్ని అర్థం చేసుకుంటూ 2013లో సాగర సమాలోచన జరిపి ఏర్పడబోయే రాష్ట్రం ఎలా అభివృద్ధి జరగాలో ప్రాథమిక చర్చను జరిపి దిశా నిర్దేశం చేసింది. 2014 ఎన్నికల సందర్భంలో తెలంగాణ ప్రజా సమస్యలపై పీపుల్స్ ఎజెండాను రూపొందించి అన్ని పార్టీలు ఈ ఎజెండాను తమ ఎన్నికల మ్యానిఫెస్టోగా అమలుచేయాలని కోరింది. తెలంగాణ సాధన కోసం ఒక పోరాటం, అభివృద్ధికై మరో పోరాటం అని జయశంకర్ సర్ అందించిన సిద్ధాంత బలంతో ప్రజలు కేంద్రంగా సామాజిక న్యాయం, సమన్యాయం, ప్రజాస్వామిక సూత్రాల ఆధారంగా అభివృద్ధి జరగాలని కోరింది. ఒక విజయం మరో ఉదయం కోసమంటూ సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ సాధనకై కొత్త ఉద్యమ ప్రస్థానంలోకి తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రవేశించింది. తెలంగాణ గడ్డ సీమాంధ్ర రాజకీయ నాయకత్వం నుంచి విముక్తమై స్వీయ రాజకీయ శక్తులే రాజ్యమేలుతున్నప్పటికి సీమాంధ్ర పెట్టుబడిదారీ రాజకీయ సంస్కృతిలో ఒదిగి ఎదిగిన నాయకత్వం కాబట్టి అదే పాలనా సంస్కృతిని కొనసాగిస్తుంది. ప్రభుత్వాన్ని తమ సొంత ఆస్తిగా భావిస్తూ అప్రజాస్వామిక నిర్ణయాలతో కాంట్రాక్టులు, కమీషన్లు, ఓట్లు, సీట్లు, మానవీయ ముసుగు ఓటు బ్యాంకు పథకాలతో ప్రచార ఆర్భాటాలు చేస్తుంది. ఉద్యమ ఆకాంక్షను మరిచి తెలంగాణ నిర్మాణాత్మక అభివృద్ధికి బదులుగా తెలంగాణ సంపదను కార్పోరేట్లకు, కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నది. తెలంగాణ అభివృద్ధికై స్వీయ అస్తిత్వ కోణంలో ప్రణాళికను, పథకాలను రూపొందించకుండా సీమాంధ్ర పాలకులు రూపొందించి అమలు చేసిన విధ్వంసకర అభివృద్ధి నమూనానే అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీమాంధ్ర రాజకీయ నాయకత్వం నుంచి విముక్తమైన తెలంగాణను ఆ రాజకీయ సంస్కృతికి భిన్నమైన ప్రత్యామ్నాయ, ప్రజాస్వామిక రాజకీయ విలువల కోసం భావజాల వ్యాప్తిని తెలంగాణ విద్యావంతుల వేదిక కొనసాగిస్తుంది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల విలువ ఆధారంగా ఆర్థిక రాజకీయ, సామాజిక సమానత్వం రావాలని, పాలనలో, పైసాలో ప్రజా భాగస్వామ్యాన్ని, పారదర్శకత్వాన్ని కోరుతూ, సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ పోరు సమరశంకం పూరిస్తూ తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకే చెందాలని తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్ చేస్తోంది.ధర్మార్జున్రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ విద్యావంతుల వేదిక(నేడు, రేపు వరంగల్లో తెలంగాణ విద్యావంతుల వేదిక 6వ మహాసభ) దశాబ్దాలుగా కొనసాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజాస్వామిక, ప్రజాసంఘాలు ఒకవైపు రాజకీయపార్టీలు మరొకవైపు వేర్వేరు పాయలుగా అందోళనలు జరిపాయి. ప్రధానంగా 90వ దశకంలో ప్రజాస్వామిక శక్తుల, ప్రజాసంఘాల ఉద్యమాలతో తెలంగాణ పోరాటం గుణాత్మక మార్పు తీసుకుంది. ఉద్యమం తన పరిధిని, విస్తృతిని పెంచుకుంటున్న సందర్భంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం సాగించిన తీవ్ర నిర్బంధం, అణచివేతలను ఎదుర్కొంటూనే 2000 సంవత్సరంలో తెలంగాణ గడ్డమీద మరొక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అదే టీఆర్ఎస్ పార్టీ. ఓట్లు, సీట్లు, లాబీయింగ్ల పేరుతో కాలయాపన చేస్తూ తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలపై జరుగుతున్న దాడిని ఎదుర్కోవడానికి సమర్థమైన వ్యూహాన్ని గాని నిర్మాణాన్ని గాని టీఆర్ఎస్ రూపొందించుకోలేక పోవడంతో ప్రజలలో నిరాశ పెరిగింది.ఆనాటి పరిస్థితులలో తెలంగాణకు విద్యావంతుల మీద తెలంగాణ ఉద్యమ గురుతర బాధ్యత ఉన్నదని భావించి ప్రొఫెసర్ జయశంకర్ సర్ ఏర్పాటుచేసిన సంస్థ తెలంగాణ విద్యావంతుల వేదిక. టీఆర్ఎస్లో భాగం కాకుండా ఉద్యమానికి దోహదపడాలి అనుకొని వైయక్తికంగా ఎవరికి వారు కృషి చేస్తున్న సందర్భంలో ఆ వ్యక్తుల, శక్తుల కలయికతో 2004లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆవిర్భవించింది. ఆధునిక తెలంగాణ చరిత్ర అన్ని ప్రధాన ఘట్టాల్లో విద్యావంతులు ప్రధాన పాత్ర పోషించారు. అది వందేమాతరం ఉద్యమం కావచ్చు, ఆర్యసమాజం ఆవిర్భావం కావచ్చు, అంటరాని తనానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ముల్కీ ఉద్యమం, తెలంగాణ సాయుధపోరాటం, ప్రాతినిధ్య ప్రభుత్వం కొరకు ఆందోళన, స్టేట్ కాంగ్రెస్ నిర్మాణం, సోషలిస్టు ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, నక్సల్బరీ పోరాటం... ఇలా ప్రతి ఘట్టంలోను ప్రజా చైతన్యాన్ని వ్యక్తీకరించడం, ప్రజాసమస్యలను వెలుగులోనికి తేవడం, ఆ సమస్యల పరిష్కారానికై తలెత్తిన ఉద్యమాలకు మార్గదర్శకం చేయడం మనం చూశాం. ఈ నేపథ్యంలో ఆ చారిత్రక వారసత్వాన్ని అందిపుచ్చుకొని తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ సాధన మలిదశ ఉద్యమంలో తన కార్యాచరణను రూపొందించుకొని ఉద్యమంలో భాగమైంది. తెలంగాణ భావజాల వ్యాప్తి నుంచి లక్ష్యసాధన దిశగా ఉద్యమ సంస్థగా అన్ని శక్తులను ఏకం చేసింది తెలంగాణ విద్యావంతుల వేదిక. తెలంగాణ రాష్ట్ర డిమాండ్కు సానుకూలంగా, క్రీయాశీలకంగా రాజకీయపార్టీలు పనిచేసే విధంగా ఒత్తిడి తెచ్చింది. తెలంగాణ భాష, చరిత్ర, సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తూ, సీమాంధ్ర వలసవాద పెట్టుబడిదారీ రాజకీయ శక్తులపై ప్రజాప్రతిఘటన ఉద్యమాలను బలోపేతం చేసింది తెలంగాణ విద్యావంతుల వేదిక. సకల జనుల గొంతుక తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో ప్రధాన భాగస్వామిగా ఉంటూ ఉత్తుంగ తరంగ కెరటంలా సాగుతున్న తెలంగాణ పోరులో వెల్లడవుతున్న ప్రజా ఆకాంక్షలను పోగుపడుతున్న ప్రజా చైతన్యాన్ని అర్థం చేసుకుంటూ 2013లో సాగర సమాలోచన జరిపి ఏర్పడబోయే రాష్ట్రం ఎలా అభివృద్ధి జరగాలో ప్రాథమిక చర్చను జరిపి దిశా నిర్దేశం చేసింది. 2014 ఎన్నికల సందర్భంలో తెలంగాణ ప్రజా సమస్యలపై పీపుల్స్ ఎజెండాను రూపొందించి అన్ని పార్టీలు ఈ ఎజెండాను తమ ఎన్నికల మ్యానిఫెస్టోగా అమలుచేయాలని కోరింది. తెలంగాణ సాధన కోసం ఒక పోరాటం, అభివృద్ధికై మరో పోరాటం అని జయశంకర్ సర్ అందించిన సిద్ధాంత బలంతో ప్రజలు కేంద్రంగా సామాజిక న్యాయం, సమన్యాయం, ప్రజాస్వామిక సూత్రాల ఆధారంగా అభివృద్ధి జరగాలని కోరింది. ఒక విజయం మరో ఉదయం కోసమంటూ సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ సాధనకై కొత్త ఉద్యమ ప్రస్థానంలోకి తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రవేశించింది. తెలంగాణ గడ్డ సీమాంధ్ర రాజకీయ నాయకత్వం నుంచి విముక్తమై స్వీయ రాజకీయ శక్తులే రాజ్యమేలుతున్నప్పటికి సీమాంధ్ర పెట్టుబడిదారీ రాజకీయ సంస్కృతిలో ఒదిగి ఎదిగిన నాయకత్వం కాబట్టి అదే పాలనా సంస్కృతిని కొనసాగిస్తుంది. ప్రభుత్వాన్ని తమ సొంత ఆస్తిగా భావిస్తూ అప్రజాస్వామిక నిర్ణయాలతో కాంట్రాక్టులు, కమీషన్లు, ఓట్లు, సీట్లు, మానవీయ ముసుగు ఓటు బ్యాంకు పథకాలతో ప్రచార ఆర్భాటాలు చేస్తుంది. ఉద్యమ ఆకాంక్షను మరిచి తెలంగాణ నిర్మాణాత్మక అభివృద్ధికి బదులుగా తెలంగాణ సంపదను కార్పోరేట్లకు, కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నది. తెలంగాణ అభివృద్ధికై స్వీయ అస్తిత్వ కోణంలో ప్రణాళికను, పథకాలను రూపొందించకుండా సీమాంధ్ర పాలకులు రూపొందించి అమలు చేసిన విధ్వంసకర అభివృద్ధి నమూనానే అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీమాంధ్ర రాజకీయ నాయకత్వం నుంచి విముక్తమైన తెలంగాణను ఆ రాజకీయ సంస్కృతికి భిన్నమైన ప్రత్యామ్నాయ, ప్రజాస్వామిక రాజకీయ విలువల కోసం భావజాల వ్యాప్తిని తెలంగాణ విద్యావంతుల వేదిక కొనసాగిస్తుంది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల విలువ ఆధారంగా ఆర్థిక రాజకీయ, సామాజిక సమానత్వం రావాలని, పాలనలో, పైసాలో ప్రజా భాగస్వామ్యాన్ని, పారదర్శకత్వాన్ని కోరుతూ, సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ పోరు సమరశంకం పూరిస్తూ తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకే చెందాలని తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్ చేస్తోంది.ధర్మార్జున్రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ విద్యావంతుల వేదిక(నేడు, రేపు వరంగల్లో తెలంగాణ విద్యావంతుల వేదిక 6వ మహాసభ) | editorial |
19,176 | 08-02-2017 02:33:15 | అన్నాడీఎంకేలో చీలిక ! | చెన్నై, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): మూడు దశాబ్దాల తరువాత వరుసగా రెండుమార్లు అధికారం సంపాదించిన అన్నాడీఎంకే చివరికి చీలిక దిశగా పయనిస్తోంది. ఆ పార్టీ అధినేత్రి జయలలిత మరణానంతరం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ ముక్కయ్యేలా కనిపిస్తోంది. రెండు నెలలు సీఎంగా ఉన్న తనతో శశికళ బలవంతంగా రాజీనామా చేయించడంతో తీవ్రమనస్తాపానికి గురైన పన్నీర్సెల్వం అధిష్టానంపై ధిక్కారస్వరం వినిపించారు. దీంతో ఒక్కసారిగా దిగ్ర్భాంతికి లోనైన శశికళ బృందం ఆయనపై చర్యలకు సిద్ధమైంది. మంగళవారం రాత్రి పొద్దుపోయేవరకూ పోయె్సగార్డెన్లో సీనియర్ నేతలు, మంత్రులతో మంతనాలు జరిపిన శశికళ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే పన్నీర్సెల్వంపై వేటు వేస్తే దాని పర్యవసానాలు, ఎదురయ్యే పరిణామాలు, పార్టీ స్థితిగతులు గురించి ఆమె ఆలోచనలో పడినట్లు సమాచారం.ఏదేమైనా 1, 2 రోజుల్లో ఆమె ఈ మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోగా పన్నీర్సెల్వంపై ఎదురుదాడి చేయాలని, ఆయన విమర్శలను తిప్పికొట్టాలని తన అనుచరులకు ఆమె ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు పలువురు నేతలు పన్నీర్సెల్వంపై విమర్శలు కురిపించారు. జయ మరణానంతరం ఆయన్ను సీఎం పీఠంపై కూర్చోబెడితే, అందుకు కృతజ్ఞతగా ఆయన చిన్నమ్మనే ధిక్కరించారంటూ పలువురు సీనియర్లు ఎద్దేవా చేశారు. | nation |
18,295 | 13-11-2017 16:33:06 | ఇంట్లో పరిస్థితుల వల్లే హంతకుడినయ్యా.. రియాన్ స్కూల్ టీనేజర్! | న్యూఢిల్లీ: ఓ టీనేజ్ పిల్లాడు రియాన్ స్కూల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అతడు అలా మారేందుకు గల కారణాలపైనా సీబీఐ అధికారులు లోతుగా విచారణ జరిపారు. స్కూల్లో జరిగే ఇంటర్నల్ పరీక్షలు, తర్వాత జరిగే పేరెంట్స్ మీటింగ్ వాయిదా పడేందుకే రెండో తరగతి విద్యార్ధి ప్రద్యుమన్ను చంపానని 11వ తరగతి విద్యార్ధి ఒప్పుకున్నాడు. తక్కువ మార్కులు వచ్చినందుకు తిడతారన్న కారణంతోనే తానీ ఘాతుకానికి పాల్పినట్టు చెప్పాడు. ఇంతకీ తక్కువ మార్కులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నిస్తే... విస్మయం కలిగించే పలు కారణాలు వెల్లడించాడు. ‘‘మా ఇంట్లో వాతావరణం అస్సలు బాగోదు. అమ్మానాన్న ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారు. అందుకే చదువు మీద నాకు ఆసక్తి తగ్గిపోయింది...’’ అని టీనేజర్ పేర్కొన్నట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా జిల్లా బాలల భద్రతా విభాగం అధికారులు ప్రస్తుతం అతడి తల్లిదండ్రులు, పొరుగువారు, నిందితుడి స్నేహితులను కూడా కలుసుకోనున్నారు. ఈ కేసులో కీలకమైన ‘సామాజిక విచారణ నివేదిక’ను తయారుచేయడంలో భాగంగా వీరందర్నీ ప్రశ్నించనున్నట్టు చెబుతున్నారు. మరోవైపు సదరు విద్యార్ధి ప్రవర్తన ఎప్పుడూ హింసాత్మకంగా ఉండేదనీ... సెల్ఫోన్లో వీడియోలు చూస్తూ అల్లరిగా తిరిగేవాడని పలువురు తోటి విద్యార్ధులు అధికారుల విచారణలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే నిందితుడిపై విచారణ పూర్తి చేసిన సీబీఐ.. మళ్లీ కస్టడీ పొడిగింపు కోరలేదు. దీంతో అతడిని ఈ నెల 22 వరకు ఫరీదాబాద్ అబ్జర్వేషన్ హోమ్లో ఉంచాలని బాలల న్యాయస్థానం ఆదేశించింది. | nation |
13,852 | 28-02-2017 16:39:00 | ఆశలు అమెరికాలో... ప్రాణాలు గాల్లో... తొమ్మిదేళ్లలో 30 మంది! | అమెరికాలో హత్యకు గురైన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల ఉదంతం తెలుగు వారిలో ఒక విధమైన భయాందోళనకు కారణమైంది. అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో కూడా అభద్రతా భావం పెరిగిపోయింది. ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర్నుంచి అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారిలో కల్లోలం మొదలైంది. మన ఉద్యోగాలు మనకే అని ట్రంప్ ఇచ్చిన ఒక్క పిలుపు ఆయనను అధ్యక్షుడిని చేసింది. ఇన్నాళ్లు ఉద్యోగాల విషయంలో బెంగ పెట్టుకున్న ఎన్నారైలు ఇప్పుడు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. శ్రీనివాస్పై కాల్పుల అనంతరం అమెరికాలోని భారతీయుల్లో భయందోళనలు మరింత పెరిగాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. అయితే ఈ హత్య తర్వాత గతంలో జరిగిన పలు చేదు ఘటనలను అక్కడి భారతీయులు గుర్తుచేసుకుంటున్నారు. 2008వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ, అంటే గడిచిన 9 సంవత్సరాల్లో దాదాపు 30 మందికి పైగా తెలుగు వాళ్లు అమెరికాలో చనిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది కాల్పుల బాధితులే. ఫిబ్రవరి 10న వరంగల్ జిల్లాకు చెందిన వంశీ రెడ్డి కాలిఫోర్నియా జరిగిన కాల్పుల్లో మరణించాడు. గత డిసెంబర్లో విజయవాడకు చెందిన చుండూరి సాయి తేజస్వి కారు ప్రమాదంలో చనిపోయింది. 2016 జులైలో సంకీర్త్ అనే హైద్రాబాద్కు చెందిన యువకుడిని రూమ్మేట్ హత్య చేశాడు. టెక్సాస్లో జరిగిన ఈ ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. 2016 జూన్లో అరిజోనాలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో ఉద్యోగం చేస్తున్న నంబూరి శ్రీదత్త ప్రమాదవశాత్తు జలపాతంలో మునిగి చనిపోయాడు. హైద్రాబాద్కు చెందిన శివ కిరణ్ అనే యువకుడు డిప్రెషన్కు లోనై అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. 2015లో సాయి కిరణ్ అనే హైద్రాబాద్ యువకుడు ఓ దొంగ జరిపిన కాల్పుల్లో చనిపోయాడు. టెక్సాస్లో ఎలప్రోలు జయచంద్ర అనే యువకుడు కూడా ఇదే తరహాలో ఓ స్టోర్లో దొంగ జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఇలా దాదాపు 30 మంది తెలుగు వాళ్లు వేర్వేరు కారణాల వల్ల అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో దాదాపు 6లక్షల మంది తెలుగు వాళ్లే కావడం గమనార్హం. | nation |
7,895 | 25-11-2017 21:41:59 | జీసస్ జీవితం... | సువర్ణ క్రియేషన్స్ పతాకంపై ఎ.జాన్బాబు దర్శకత్వంలో సుధాకర్ నిర్మించిన ‘తొలి కిరణం’ చిత్రం డిసెంబర్ 22న విడుదల కానుంది. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చిత్ర దర్శకుడు ఈ విషయాన్ని తెలియజేశారు. పి.డి.రాజు జీస్సగా, అభినయ మేరీమాతగా నటించిన చిత్రమిది. ‘‘జీసస్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. 40 నిమిషాల గ్రాఫిక్స్ సినిమాకు హైలైట్ అవుతాయి’’ అని దర్శకుడు చెప్పారు. | entertainment |
15,539 | 28-09-2017 17:53:43 | రేపు ఈసీ చెంతకు పళని, పన్నీర్ వర్గాలు |
న్యూఢిల్లీ : అన్నా డీఎంకే ఎన్నికల గుర్తు ‘రెండు ఆకులు’ కోసం జరుగుతున్న పోరాటంలో సమైక్య అన్నా డీఎంకే వాదనను శుక్రవారం ఎన్నికల సంఘానికి సమర్పించబోతోంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల ప్రతినిథులు న్యూఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో అఫిడవిట్ను సమర్పిస్తారు. టీటీవీ దినకరన్ తన వాదనను వినిపించేందుకు 15 రోజుల అదనపు గడువును ఇవ్వాలని కోరినప్పటికీ ఎన్నికల సంఘం తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈసీ వర్గాల కథనం ప్రకారం మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబరు 31లోగా ఈ సమస్యను పరిష్కరించాలని ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించినట్లుగానే వచ్చే నెల 6న ఎన్నికల సంఘం ‘రెండు ఆకులు’ గుర్తుపై విచారణ జరుపుతుంది. | nation |
19,593 | 28-08-2017 18:46:17 | అతివేగంగా కారు నడిపి వాహనాలను ఢీకొట్టిన క్రికెటర్.. కేసు నమోదు | కటక్: అతివేగంగా కారు నడిపి వాహనాలను ఢీకొట్టిన మాజీ క్రికెటర్పై కేసు నమోదైంది. ఒడిశాలోని కటక్ బైపాస్ రోడ్డులోని చాహతాఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రంజీ జట్టుకు గతంలో కెప్టెన్గా వ్యవహరించిన హలధర్ దాస్ కారును అతివేగంగా నడుపుతూ ఇతర వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో హలధర్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని విచారించారు. | sports |
7,757 | 07-07-2017 15:50:03 | షారూక్ వల్లే సినిమా ఫ్లాపైందంటున్న సల్మాన్ ఫ్యాన్స్! | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్కు ఇటీవలి కాలంలో అన్నీ వరుస విజయాలే. యావరేజ్ అనిపించుకున్న సినిమాలు కూడా వందల కోట్ల కలెక్షన్లు సాధించి సల్మాన్ స్టామినాను చాటాయి. అయితే తాజా చిత్రం ‘ట్యూబ్లైట్’ మాత్రం సల్మాన్కు ఘోర పరాజయాన్ని అందించింది. ఈ చిత్ర పరాజయాన్ని తేలికగా తీసుకోలేకపోతున్నారు సల్మాన్ అభిమానులు. అందుకే ‘ట్యూబ్లైట్’ ఫ్లాపవడానికి గల కారణాన్ని కనిపెట్టారు. ‘ట్యూబ్లైట్’ సినిమాలో మరో స్టార్ హీరో షారూక్ ఖాన్ ఓ క్యామియో రోల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇలా షారూక్ కనిపించడం వల్లే తమ హీరో సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసిందని సోషల్ మీడియా ద్వారా ఆరోపిస్తున్నారు సల్మాన్ అభిమానులు. ఈ ఆరోపణలు శృతిమించడంతో షారూక్ అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. తమ హీరో కాసేపైనా తెరపై కనిపించడం వల్లే ‘ట్యూబ్లైట్’ ఆ మాత్రం కలెక్షన్లనైనా రాబట్టుకోగలిగిందని సమాధానమిస్తున్నారు షారూక్ ఫ్యాన్స్. | entertainment |
17,978 | 09-02-2017 01:34:59 | చిన్నమ్మకు ఈసీ షాక్! | చెన్నై, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): తమిళనాడు సీఎం పీఠాన్ని అధిష్ఠించేందుకు తపిస్తున్న శశికళకు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ ఎంపికలో ఎలాంటి నిబంధనలూ పాటించలేదని అభిప్రాయపడుతోంది. ఈ విషయమై త్వరలో అన్నాడీఎంకేకు నోటీసు జారీచేసే అవకాశం ఉంది. జయ మృతి తర్వాత జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో శశికళను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ తీర్మానం చేశారు. ప్రస్తుతం శాసనసభపక్ష నాయకురాలిగా కూడా ఎన్నికైన ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్న తరుణంలో.. పార్టీ నేతగా ఆమె ఎంపిక కావడమే పార్టీ నియమాలకు విరుద్ధమని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడుతోంది. అన్నాడీఎంకే నుండి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఇచ్చిన పిటీషన మేరకు ఈ వ్యవహారంపై ఈసీ విచారణ జరిపింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎంపిక గురించిగానీ, నియామకం గురించి గానీ అన్నాడీఎంకే పార్టీ నియమనిబంధనలలో ఎక్కడా పేర్కొనలేదని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలో వెల్లడైంది. దీంతో.. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎవరినైనా నియమించాలంటే అందుకు తగినట్లుగా పార్టీ నియమ నిబంధనలను సవరించాల్సి ఉంటుందని, అలాంటి సవరణలు చేపట్టకుండా జరిగిన శశికళ నియామకం చెల్లదని ఈసీ చెబుతోంది. ఈ విషయమై త్వరలో అన్నాడీఎంకే అధిష్టానానికి సంజాయిషీ కోరుతూ నోటీసును జారీచేయనుంది. చిన్నమ్మ పదోన్నతికి సంబంధించిన పత్రాలను, తీర్మానం ప్రతిని ఇవ్వాల్సిందిగా.. శశికళాపుష్ప ఫిర్యాదుపై స్పందించాల్సిందిగా అన్నాడీఎంకేను ఈసీ ఆదేశించింది. | nation |
8,832 | 12-10-2017 10:38:43 | ఈ జడ్జీల రెమ్యునరేషన్ తెలిస్తే ‘వామ్మో’ అంటారు | ముంబై: ఇటీవలి కాలంలో నినీతారలు టీవీ ఛానళ్లు నిర్వహించే కార్యక్రమాలకు జడ్జీలుగా వ్యవహరించడం మామూలైపోయింది. అయితే ఇందుకోసం వీరు తీసుకునే రెమ్యునరేషన్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. టీవీ షోలకు సంబంధించి బాలీవుడ్ తారలు తీసుకునే రెమ్యునరేషన్ వివరాలు.. మాధురీ దీక్షిత్ (ఝలక్ దిఖలా జా) - రూ. కోటి(ఎపిసోడ్)కరణ్ జోహార్ (ఝలక్ దిఖలా జా) - రూ. 10 కోట్లు(సీజన్)రెమో డిసౌజా (డాన్స్ ప్లస్) - రూ. 2.5 లక్షలు(ఎపిసోడ్)రుతిక్ రోషన్ (జస్ట్ డాన్స్) - రూ. కోటి(ఎపిసోడ్)షాహిద్ కపూర్ (ఝలక్ దిఖలా జా) - రూ. 1.75 కోట్లు (ఎపిసోడ్)మలైకా అరోరా (ఝలక్ దిఖలా జా) - రూ. కోటి(సీజన్)జాక్లీన్ ఫెర్నాండిజ్ (నచ్ బలియే) - రూ. 1.25 కోట్లు(ఎపిసోడ్)సోనాక్షీ సిన్హా (నచ్ బలియే) - రూ. కోటి(ఎపిసోడ్)కిరణ్ ఖేర్ (ఇండియన్ గెట్ టాలెంట్) - రూ. 2 కోట్లుసోహెల్ ఖాన్ (కామెడీ సర్కస్) - రూ. 3 కోట్లు (సీజన్) | entertainment |
20,963 | 17-02-2017 00:25:04 | సౌతజోన్ను గెలిపించిన మిలింద్, మయాంక్ | ముంబై: సీవీ మిలింద్ (3/41), విజయ్ శంకర్ (2/21) రాణించడంతో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సౌత్జోన్ 5 వికెట్లతో వెస్ట్జోన్పై గెలుపొందింది. గురువారం జరిగిన మ్యాచ్లో తొలుత వెస్ట్జోన్ నిర్ణీత ఓవర్లలో 140/9 పరుగులు చేసింది. హుడా (32) టాప్ స్కోరర్. అనంతరం మయాంక్ అగర్వాల్ (70) మెరుపు అర్థ శతకంతో చెలరేగడంతో సౌత్జోన్ 17.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వినోద్ (36) కూడా రాణించాడు. ఇర్ఫాన్ పఠాన్, శౌర్య, ఈశ్వర్, ప్రవీణ్ తాంబే ఒక్కో వికెట్ పడగొట్టారు. | sports |
3,792 | 25-03-2017 00:53:22 | పాఠశాల విద్యకు శాపం సీసీఈ | పాఠశాల విద్యలో ప్రయోగాలన్నింటిని తరచి చూస్తే ఒక్క అంశం బోధపడుతుంది. పాపం చిన్న పిల్లలకు వాళ్ళపై జరుగుతున్న ప్రయోగాలు తెలియవు. విద్యావంతులారా, ఉపాధ్యాయులారా, విద్యార్థి సంఘాల మిత్రులారా ఇప్పటికైనా ఈ విద్యార్థుల పక్షాన మాట్లాడండి. పాఠశాల విద్యపై ప్రయోగాల మీద ప్రయోగాలు. ప్రయోగాల పాడుకాలం ఇది! పాపం పిల్లలను చూస్తే జాలేస్తుంది. మార్చి 17 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. 2012లో ఉన్నత పాఠశాలల్లో నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం (సీసీఈ) ఈ బ్యాచ్ 6వ తరగతిలోకి ప్రవేశించిన నాటి నుంచే ప్రారంభమైంది. ఐదేళ్ళు సీసీఈ విధానంలో చదువుకున్న మొదటి బ్యాచ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 17 నుంచి రాస్తున్నారు. పాఠశాల విద్యలో ఈ విధానం ప్రారంభించిన నాటినుంచే దీనిని తెలంగాణ టీచర్స్ సంఘం (టీటీయూ) వ్యతిరేకిస్తున్నది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వారు ఈ విధానాన్ని పాఠశాల విద్యలో 2009లో ప్రవేశపెట్టడం జరిగింది. అభివృద్ధి చెందిన దేశాల నమూనాలను ఇక్కడ ప్రవేశపెట్టడం అంత మంచిదికాదని అనాడే చాలా మంది అభిప్రాయబడ్డారు. దేశ విద్యార్థుల సంఖ్యలో 1% విద్యార్థులు కూడా లేని సీబీఎస్ఈ పాఠశాలల్లో విఫలమవుతున్న దశలో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు మన పాఠశాల విద్యారంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకోగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కొనసాగించింది. ఎపెప్, డిపెప్, క్లిప్, క్లాప్ లాంటి అనేక ప్రయోగాలు పాఠశాల విద్యలో జరిగి పాఠశాల విద్యను మొత్తం భ్రష్టుపట్టించారు. ఒక విధానాన్ని అమలుపరిచేటప్పుడు ఆ విధానం ఏ దేశంలో లేదా ఏ రాష్ట్రంలో సత్ఫలితాలను ఇచ్చిందో, లేదా పరిశీలన చేయకుండానే ఎస్సీఈఆర్టీలోని కొంతమంది మేధావులు అధికార వ్యవస్థకు అనేక భ్రమలు కల్పించి పాఠశాల విద్యలో ప్రవేశపెడుతున్నారు. అవగాహన కోసం పాఠశాల సముదాయ సమావేశాలంటూ ఉపాధ్యాయుడి సమయాన్ని మొత్తం నాశనం చేయడమే కాక పథకం అమల్లోకి వచ్చి ఐదేళ్ళైనా ఇప్పటికీ ఇంకా అర్థం కాని పరిస్థితి ఉపాధ్యాయులలో నెలకొని ఉంది. కొద్ది రోజులు బోధనలో సంస్కరణలు, మరికొద్ది రోజులు పరీక్షల విధానంలో సంస్కరణలు, పాఠ్య పుస్తకాలలో సంస్కరణలు ఇలా పూటకో ఆలోచన, గడియకో నిర్ణయంతో ఉపాధ్యాయులను గజిబిజికి గురిచేస్తున్నారు. అట్లాంటి నిర్ణయాలలో భాగంగా వచ్చిందే ఈ సీసీఈ! ఈ విధానంలో విద్యార్థి సంతోషం (జాయ్ఫుల్)గా విద్యను అభ్యసిస్తాడని చెప్పారు. కానీ సంతోషం దేవుడెరుగు విద్యార్థులకు చుక్కలు కనబడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకోకుండానే ఈ విధానం ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఇది సీబీఎస్ఈ సిలబస్ను అమలుచేస్తున్న పాఠశాలల్లో విఫలమవుతున్న దశలో మన రాష్ట్రం దీనిని తలకెత్తుకున్నది. విద్యార్థికి ఉపాధ్యాయుడు బోధించేది ఏమీలేదు. అంతా విద్యార్థే నేర్చుకోవాలి. ఉపాధ్యాయుడు కేవలం ఒక గైడ్ మాత్రమే. పాఠ్యపుస్తకాల పాఠాల దగ్గర ప్రారంభమైన ఈ సంస్కరణ మొదటి సంవత్సరంలోనే విద్యార్థులపై పెనుభారాన్ని మోపుతూ విపరీతమైన సిలబస్ను పెట్టడంతో మరుసటి సంవత్సరానికి చాలా సిలబస్ను తొలగించాల్సి వచ్చింది. అయినా ఇప్పటికి ఇంకా సిలబస్ భారం విద్యార్థులపై ఎక్కువగానే ఉంది. దీనికి తోడు అదనంగా 1. కళలు, సాంస్కృతిక విద్య, 2. ఆరోగ్య, వ్యాయామ విద్య (యోగ, ధ్యానం), 3. పని, కంప్యూటర్ విద్య, 4. విలువల విద్య, జీవన నైపుణ్యాలు లాంటి నాలుగు సహా పాఠ్యాంశాలను ప్రవేశపెట్టారు. వీటిని బోధించడానికి ఏ పాఠశాలలో కూడా ఒక్క బోధకుడిని కూడా నియామకం చేయలేదు! వీటిపై కించెత్తు అవగాహన లేని ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులే వీటిని బోధించాలట! ఉపాధ్యాయుల్లో ఎంతమందికి కంప్యూటర్ విద్య, సంగీతం, కళలు, నృత్యం పట్ల అవగాహన ఉంటుంది? కనీసం వాటిల్లో శిక్షణ ఏమైనా ఎవరికైనా ఇచ్చారా అంటే అదీ లేదు! సీసీఈ విధానం విద్యార్థిని ఒక రిపోర్టర్గా, ఒక రచయితగా, ఒక కవిగా, ఒక నటునిగా, ఒక కొరియోగ్రాఫర్గా, ఒక నాటక కర్తగా, ఒక చిత్రకారునిగా, ఒక గాయకునిగా, ఒక వ్యాసకర్తగా ఇంకా ఇలా అనేక రకాలుగా మార్చాలనే సంకల్పం పైకి చూస్తే బాగానే ఉన్నట్టు, విద్యావ్యవస్థలో ఓ అద్భుత విద్యార్థిని సృష్టించబోతున్నట్లు అనిపిస్తుంది. విద్యార్థిని ఒక మంచి పౌరుని తయారు చేసే ప్రక్రియ ఈ విధానంలో లేదు. పాత పరీక్షల పద్ధతిలో అయితే ప్రతి సబ్జెక్ట్కు 100 మార్కులకు ప్రశ్న పత్రం ఇచ్చేవారు. హిందీకి మినహా మిగిలిన సబ్జెక్ట్లన్నింటికీ కూడా రెండు పేపర్ల విధానం అమలులో ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు అనేక తర్జనభర్జనల అనంతరం హిందీ మినహా మిగిలిన సబ్జెక్ట్లన్నింటికి రెండు పేపర్ల విధానం కొనసాగించినప్పటికి 80 (40+40) మార్కులకు ఒక సబ్జెక్ట్కు పరీక్ష నిర్వహిస్తారు. మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్ మార్కులుగా నిర్ణయించడం జరిగింది. ప్రతి ఫార్మటీవ్ టెస్ట్లో (నిర్మాణాత్మక పరీక్ష) విద్యార్థి పరిశీలనాంశాలు, విద్యార్థి వ్రాయవలసిన నోట్స్, ప్రాజెక్ట్ వర్క్, వ్రాత పరీక్ష మొత్తం ఈ నాలుగు అంశాలకు కలిపి 20 మార్కులుగా నిర్ణయించారు. ఈ విధంగా ఆ నాలుగు ఫార్మటీవ్ టెస్ట్లకు సంబంధించిన 80 మార్కులను సరాసరి చేసి 20 కి కుదించగా వచ్చేవే ఇంటర్నల్ మార్కులు. ఇందులో 10వ తరగతి విద్యార్థులు సాధించిన మార్కులను వెబ్సైట్లో నమోదు చేయవలసి ఉంటుంది. విద్యార్థులకు చెందిన వీటి రికార్డ్స్ను పాఠశాలలో భద్రపరుచవలసి ఉంటుంది. ఈ మార్కులు సరియైన విధంగా నమోదు చేసారా లేదా పరిశీలించడం కోసం ప్రతి ఫార్మటీవ్ టెస్ట్ అనంతరం ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పరచడం జరుగుతుంది. పులులు వస్తున్నాయి మేకల్లారా జాగ్రత్త అన్నట్లుగా ప్రకటనలు ఉంటాయి. అయితే ఈ బృందాల పరిశీలనలో తేలిన అంశమేమిటంటే 60 శాతం ప్రైవేటు పాఠశాలలకు ఈ విధానం అర్థంకాలేదు. వీటికి సంబంధించిన విద్యార్థి రికార్డ్స్ను ఇప్పటి వరకు ఏవిధంగా రాయించాలో తెలియడంలేదు. సందర్శన బృందాలకు వాళ్ళే ఎదురు ప్రశ్న వేస్తూ ఎంతో కొంత ముట్ట జెప్పి తాము ఎటువంటి రికార్డ్స్ లేకుండా కాగితాలపై నమోదు చేసిన మార్కులకు అప్రూవల్ ఇవ్వమని కోరుతున్నారు. ఈ బృందాలకు విందులు, వినోదాలకు ఆటవిడుపుగా మారింది. ప్రైవేటు పాఠశాలలకైతే ఇదో పెద్ద ఆదాయ వనరుగా మారింది. మొత్తం ఫీజు వసూలు చేసుకోవడానికి ఇదో మాస్టర్ ప్లాన్లా ఉంది. మొత్తం ఫీజు కడితేనే మీ పిల్లలకు 20 మార్కులు వేస్తాం అంటున్నారు. మీ పిల్లలకు 20కి ఇరవై మార్కులు కావాలంటే అదనంగా మరో రెండు వేలో, మూడు వేలో సమర్పించండి అని బహిరంగంగా వసూలు చేసే పాఠశాలలు కోకొల్లలు. కొన్ని పాఠశాలలవారైతే దీనిని పాఠశాల ఫీజులో భాగం చేసారు. ఇంటర్నల్ మార్కులతో అమ్మాయిలు అనేక ఇబ్బందులు, వేధింపులను ఎదుర్కొంటున్నారు. కుల జాఢ్యం కూడా ఇందులో తగలడింది. కొన్ని పాఠశాలల్లోనైతే అందరికి ఇరవైకి ఇరవై మార్కులు వస్తున్నాయి. విద్యార్థులు సకాలంలో ఫార్మటీవ్ టెస్ట్లు రాసి, ప్రాజెక్ట్ పనులు, పరిశీలనాంశాలు, రాత పనిని సమర్పించి మార్కులు పొందాలి. ఈ పనులను సకాలంలో పూర్తి చేసి సమర్పించని విద్యార్థులను ఉపాధ్యాయులు మందలించారని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు జరిగి, తప్పు ఉపాధ్యాయుని మీదకు నెట్టి విద్యాశాఖాధికారులు వారిని బలిచేశారు. పాఠశాలల్లో నిరంతరం ఇచ్చే ప్రాజెక్ట్ పనులతో విద్యార్థి కంప్యూటర్ సెంటర్స్ చుట్టే తిరుగుతున్నాడు. ఈ విధానం వేల రూపాయలను కంప్యూటర్ సెంటర్లకు దోచిపెడుతున్నదని తల్లిదండ్రులు అభిప్రాయపడటం మా యూనియన్ అధ్యయనంలో తేలింది. ఈ విధానంలో ప్రవేశపెట్టిన పనుల వలన చదవడంలో రాయడంలో విద్యార్థి వెనుకబడుతున్నాడు. విద్యార్థిపై మానసిక ఒత్తిడి భాగా పెరిగింది. పాఠశాలలోను, ఇంటి దగ్గర కూడా విద్యార్థికి ప్రైవేట్ జీవితాన్ని ఈ సీసీఈ విధానం దోచేసింది. అంతేకాదు ప్రతి ఉపాధ్యాయుడు తమ తమ సబ్జెక్ట్లకు చెందిన పనులను పదే పదే అడుగడంతో ఆ బాధలు భరించలేక విద్యార్థులు పాఠశాలకు రోజుల తరబడి హాజరు కావడం లేదు. ఈ నూతన అంశాలన్నింటిని ప్రవేశ పెట్టిన సందర్భాలలో కాని రాష్ట్ర విద్యాశాఖ, మేధావులు ఉపాధ్యాయులను కాని, ఉపాధ్యాయ సంఘాలను కాని మాట మాత్రంగా కూడా అభిప్రాయం అడుగలేదు. విద్యార్థుల స్థాయిని, సామర్థ్యాన్ని అసలు పట్టించుకోనేలేదు. ఈ ప్రయోగాలన్నింటిని తరచి తరిచి చూస్తే ఒక్క అంశం బోధపడుతుంది. పాపం చిన్న పిల్లలకు వాళ్ళపై జరుగుతున్న ప్రయోగాలు తెలియవు. వాళ్ళ అభిప్రాయాలు అడిగేవాళ్ళులేరు, వాళ్ళకు తెలియజెప్పేవాళ్ళు లేరు. వాళ్ళకు గొంతులేదు. వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రయోగాల విషయంలో కళాశాల విద్యార్థుల్లాగా వాళ్ళకు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం తెలియదు. విద్యావంతులారా, ఉపాధ్యాయులారా, విద్యార్థి సంఘాల మిత్రులారా ఇప్పటికైనా ఈ గొంతులేని పాఠశాల విద్యార్థుల పక్షాన మాట్లాడండి. లేక పోతే చరిత్ర మనల్ని క్షమించకపోవచ్చు!డాక్టర్ ఏరుకొండ నరసింహుడురాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టీచర్స్ సంఘం (టీటీయూ) ఈ విధానంలో విద్యార్థి సంతోషం (జాయ్ఫుల్)గా విద్యను అభ్యసిస్తాడని చెప్పారు. కానీ సంతోషం దేవుడెరుగు విద్యార్థులకు చుక్కలు కనబడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకోకుండానే ఈ విధానం ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఇది సీబీఎస్ఈ సిలబస్ను అమలుచేస్తున్న పాఠశాలల్లో విఫలమవుతున్న దశలో మన రాష్ట్రం దీనిని తలకెత్తుకున్నది. విద్యార్థికి ఉపాధ్యాయుడు బోధించేది ఏమీలేదు. అంతా విద్యార్థే నేర్చుకోవాలి. ఉపాధ్యాయుడు కేవలం ఒక గైడ్ మాత్రమే. పాఠ్యపుస్తకాల పాఠాల దగ్గర ప్రారంభమైన ఈ సంస్కరణ మొదటి సంవత్సరంలోనే విద్యార్థులపై పెనుభారాన్ని మోపుతూ విపరీతమైన సిలబస్ను పెట్టడంతో మరుసటి సంవత్సరానికి చాలా సిలబస్ను తొలగించాల్సి వచ్చింది. అయినా ఇప్పటికి ఇంకా సిలబస్ భారం విద్యార్థులపై ఎక్కువగానే ఉంది. దీనికి తోడు అదనంగా 1. కళలు, సాంస్కృతిక విద్య, 2. ఆరోగ్య, వ్యాయామ విద్య (యోగ, ధ్యానం), 3. పని, కంప్యూటర్ విద్య, 4. విలువల విద్య, జీవన నైపుణ్యాలు లాంటి నాలుగు సహా పాఠ్యాంశాలను ప్రవేశపెట్టారు. వీటిని బోధించడానికి ఏ పాఠశాలలో కూడా ఒక్క బోధకుడిని కూడా నియామకం చేయలేదు! వీటిపై కించెత్తు అవగాహన లేని ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులే వీటిని బోధించాలట! ఉపాధ్యాయుల్లో ఎంతమందికి కంప్యూటర్ విద్య, సంగీతం, కళలు, నృత్యం పట్ల అవగాహన ఉంటుంది? కనీసం వాటిల్లో శిక్షణ ఏమైనా ఎవరికైనా ఇచ్చారా అంటే అదీ లేదు! సీసీఈ విధానం విద్యార్థిని ఒక రిపోర్టర్గా, ఒక రచయితగా, ఒక కవిగా, ఒక నటునిగా, ఒక కొరియోగ్రాఫర్గా, ఒక నాటక కర్తగా, ఒక చిత్రకారునిగా, ఒక గాయకునిగా, ఒక వ్యాసకర్తగా ఇంకా ఇలా అనేక రకాలుగా మార్చాలనే సంకల్పం పైకి చూస్తే బాగానే ఉన్నట్టు, విద్యావ్యవస్థలో ఓ అద్భుత విద్యార్థిని సృష్టించబోతున్నట్లు అనిపిస్తుంది. విద్యార్థిని ఒక మంచి పౌరుని తయారు చేసే ప్రక్రియ ఈ విధానంలో లేదు. పాత పరీక్షల పద్ధతిలో అయితే ప్రతి సబ్జెక్ట్కు 100 మార్కులకు ప్రశ్న పత్రం ఇచ్చేవారు. హిందీకి మినహా మిగిలిన సబ్జెక్ట్లన్నింటికీ కూడా రెండు పేపర్ల విధానం అమలులో ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు అనేక తర్జనభర్జనల అనంతరం హిందీ మినహా మిగిలిన సబ్జెక్ట్లన్నింటికి రెండు పేపర్ల విధానం కొనసాగించినప్పటికి 80 (40+40) మార్కులకు ఒక సబ్జెక్ట్కు పరీక్ష నిర్వహిస్తారు. మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్ మార్కులుగా నిర్ణయించడం జరిగింది. ప్రతి ఫార్మటీవ్ టెస్ట్లో (నిర్మాణాత్మక పరీక్ష) విద్యార్థి పరిశీలనాంశాలు, విద్యార్థి వ్రాయవలసిన నోట్స్, ప్రాజెక్ట్ వర్క్, వ్రాత పరీక్ష మొత్తం ఈ నాలుగు అంశాలకు కలిపి 20 మార్కులుగా నిర్ణయించారు. ఈ విధంగా ఆ నాలుగు ఫార్మటీవ్ టెస్ట్లకు సంబంధించిన 80 మార్కులను సరాసరి చేసి 20 కి కుదించగా వచ్చేవే ఇంటర్నల్ మార్కులు. ఇందులో 10వ తరగతి విద్యార్థులు సాధించిన మార్కులను వెబ్సైట్లో నమోదు చేయవలసి ఉంటుంది. విద్యార్థులకు చెందిన వీటి రికార్డ్స్ను పాఠశాలలో భద్రపరుచవలసి ఉంటుంది. ఈ మార్కులు సరియైన విధంగా నమోదు చేసారా లేదా పరిశీలించడం కోసం ప్రతి ఫార్మటీవ్ టెస్ట్ అనంతరం ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పరచడం జరుగుతుంది. పులులు వస్తున్నాయి మేకల్లారా జాగ్రత్త అన్నట్లుగా ప్రకటనలు ఉంటాయి. అయితే ఈ బృందాల పరిశీలనలో తేలిన అంశమేమిటంటే 60 శాతం ప్రైవేటు పాఠశాలలకు ఈ విధానం అర్థంకాలేదు. వీటికి సంబంధించిన విద్యార్థి రికార్డ్స్ను ఇప్పటి వరకు ఏవిధంగా రాయించాలో తెలియడంలేదు. సందర్శన బృందాలకు వాళ్ళే ఎదురు ప్రశ్న వేస్తూ ఎంతో కొంత ముట్ట జెప్పి తాము ఎటువంటి రికార్డ్స్ లేకుండా కాగితాలపై నమోదు చేసిన మార్కులకు అప్రూవల్ ఇవ్వమని కోరుతున్నారు. ఈ బృందాలకు విందులు, వినోదాలకు ఆటవిడుపుగా మారింది. ప్రైవేటు పాఠశాలలకైతే ఇదో పెద్ద ఆదాయ వనరుగా మారింది. మొత్తం ఫీజు వసూలు చేసుకోవడానికి ఇదో మాస్టర్ ప్లాన్లా ఉంది. మొత్తం ఫీజు కడితేనే మీ పిల్లలకు 20 మార్కులు వేస్తాం అంటున్నారు. మీ పిల్లలకు 20కి ఇరవై మార్కులు కావాలంటే అదనంగా మరో రెండు వేలో, మూడు వేలో సమర్పించండి అని బహిరంగంగా వసూలు చేసే పాఠశాలలు కోకొల్లలు. కొన్ని పాఠశాలలవారైతే దీనిని పాఠశాల ఫీజులో భాగం చేసారు. ఇంటర్నల్ మార్కులతో అమ్మాయిలు అనేక ఇబ్బందులు, వేధింపులను ఎదుర్కొంటున్నారు. కుల జాఢ్యం కూడా ఇందులో తగలడింది. కొన్ని పాఠశాలల్లోనైతే అందరికి ఇరవైకి ఇరవై మార్కులు వస్తున్నాయి. విద్యార్థులు సకాలంలో ఫార్మటీవ్ టెస్ట్లు రాసి, ప్రాజెక్ట్ పనులు, పరిశీలనాంశాలు, రాత పనిని సమర్పించి మార్కులు పొందాలి. ఈ పనులను సకాలంలో పూర్తి చేసి సమర్పించని విద్యార్థులను ఉపాధ్యాయులు మందలించారని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు జరిగి, తప్పు ఉపాధ్యాయుని మీదకు నెట్టి విద్యాశాఖాధికారులు వారిని బలిచేశారు. పాఠశాలల్లో నిరంతరం ఇచ్చే ప్రాజెక్ట్ పనులతో విద్యార్థి కంప్యూటర్ సెంటర్స్ చుట్టే తిరుగుతున్నాడు. ఈ విధానం వేల రూపాయలను కంప్యూటర్ సెంటర్లకు దోచిపెడుతున్నదని తల్లిదండ్రులు అభిప్రాయపడటం మా యూనియన్ అధ్యయనంలో తేలింది. ఈ విధానంలో ప్రవేశపెట్టిన పనుల వలన చదవడంలో రాయడంలో విద్యార్థి వెనుకబడుతున్నాడు. విద్యార్థిపై మానసిక ఒత్తిడి భాగా పెరిగింది. పాఠశాలలోను, ఇంటి దగ్గర కూడా విద్యార్థికి ప్రైవేట్ జీవితాన్ని ఈ సీసీఈ విధానం దోచేసింది. అంతేకాదు ప్రతి ఉపాధ్యాయుడు తమ తమ సబ్జెక్ట్లకు చెందిన పనులను పదే పదే అడుగడంతో ఆ బాధలు భరించలేక విద్యార్థులు పాఠశాలకు రోజుల తరబడి హాజరు కావడం లేదు. ఈ నూతన అంశాలన్నింటిని ప్రవేశ పెట్టిన సందర్భాలలో కాని రాష్ట్ర విద్యాశాఖ, మేధావులు ఉపాధ్యాయులను కాని, ఉపాధ్యాయ సంఘాలను కాని మాట మాత్రంగా కూడా అభిప్రాయం అడుగలేదు. విద్యార్థుల స్థాయిని, సామర్థ్యాన్ని అసలు పట్టించుకోనేలేదు. ఈ ప్రయోగాలన్నింటిని తరచి తరిచి చూస్తే ఒక్క అంశం బోధపడుతుంది. పాపం చిన్న పిల్లలకు వాళ్ళపై జరుగుతున్న ప్రయోగాలు తెలియవు. వాళ్ళ అభిప్రాయాలు అడిగేవాళ్ళులేరు, వాళ్ళకు తెలియజెప్పేవాళ్ళు లేరు. వాళ్ళకు గొంతులేదు. వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రయోగాల విషయంలో కళాశాల విద్యార్థుల్లాగా వాళ్ళకు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం తెలియదు. విద్యావంతులారా, ఉపాధ్యాయులారా, విద్యార్థి సంఘాల మిత్రులారా ఇప్పటికైనా ఈ గొంతులేని పాఠశాల విద్యార్థుల పక్షాన మాట్లాడండి. లేక పోతే చరిత్ర మనల్ని క్షమించకపోవచ్చు!డాక్టర్ ఏరుకొండ నరసింహుడురాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టీచర్స్ సంఘం (టీటీయూ) | editorial |
16,325 | 08-11-2017 18:58:18 | వినూత్నంగా టోల్ వసూళ్ళు : నితిన్ గడ్కరీ |
ముంబై : జాతీయ రహదారులపై టోల్ వసూళ్ళ విధానంలో కొత్తదనం రాబోతోంది. వచ్చే నెల నుంచి అన్ని టోల్ ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. డిజిటైజేషన్, నగదు రహిత లావాదేవీల నిర్వహణ పట్ల ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై నగదు రహిత టోల్ వసూలు సులభంగా జరిగేందుకు వీలుగా డిసెంబరు 1 తర్వాత రోడ్డుపైకి వచ్చే వాహనాలన్నిటికీ ఎఫ్ఏఎస్ట్యాగ్ను ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 7.5 లక్షల వాహనాలకు ఎఫ్ఏఎస్ట్యాగ్లు ఉన్నట్లు తెలిపారు. వచ్చే మార్చినాటికి ఈ సంఖ్య 25 లక్షలకు పెరుగుతుందన్నారు. రాబోయే రెండు నెలల్లో దేశంలోని 3,800 రహదారులను ఎఫ్ఏఎస్ట్యాగ్కు అనువుగా మార్చుతామని తెలిపారు. ఎఫ్ఏఎస్ట్యాగ్ విధానంలో రోజుకు రూ.10 కోట్లు ఆదాయం వస్తోందని, ఇది వచ్చే మార్చినాటికి 30 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సమయం, ఇంధనం ఆదా అయ్యేందుకు దోహదపడే చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని గడ్కరీ తెలిపారు. అటువంటి చర్యల్లో జీఎస్టీ ఒకటి అని వివరించారు. జీఎస్టీ వల్ల రవాణాదారులకు అనేక రకాల ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. చెక్పోస్టులను ఎత్తివేయడంతో లారీల ప్రయాణ సమయం దాదాపు 20 శాతం వరకు తగ్గిందని తెలిపారు. | nation |
958 | 08-06-2017 00:48:39 | ప్రభుత్వ అభ్యర్థనకు నో... | రేట్ల కోతను ఆశిస్తున్న ప్రభుత్వం ఈ నెల 1,2 తేదీల్లో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం కావాలని ఎంపిసి సభ్యులను కోరింది. కాని స్వయంప్రతిపత్తిని పోగొట్టుకునేందుకు ఇష్టం లేని ఎంపిసి ఆ అభ్యర్థనను తిరస్కరించింది. మొత్తం ఆరుగురు సభ్యులూ ఆర్థిక శాఖ అధికారులను కలిసేందుకు విముఖత ప్రదర్శించారని ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు. | business |
20,959 | 30-10-2017 15:37:52 | ఆ సిక్సర్తో కోహ్లీ ప్రాణం లేచివచ్చింది..! | న్యూఢిల్లీ: కాన్పూర్ వేదికగా ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్పై చిరస్మరణీయ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ సాధించిన అద్భుత సెంచరీతో భారత జట్టు కివీస్ ముందు భారీ లక్ష్యం ఉంచేందుకు, చారిత్రాత్మక సిరీస్ గెలుచుకునేందుకు ఉపయోగపడింది. ప్రత్యేకించి అతడి బ్యాంటింగ్లో జాలువారిన ఓ సిక్సర్పై బీసీసీఐ మరో కనువిందైన వీడియో విడుదల చేసింది. రోహిత్ కొట్టిన బంతిని కెప్టెన్ కోహ్లీ తదేకంగా చూస్తున్న ఆసక్తికర హావభావాలు ఇందులో రికార్డయ్యాయి. సిక్సర్ అని నిర్ధారణకు రాగానే కెప్టెన్ ముఖంలో ఆనందాన్ని ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. కాన్పూర్ మ్యాచ్లో రోహిత్ 147 పరుగులతో ప్రత్యర్థి జట్టును పరుగులు పెట్టించగా... కోహ్లీ సైతం అంతే దూకుడుతో ఆడుతూ 113 పరుగులు రాబట్టాడు. అంతేకాదు అతి తక్కువ మ్యాచుల్లోనే 9 వేల పరుగుల మైలురాయిని దాటి ఔరా అనిపించాడు. వీడియో కోసం క్లిక్ చేయండి ఆ ఒలింపిక్స్ ఈ సారి భారత్లోనేనట క్రికెట్ అభిమానులకు ఓ శుభవార్త | sports |
9,474 | 23-08-2017 11:59:46 | బాగా సంపాదిస్తున్న టాప్ 10 నటుల్లో ముగ్గురు మనోళ్లే! | అందరి సంపాదనలందు.. యాక్టర్ల సంపాదన వేరయా అంటుంది ప్రేక్షక లోకం. వీరి సంపాదన ఆ రేంజ్లో ఉంటుంది మరి. అందుకే వీరి సంపాదన ఎంతో తెలుసుకోవాలని సినీ ప్రియులు ఆసక్తిగా చూస్తుంటారు. ఈ ఏడాది కూడా ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక వివిధ రంగాల్లో బాగా సంపాదిస్తున్న సెలబ్రిటీల వివరాలను తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా బాగా సంపాదిస్తున్న యాక్టర్లలో మనవాళ్లు ముగ్గురుండటం విశేషం. 2016 జూన్ 1 నుంచి 2017 జూన్ 1 మధ్య కాలంలో వివరాలను బేస్ చేసుకుని ఫోర్బ్స్ పత్రిక ఈ వివరాలను రిలీజ్ చేసింది. అవునండీ మీరు చదువుతున్నది నిజమే. ఫోర్బ్స్ విడుదల చేసిన లిస్టులో టాప్ 10 లో మన ఇండియన్ స్టార్స్ ముగ్గురున్నారు. హాలీవుడ్ స్టార్స్ మార్క్ వాబర్గ్ 68 మిలియన్ డాలర్ల సంపాదనతో నెం.1 స్థానంలో, డ్వేన్ జాన్సన్ 65 మిలియన్ డాలర్ల సంపాదనతో రెండో స్థానంలో, విన్ డీసెల్ 54.5 మిలియన్ డాలర్ల సంపాదనతో 3వ స్థానంలో నిలిచారు. మన కరెన్సీ ప్రకారం ఈ ముగ్గురి సంపాదనలు వరుసగా.. రూ. 435, 416, 349 కోట్లు. మరో హాలీవుడ్ నటుడు ఆడమ్ సాండ్లర్ 50.5 మిలియన్ డాలర్లతో 4వ స్థానంలో.. ఇంటర్నేషనల్ నటుడు జాకీ చాన్ 49 మిలియన్ డాలర్లతో 5వ స్థానంలో.. ఐరన్ మ్యాన్ స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్ 48 మిలియన్ డాలర్లతో 6వ స్థానంలో.. హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ 43 మిలియన్ డాలర్లతో 7వ స్థానంలో నిలిచారు. ఇక మన ఇండియన్ స్టార్ హీరోలు వరుసగా 8, 9, 10స్థానాల్లో నిలిచారు. షారుక్ ఖాన్ 38 మిలియన్ డాలర్ల సంపాదనతో 8వ స్థానంలో ఉన్నారు. మన కరెన్సీ ప్రకారం రూ. 243.5 కోట్లు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ 37 మిలియన్ డాలర్ల సంపాదనతో 9వ స్థానంలో నిలిచారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ.237 కోట్లు. అక్షయ్ కుమార్ 35.5 మిలియన్ డాలర్లతో 10వ స్థానంలో ఉన్నారు. మన కరెన్సీ ప్రకారం అక్షయ్ సంపాదన రూ. 227.5 కోట్ల రూపాయలు. | entertainment |
13,241 | 08-12-2017 08:25:44 | ఓమన్ విమాన కో పైలెట్కు లైసెన్స్ లేదని...విమానం నిలిపివేత | న్యూఢిల్లీ : వాహనం నడుపుతున్న డ్రైవరు తన డ్రైవింగ్ లైసెన్సును ఇంట్లో మరచిపోతే ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించడం సర్వసాధారణం. కాని...మస్కట్ దేశానికి చెందిన ఓమన్ విమాన కోపైలెట్ లైసెన్సు లేకుండానే విమానం నడిపేందుకు విధులకు హాజరైన ఘటన న్యూఢిల్లీలో సంచలనం రేపింది. ఓమన్ విమానం న్యూఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలు దేరాల్సి ఉండగా సాధారణ తనిఖీల్లో ఆ విమాన కో పైలెట్ కు లైసెన్సు లేదని విమానాశ్రయ అధికారులు గుర్తించారు. అంతే ఓమన్ విమానం వెళ్లేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు నిరాకరించారు. ఓమన్ ఎయిర్ కు చెందిన ఢిల్లీ- మస్కట్ విమాన కోపైలెట్ వద్ద లైసెన్సు లేకపోవడంతో విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలోనే నిలిపివేశారు. లైసెన్సు లేకుండా పైలెట్లు విమానాలు నడుపుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. | nation |
13,579 | 06-10-2017 10:39:46 | లేడీ డాక్టర్పై బురఖాలు ధరించిన ఇద్దరు దుండగుల హత్యాయత్నం | చెన్నై : స్థానిక పెరంబూరులో నివసిస్తున్న లేడీ డాక్టర్పై బురఖాలు ధరించిన ఇద్దరు దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రైవేట్ క్లినిక్ యజమాని అయిన డాక్టర్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పెరంబూరు పటేల్రోడ్డులో డాక్టర్ షణ్ముగసుందరం, డాక్టర్ రమ్య (33) దంపతులు నివసిస్తున్నారు. రమ్య కోయంబేడులో సంతాన సాఫల్య కేంద్రాన్ని నడుపుతున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని రమ్య కారులో ఇంటికి చేరుకుంది. కారును పార్కింగ్ చేసి రెండో అంతస్తులో ఉన్న తన ప్లాట్కు వెళుతున్న రమ్యను బురఖాలు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు కత్తులతో పొడిచి పారిపోయారు. ఆమె పెట్టిన కేకలు విని చుట్టుపక్కలవారు పరుగెత్తుకొచ్చి రమ్యను చికిత్స నిమిత్తం పోరూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దుండగుల దాడిలో రమ్య తల, మెడ, వీపుపై కత్తిపోటు గాయాలయ్యాయి. సెంబియం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపగా పాతకక్షల నేపథ్యంలో రమ్యపై హత్యాయత్నం జరిగినట్లు తెలిసింది. చూళైమేడులో థామస్ అనే వ్యక్తి నడుపుతున్న ఫెర్టిలిటీ సెంటర్లో డాక్టర్ రమ్య పనిచేస్తుండేది. థామ్సతో గొడవల కారణంగా ఉద్యోగం మాని, కోయంబేడులో ఆమె కొత్తగా క్లినిక్ను ప్రారంభించింది. ఇటీవల థామస్ క్లినిక్ నుంచి ఇద్దరు ఉద్యోగం మానుకుని రమ్య ప్రారంభించిన క్లినిక్లో చేరారు. దీంతో ఆగ్రహించిన థామస్ రమ్యపై తన అనుచరులతో దాడి చేయించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు థామస్, పళనిసామి, యోనా, ముఖిలన్, సత్యకళ, భవానీ అనే ఆరుగురిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. | nation |
13,827 | 15-09-2017 02:56:48 | ఇరాక్లో ఆత్మాహుతి దాడులు.. | 74 మంది మృతిబాగ్దాద్, సెప్టెంబరు 14: ఆత్మాహుతి దాడులు, కాల్పులతో ఇరాక్ రక్తసిక్తమైంది. ఈ దాడుల్లో 74 మంది మృతి చెందగా.. 93 మంది గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. నసిరియా నగరంలో ఓ రెస్టారెంట్పై, పోలీస్ చెక్పోస్టుపై టెర్రరిస్టులు విరుచుకుపడ్డారు. ఆత్మాహుతి దళ సభ్యుడొకరు రెస్టారెంట్లో తనను తాను పేల్చేసుకున్నాడు. అదే సమయంలో మరో ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు అక్కడున్న వారిపై కాల్పులకు తెగబడ్డారు. మృతుల్లో ఎక్కువగా ఇరానియన్లు ఉన్నారు. అక్కడికి దగ్గర్లో ఉన్న పోలీస్ చెక్పోస్టుపై మరో ఇద్దరు సూసైడ్ బాంబర్లు దాడి చేశారు. పేలుడు పదార్థాలు ఉన్న వ్యాన్తో వచ్చి తమను తాము పేల్చేసుకున్నారు. | nation |
7,071 | 28-03-2017 12:49:47 | బికినీలో కూతురుతో మాజీ విశ్వసుందరి డాన్స్! | మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్.. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. హీరోయిన్గా తప్పుకొన్నా.. పలు స్టేట్మెంట్లతో సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటోంది. పెళ్లి చేసుకోకుండా కుమారిగానే మిగిలిపోయిన ఈ విశ్వ సుందరి.. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుకొంటోంది. వారితో కలిసి ఫారిన్ టూర్లకు వెళుతూ ఫెమినిజం, స్త్రీ స్వాతంత్ర్యం గురించి వారికి చెబుతోంది. దత్తత చేసుకున్నా ఇద్దరు కూతుళ్లను సొంత కూతుళ్లకన్నా ఎక్కువగా చూసుకుంటోంది సుష్మిత. ఇక, వారితో కలిసి ఎంజాయ్ చేసిన ఓ వీడియోను సుష్మిత గత రాత్రి సోషల్ మీడియాలో పెట్టింది. తన 12 ఏళ్ల కూతురు రెనీ, 7 ఏళ్ల కూతురు అలీసాతో డాన్స్ వేసిన వీడియోను పోస్ట్ చేసింది. ప్రముఖ పాప్ గాయకుడు ఎడ్ షెరాన్ కంపోజ్ చేసి.. ‘షేప్ ఆఫ్ యూ’ అనే పాటకు చిన్న కూతురుతో కలిసి బికినీలో డాన్స్ వేసింది. బికినీలో సుష్మిత మెరవడమే కాకుండా తన కూతురుకు కూడా బికినీ వేసి.. ఇండైరెక్ట్గా ఓ మెసేజ్ ఇచ్చేస్తోందని ఆ వీడియో చూసిన నెటిజన్లు అంటున్నారు. ‘‘అయితే కూర్చోవడం.. డాన్స్ చేయడం.. అని ఓ రెండు ఆప్షన్లిస్తే తాను మాత్రం కచ్చితంగా డాన్స్నే ఎంచుకుంటాను’’ అని చెబుతోంది సుష్మితా సేన్. | entertainment |
18,489 | 19-12-2017 03:59:49 | చిలీ అధ్యక్షుడిగా సెబాస్టియన్ పినెరా | శాంటియగో, డిసెంబరు 18: చిలీ అధ్యక్షుడిగా సెబాస్టియన్ పినెరా మరోసారి ఎన్నికయ్యారు. సోమవారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో సెబాస్టియన్ పినెరా 55శాతం ఓట్లతో విజయం సాధించారు. | nation |
18,664 | 10-02-2017 01:55:15 | అమెరికా అటార్నీ జనరల్గా జెఫ్ సెషన్స్ |
వాషింగ్టన్, ఫిబ్రవరి 9: అమెరికా 84వ అటార్నీ జనరల్గా అలబామా సెనేటర్ జెఫ్ సెషన్స్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. జెఫ్ నియామకాన్ని అడ్డుకొనేందుకు సెనేట్లో డెమోక్రాట్లు తీవ్రంగా ప్రయత్నించారు. సుమారు 30 గంటలపాటు సెనేట్లో జెఫ్ నియామకంపై చర్చ నడిచింది. డెమోక్రాట్లు వ్యతిరేకించినా చివరకు 52-47 ఓట్లతో జెఫ్ అటార్నీ జనరల్గా ఆమోదం పొందారు. వెంటనే ఆయన సెనేటర్ పదవికి రాజీనామా చేశారు. తొలి నుంచీ హెచ్-1బి వీసాల జారీని జెఫ్ వ్యతిరేకిస్తున్నారు. కాగా, ఐఎస్ వంటి ఇస్లామిక్ ఉగ్రవాదులతో అమెరికాకు ముప్పు పొంచి ఉందని వైట్హౌస్ పేర్కొంది. అమెరికన్ల రక్షణకు ట్రంప్ తగిన చర్యలు తీసుకుంటున్నారని, ఈ విషయంలో ఆయన చిత్తశుద్ధిని ఎవ్వరూ శంకించలేరని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ తెలిపారు. కాగా.. ట్రంప్ పాలన 9/11 దాడుల సమయంలో అమెరికా పరిస్థితి కన్నా దారుణంగా ఉందని ద ప్రోగ్రెసివ్ మాన్హట్టన్ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ స్టీవ్ నెల్సన్ పేర్కొన్నారు. | nation |
13,876 | 02-12-2017 17:35:42 | బీజేపీ హిందుత్వ కార్డు...లోక్సభకు ముందస్తు ఎన్నికలు | న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో హిందుత్వ కార్డును ప్రధాన అస్త్రంగా బీజేపీ తెరపైకి తీసుకురానుందని బీఎస్పీ అధినేత్రి మాయవతి జోస్యం చెప్పారు. కేవలం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ హిందుత్వ కార్డును తెరపైకి తీసుకురానుందని అన్నారు. ఇందులో భాగంగానే ఎన్నికలకు ముందు అయోధ్య రామమందిర నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా హిందుత్వ వాదాన్ని తెరపైకి తేనుందని అన్నారు. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన 2019 ఎన్నికలను ముందస్తుగా నిర్వహించే అవకాశాలు కూడా లేకపోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, విపక్షాలను లేకుండా చేసేందుకు కేంద్ర సంస్థలను ఉసిగొల్పుతోందని మాయావతి మండిపడ్డారు. విపక్షాలపై సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు జరిపిస్తూ, సొంత వ్యక్తులపై వచ్చిన ఆరోపణలను మాత్రం కప్పిపుచ్చుతోందని కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. బీఎస్పీని బలహీన పరచేందుకు దేశభక్తి పేరుతో బీజేపీ చేస్తున్న జిమ్మిక్కుల పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2018లో ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో పార్టీ బలోపోతానికి బీఎస్పీ కార్యకర్తలు పట్టుదలగా కృషి చేయాలని మాయావతి పిలుపునిచ్చారు. | nation |
7,546 | 21-03-2017 22:01:49 | ఏడాదికి నాలుగు ‘బాహుబలు’లు రావాలి |
‘‘నేను తమిళంలో చేసిన దాదాపు ప్రతి సినిమా తెలుగులో అనువాద రూపంలో వచ్చింది. ప్రతిసారీ తమిళంలో కంటే తెలుగులో పాటలు బాగా ఉన్నాయనే పేరు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా పాటలను సీతారామశాస్త్రి గారు రాసిన విధానం కూడా అలాగే ఉంది. ‘బాహుబలి’ లాంటి సినిమాలతో ఇవాళ తెలుగు సినిమా ఎదిగిన విధానం చూసి గర్వంగా ఫీలవుతున్నా. ఏడాదికి నాలుగు ‘బాహుబలి’ లాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నా. మణిరత్నం నాకు సోదరుడు, మార్గదర్శకుడు, స్ఫూర్తిప్రదాత’’ అన్నారు ఆస్కార విజేత, ప్రఖ్యాత సంగీతకారుడు ఎ.ఆర్. రెహమాన్. మణిరత్నం దర్శకత్వంలో ఆయన సంగీతం సమకూర్చిన ‘చెలియా’ సినిమా పాటలు విడుదలయ్యాయి. కార్తీ, అదితీరావ్ హైదరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్ నిర్మించగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ఆడియో వేడుకలో గీత రచయిత సీతారామశాస్త్రి ఆడియో సీడీలను ఆవిష్కరించి, తొలి ప్రతిని రెహమాన్కు అందజేశారు. సీతారామశాస్త్రి మాట్లాడుతూ ‘‘ఈ చిత్రానికి పాటలు రాయడంలో మణిరత్నంగారు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. రెహమాన్ కేవలం మ్యూజిక్ డైరెక్టర్. దానికంటే ఇంకో స్థాయిపైన ఉండే వ్యక్తి. నేను తమిళ పాటల్ని అనువదించలేదు. అనుసృజన చేశాను. ఇందులో ‘మంచు ఆమని’ అనే పద బంధం ఉపయోగించాను. నాకు ఏడాదికో పాటనైనా ఇవ్వమని రెహమాన్ ను రిక్వెస్ట్ చేస్తున్నా’’ అన్నారు. తాను హైదరాబాద్లోనే పుట్టాననీ, ఈ సినిమాకు డ్రీమ్ టీమ్తో పని చేశాననీ అదితి అన్నారు. కార్తీ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రానికి పనిచేస్తుంటే మళ్లీ స్కూల్కు వెళ్లినట్లుగా అనిపించింది. ‘చెలియా’ నాకు స్పెషల్ ఫిల్మ్’’ అన్నారు. ఈ వేడుకలో నటి సుహాసిని, దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా పాల్గొన్నారు. మణిరత్నం మాట్లాడుతూ ‘‘హైదరాబాద్కు వచ్చిన ప్రతిసారీ తెలుగులో మాట్లాడాలని అనుకుంటా. అది జరగదు. అందుకే ఈ సారి నా తెలుగు టీచర్, నా భార్యామణి, మణి భార్య.. సుహాసినిని తీసుకొచ్చాను. ఎయిర్ఫోర్స్ బ్యాక్డ్రాప్, అస్వాభావికమైన కార్తీ, అందమైన అదితితో మీ కోసం ‘చెలియా’ను తీశాను. ఈ సినిమాకు రెండు బలమైన స్తంభాలు.. ఎ.ఆర్. రెహమాన్, సీతారామశాస్త్రి. మా సినిమా, మా సంగీతం దిల్ రాజు చేతిలో భద్రంగా ఉంది’’ అని చెప్పారు. | entertainment |
19,322 | 20-12-2017 01:34:33 | పుజారాకు మూడో ర్యాంక్ | దుబాయ్: భారత బ్యాట్స్మన్ చటేశ్వర్ పుజారా తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో ఒక స్థానాన్ని మెరుగుపరచుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు. పుజారా 54 టెస్టుల్లో 52.96 సగటుతో 4,396 పరుగులు సాధించి 873 పాయింట్లతో మూడో స్థానానికి చేరు కున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 945 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుం డగా, భారత కెప్టెన్ కోహ్లీ 893 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. స్మిత్ గత రెండే ళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అంతేగాక డాన్ బ్రాడ్మన్ ఆల్టైమ్ టాప్ 961 పాయింట్లకు కేవలం 16 పాయింట్ల దూరంలో నిలిచాడు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత బౌలర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మూడు, నాలుగు స్థానాలలో ఉండగా ఇంగ్లండ్ ఓపెనింగ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్, ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోష్ హాజల్వుడ్ టాప్ ఫైవ్లో చోటు దక్కించుకున్నారు. ఇక ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో జడేజా, అశ్విన్ రెండు, నాలుగు స్థానాలలో ఉన్నారు. పెర్త్ టెస్ట్తో డేవిడ్ మలాన్ (52), మిచెల్ మార్ష్ (65) తమ ర్యాంకింగ్ను గణ నీయంగా మెరుగుపరచుకున్నారు. | sports |
21,352 | 25-03-2017 09:11:01 | ఆసీస్ బ్యాటింగ్.. భారత జట్టులో సంచలన మార్పులు | ధర్మశాల: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సంగ్రామం క్లైమాక్స్కు చేరింది. నాలుగు టెస్టుల సిరీ్సలో 1-1తో సమంగా ఉన్న భారత, ఆస్ర్టేలియా మధ్య ఆఖరి పోరాటానికి రంగం సిద్ధమైంది. సిరీస్ విజేతను తేల్చే నాలుగో, చివరి మ్యాచ్లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. భారత కెప్టెన్ కోహ్లీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో రహానే జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కోహ్లీ స్థానంలో యువ లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఇషాంత్ స్థానంలో భువనేశ్వర్ జట్టులోకొచ్చారు. కుల్దీప్కు ఇదే తొలి టెస్టు మ్యాచ్ కాగా, కెప్టెన్గా రహానేకు కూడా తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఆసీస్ మాత్రం రాంచీలో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. పిచ్/వాతావరణంధర్మశాల పిచ్ సహజంగానే పేసర్లకు అనుకూలిస్తుంది. ఫాస్ట్ బౌలర్లు మంచి పేస్, బౌన్స్ను రాబట్టగలుగుతారు. అయితే, గతేడాది జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్ల్లో వికెట్ స్లోగా, స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. ప్రస్తుతం పిచ్పై పచ్చిక బాగా కనిపిస్తోంది. స్పిన్నర్లకు కూడా కాస్త సహకారం లభించేందుకు శనివారం ఉదయం నాటికి దాన్ని కత్తిరించే అవకాశం ఉంది. ఇక, ధర్మశాలలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. అయితే, మూడో రోజు నుంచి ఇక్కడ తేలికపాటి వర్షం పడొచ్చని వాతావరణ శాఖ నివేదిక చెబుతోంది. జట్లుభారత్: విజయ్, రాహుల్, పుజారా, రహానె(కెప్టెన్), కరుణ్ నాయర్, అశ్విన్, సాహా (వికెట్ కీపర్), జడేజా, కుల్దీప్, భువనేశ్వర్, ఉమేష్. ఆస్ట్రేలియా: వార్నర్, రెన్షా, స్మిత్ (కెప్టెన్), షాన్ మార్ష్, హ్యాండ్స్కోంబ్, మాక్స్వెల్, వేడ్ (వికెట్ కీపర్), ఒకీఫ్, కమిన్స్, లియాన్, హాజెల్వుడ్. | sports |
20,429 | 27-12-2017 01:50:28 | నేటినుంచి పోర్ట్స్ వాలీబాల్ |
కోచ్చి : బుధవారంనుంచి ఆరంభం కానున్న ఆలిండియా మేజర్ పోర్ట్స్ వాలీబాల్ చాంపియన్షిప్లో ముంబయి, ట్యుటికోరన్, పరదీప్, చెన్నై, కోల్కతా, విశాఖపట్నం, మార్మగోవా, కొచ్చిన్ రేవుపట్టణాల జట్లు తలపడనున్నాయి. వాలీబాల్తోపాటు బీచ్వాలీబాల్ పోటీలనుకూడా నిర్వహించ నున్నారు. 100మందికిపైగా క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొననున్నారు. రెండు క్రీడాంశాలలో కొచ్చిన్ రేవు పట్టణమే ప్రస్తుత చాంపియన్. పోటీలు డిసెంబర్ 29తో ముగుస్తాయి. | sports |
11,887 | 24-01-2017 01:53:05 | రోడ్ల పక్కన సైకిల్ ట్రాక్లు! |
- నితిన్ గడ్కరి, కేంద్ర మంత్రి | nation |
11,483 | 26-04-2017 16:28:54 | సీఎంను తిరస్కరించి, పీఎంను ఎన్నుకున్నారు : యోగేంద్ర యాదవ్ | న్యూఢిల్లీ : ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం పొందడంతో కేజ్రీవాల్ మాజీ సహచరుడు, స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఢిల్లీ ప్రజలు ముఖ్యమంత్రిని తిరస్కరించారని, ప్రధాన మంత్రిని ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఆప్పై ఉన్న ఆగ్రహం, వారికి బీజేపీపై ఉన్న నిరాశను అధిగమించిందన్నారు. ఆప్ ప్రభుత్వం మోసగించిందని ప్రజలు భావిస్తున్నారన్నారు. కౌన్సిలర్లను ఎన్నుకున్నారని, సీఎం (కేజ్రీవాల్)ను తిరస్కరించారని, పీఎం (నరేంద్ర మోదీ)ని ఎన్నుకున్నారని చెప్పారు. ఇదిలావుండగా ఎంసీడీ ఎన్నికల్లో తమ ఓటమికి కారణం ఈవీఎంలేనని, మోదీ ప్రభంజనం కాదని ఆప్ చెప్తోంది. | nation |
5,738 | 29-06-2017 17:47:17 | భామావిజయం @50 ఇయర్స్ | ఎన్టీఆర్ హీరోగా సి. పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భామావిజయం’ నేటితో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. తెలుగునాట తరిగిపోని, చెరిగిపోని చరిత్ర సృష్టించిన లవకుశను రెండుసార్లు రూపొందిచిన దర్శకుడు సి.పుల్లయ్య.1963లో ఎన్టీఆర్తో తెలుగులో తొలిరంగుల చిత్రంలో లవకుశ తెరకెక్కించారు పుల్లయ్య. చాలామంది సి. పుల్లయ్య చివరి చిత్రం లవకుశ అనుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత కూడా ఆయన పరమానందయ్య శిష్యుల కథ, భువనసుందరి, భామావిజయం చిత్రాలు రూపొందించారు. భామా విజయం ఆయన తీసిన చివరి చిత్రం. 1967లో సి.పుల్లయ్య రూపొందించిన గొల్లభామ ఆధారంగా 20 ఏళ్ల తర్వాత రూపొందడం విశేషం. గొల్లభామ అనే టైటిల్తోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనా.. ఓ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతింటాయోమోనని ఈ చిత్రానికి భామావిజయం అనే పేరు పెట్టారు. లోకంలో ప్రసిద్ధమైన గొల్లభామ రాజు కథ ఇది. రాజు అందం చూసి మోహించిన దేవకాంత.. అతనితో పాటు ఆయన భార్యకు అమృతం తాగించడంతో వారు నిత్య యవ్వనంతో ఉంటారు. గొల్లభామ అందం చూసి ఆమె తల్లి అని తెలియక కన్న కొడుకే మోహిస్తాడు. చివరకు గోమాత ద్వారా నిజం తెలుసుకున్న తనయుడు...కన్నవారిని కలుసుకోవడంతో కథ ముగుస్తుంది. 1967 జూన్ 29న విడుదలైన ఈ చిత్రం... అప్పటి కంటే తర్వాతి రోజుల్లో విశేషాదరణ పొందింది. | entertainment |
21,437 | 16-11-2017 09:05:37 | లంక కెప్టెన్కూ కొత్తే.. ఆశలన్నీ వారిద్దరిపైనే | కోల్కతా: మొన్ననే శ్రీలంకను వారి దేశంలో చిత్తుగా ఓడించిన టీమిండియా ఇప్పుడు సొంతగడ్డపై ఆ జట్టును మరోసారి మట్టికరిపించాలని భావిస్తోంది. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇక్కడి ఈడెన్ గార్డెన్స్లో గురువారం మొదలయ్యే తొలి మ్యాచ్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బలహీన లంకతో ఈ సిరీస్ను జనవరిలో దక్షిణాఫ్రికాలో రెండు నెలల సుదీర్ఘ పర్యటనకు సన్నాహంగా మార్చుకోవాలని ఆతిథ్య జట్టు కోరుకుంటోంది. అదే సమయంలో లంకను కోహ్లీసేన ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడం లేదు. కానీ 35 ఏళ్లుగా భారత్లో ఆడిన 16 టెస్టుల్లో గెలుపు రుచి చూడని లంకేయులు.. ఇప్పుడు అనుభవం లేని ఆటగాళ్లతో వచ్చారు. 2009లో చివరగా ఇక్కడ ఆడిన ఏంజెలో మాథ్యూస్, రంగన హెరాత్ మాత్రమే ప్రస్తుత జట్టులోనూ ఉన్నారు. వారిపై కెప్టెన్ దినేశ్ చాందిమల్ గండపెడాశలు పెట్టుకున్నాడు. చాందిమల్కు కూడా మనదేశంలో ఇది తొలి టెస్టు కావడం విశేషం. దాంతో, ఇక్కడ టెస్టు నెగ్గడం అంటే ఆషామాషీ కాదని అతనికీ తెలిసే ఉంటుంది. గెలుపు రుచి చూడాలంటే ఆతిథ్య బౌలర్లకు ఎదుదొడ్డి ఆ జట్టు బ్యాట్స్మెన్ క్రీజులో పాతుకొని ఉండాల్సిందే. లంక భావి ఆటగాడిగా భావిస్తున్న సదీర సమరవిక్రమ ఓపెనర్గా రానున్నాడు.. పాక్పై కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ (196) ఆడి వచ్చిన మరో ఓపెనర్ దిమూత్ కరుణరత్నె ఫామ్ను కొనసాగించాలని చూస్తున్నాడు. మాథ్యూస్ను లంక బ్యాటింగ్కే పరిమితం చేయనుంది. బలీయమైన భారత బౌలింగ్ను అడ్డుకోవాలంటే అతనితో పాటు ధనంజయ, కెప్టెన్ చాందిమల్, కీపర్ డిక్వెలా కూడా రాణించాల్సి ఉంటుంది. ఇక బౌలింగ్లో హెరాత్పై లంక పూర్తిగా ఆధారపడనుంది. అయితే, అతనికి ఎవరు సహకారం అందిస్తారన్నది తెలియాలి. | sports |
16,929 | 19-02-2017 00:34:38 | శ్వాసకోశ, హృద్రోగులకు అన్ని సార్లు ఐసీయూ అక్కర్లేదు | అమెరికా శాస్త్రవేత్తల వెల్లడి వాషింగ్టన్, ఫిబ్రవరి 18: ఏ మాత్రం కాస్త తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినా... వెంటనే వైద్యులు ఐసీయూలో ఉంచాలని చెప్పడం సరైన ది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు, హృద్రోగాల బారిన పడిన వారిని అన్ని సందర్భాల్లో ఐసీయూ అక్కర్లేదని తెలిపారు. అసలు పూర్తిగా శ్వాస తీసుకోలేని పక్షంలోనే తప్ప మిగతా సమయాల్లో ఐసీయూలో ఉంచినా ఏ మాత్రం ప్రయోజనం ఉండదన్నారు. అమెరికా లోని మిషిగాన్ మెడికల్ స్కూల్ శ్వాసకోశ, క్రిటిక ల్ కేర్ నిపుణుడు డాక్టర్ థామస్ వ్యాలీ ఆధ్యయ నంలో ఈ విషయం వెల్లడైంది. తీవ్ర మైన శ్వాస కోశ సంబంధ వ్యాధులు, గుండెపోటు, హృదయ వైఫల్యం వంటి సమస్యలతో బాధపడుతున్న 15 లక్షల మంది మెడికల్ రికార్డులను అధ్యయనం చేసి.. ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. | nation |
12,870 | 06-02-2017 03:40:51 | హిమపాతానికి 100 మంది మృతి | కాబుల్/పెషావర్/చండీగఢ్, ఫిబ్రవరి 5: ఉత్తర భారతం సహా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాలను భారీ హిమపాతం అతలాకుతలం చేస్తోంది. మంచు చరియలు విరుచుకు పడటంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. ఆఫ్ఘన్లోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా మంచు చరియలు విరిగి పడి వందమందికిపైగా చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విరిగిపడిన మంచు చరియలతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. మధ్య, ఈశాన్య ప్రావిన్స్లలో రహదారులు మూసుకుపోయాయి. ఉత్తర పాకిస్థాన్లోని మారుమూల ప్రాంతాల్లోనూ దట్టమైన మంచుకింద ఇళ్లు కూరుకుపోయాయి. మరోవైపు జమ్ముకశ్మీర్లోని పలుప్రాంతాల్లోనూ రాబోయే 24గంటలపాటు భారీ మంచు కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించింది. | nation |
20,341 | 27-08-2017 03:16:04 | గుజరాత్ కింగ్స్కు టైటిల్ |
అహ్మదాబాద్: తొలి అంచె క్యూ స్లామ్ ‘ఇండియన్ క్యూ మాస్టర్స్ లీగ్’లో గుజరాత్ కింగ్స్ విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో గుజరాత్ కింగ్స్ 3-0తో ఢిల్లీ డాన్స్పై విజయం సాధించి.. టైటిల్ ఎగరేసుకుపోయింది. గుజరాత్ తరఫున సింగిల్స్లో ఆండ్రూ పెజెట్, అలోక్ కుమార్ గెలవగా.. డబుల్స్లో పెజెట్-డారియా సిరోతినా జోడీ విజయం సాధించింది. విజేత గుజరాత్ రూ.20 లక్షల ప్రైజ్ మనీ దక్కించుకుంది. | sports |
11,959 | 21-08-2017 04:32:59 | ఢిల్లీ విమానాశ్రయంలో డ్రోన్ల కలకలం! | న్యూఢిల్లీ, ఆగస్టు 20: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రోన్లాంటి వస్తువులు ఆదివారం కలకలం సృష్టించాయి. సాయంత్రం 7.09 గంటలకు.. ఎయిర్ ఏసియా పైలట్ ఒకరు విమానాశ్రయంలో ల్యాండయ్యే సమయంలో రన్వేపై డ్రోన్ తరహా వస్తువును చూసి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఫ్లైట్ ఆపరేషన్లను దాదాపు 40 నిమిషాలపాటు నిలిపివేశారు. ఎలాంటి ప్రమాదం లేదని ఢిల్లీ పోలీసులు నిర్ధారించి రాత్రి 7.55 గంటల సమయంలో సేవలను పునరుద్ధరించారు. అంతకు ముందు.. ఉదయం 11.16గంటల సమయంలో చైనా పైలట్ ఒకరు ఇలాగే డ్రోన్లాంటి వస్తువును రన్వేపై చూసినట్టు ఏటీసీకి ఫిర్యాదు చేశారు. అప్పుడు కూడా పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి పరిశీలించి అలాంటిదేమీ లేదని తేల్చారు. | nation |
17,861 | 27-11-2017 08:17:01 | చెన్నై సంద్రంలో జాలర్లకు ప్రాణగండం! |
చెన్నై: ప్రాణాలు పణంగా పెట్టి సముద్రంలో చేపలవేటకు వెళ్తున్న రాష్ట్ర జాలర్లకు వరుస ప్రాణగండాలు క్రుంగదీస్తున్నాయి. ఇన్నాళ్లూ లంక నావికాదళం దాష్టీకానికి బలవుతూ వచ్చిన జాలర్లకు ఇప్పుడు భారత కోస్ట్గార్డ్ వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవి దురదృష్టవశాత్తూ, యాదృచ్ఛికంగా సంభవించినవే అయినప్పటికీ జాలరి సంఘాల్లో తీవ్ర భయాందోళనలు రేపుతున్నాయి. రెండు వారాల క్రితం భారత్ కోస్ట్గార్డ్ సిబ్బంది తమపై కాల్పులు జరిపారని జాలర్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందులో నిజానిజాలు తేల్చేందుకు కేంద్రస్థాయిలో విచారణ జరుగుతున్న తరుణంలో మరో అనూహ్య ఘటన సంభవించింది. రామనాథపురం జిల్లా రామేశ్వరం సమీపంలోని పాంబన్ తీరం మండపం ప్రాంతానికి చెందిన జాలర్లు నలుగురు చేపలవేట కోసం నాటుపడవపై సముద్రంలోకి వెళ్లి, తీరానికి తిరుగు ప్రయాణమైన సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భారత కోస్ట్గార్డ్కి చెందిన హోవర్క్రాఫ్ట్ నౌక అనూహ్యంగా జాలర్ల పడవను ఢీకొంది. ఈ ప్రమాదంలో జాలర్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదాన్ని గ్రహించిన కోస్ట్గార్డ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై సముద్రంలో మునిగిపోతున్న జాలర్లను రక్షించారు. తీవ్ర గాయాలపాలైన నాగేంద్రన్ అనే జాలరిని తక్షణమే మండపం శిబిరానికి తరలించి ప్రాథమిక చికిత్సలు అందజేశారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం రామనాథపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటన జాలరి వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ ప్రతికూలత, సరిగ్గా కనిపించడంపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదం దురదృష్టవశాత్తూ సంభవించినా ఒకే నెలలో భారత కోస్ట్గార్డ్ వల్ల ఏర్పడ్డ రెండు ప్రమాదాలు జాలరి సంఘాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. | nation |
8,355 | 10-10-2017 23:15:42 | హోటల్ పెట్టాలనుకున్నా! |
నటుడు కాకపోయుంటే ప్రభాస్ ఏమయ్యేవారు? ఒక హోటల్ యజమాని అయ్యేవారు! అవును. ఇదే విషయాన్ని ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ‘‘నేను సోమరిపోతును కాబట్టి ఉద్యోగాలు చేయలేను. అందుకని ఏదో ఒక వ్యాపారం చేద్దామనుకున్నా. మా కుటుంబానికి ఆహారం అంటే ఇష్టం కాబట్టి బహుశా హోటల్ బిజినెస్లోకి వెళ్లుండేవాణ్ణి. పైగా హైదరాబాద్లో ఉత్తరాది తిండికి మంచి గిరాకీ’’ అని చెప్పారు ప్రభాస్. అలాంటప్పుడు ఆయన నటుడిగా కెరీర్ను ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న వస్తుంది. ‘‘ఒక రోజు బాపుగారి దర్శకత్వంలో మా పెదనాన్న నటించిన ‘భక్త కన్నప్ప’ సినిమా చూస్తుంటే, ఆ కేరక్టర్లో నన్ను ఊహించుకున్నా. బహుశా అప్పట్నించే నటుణ్ణి కావాలనే ఆలోచన నా మనసులో మొదలైందనుకుంటాను’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే నటుడు కావడం అసాధ్యమని ఒక దశలో ఆయన అనుకున్నారు. ‘‘పెదనాన్న నటుడు, నాన్న నిర్మాత. ‘నటన మీద నీకు ఆసక్తి ఉందా?’.. అని వాళ్లడిగారు. ‘లైట్ల మధ్య అనేకమంది మనుషులు చుట్టూ చూస్తుండగా భావాలు పలికిస్తూ ఎవరైనా ఎలా నటిస్తారు?’ అనే ఫీలింగ్ నాది. అందుకే చెప్పడానికి సిగ్గుపడ్డా. ఒకటికి రెండు సార్లు అమ్మానాన్నలు ఈ విషయం అడిగితే అది నా వల్ల కాదని చెప్పాను. కానీ చివరకు ‘ఈశ్వర్’ (2002)తో కెమెరా ముందుకు వచ్చాను’’ అని చెప్పారు ప్రభాస్. పదిహేనేళ్ల కెరీర్ తర్వాత ‘బాహుబలి’ సినిమాలతో వచ్చిన అమితమైన స్టార్డమ్ను ఎలా హ్యాండిల్ చేయాలో ఆయనకు అర్థం కావట్లేదు. ‘‘తమ హీరో ఎక్కువగా బయటకు రాడని నా అభిమానులు బ్యాడ్గా ఫీలవుతుంటారు. ఈ విషయంలో ఇదివరకటి కంటే ఇప్పుడు కాస్త బెటర్ అయ్యాను. ఇంకా మెరుగుపడేందుకు ప్రయత్నిస్తున్నా’’ అన్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న ‘సాహో’ సెట్స్పై ఉంది. | entertainment |
714 | 10-05-2017 00:49:36 | హడ్కో ఐపిఒకు భారీ స్పందన | రెండో రోజునే మూడు రెట్ల ఓవర్ సబ్స్ర్కిప్షన్ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో పబ్లిక్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇష్యూ ప్రారంభమైన రెండో రోజు మంగళవారం సాయంత్రానికే ఇష్యూ 3 రెట్లు ఎక్కువ సబ్స్ర్కైబ్ అయింది. ఇష్యూ ద్వారా 20.40 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ చేస్తుండగా 61.39 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. అర్హులైన సంస్థాగత కొనుగోలుదారులకు ఉద్దేశించిన షేర్లు దాదాపు 3 రెట్లు ఓవర్ సబ్స్ర్కైబ్ కాగా, రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 4 రెట్లు ఓవర్సబ్ స్ర్కైబ్ అయింది. హడ్కో 56-60 రూపాయల ధర శ్రేణితో షేర్లను ఆఫర్ చేస్తోంది. | business |
21,350 | 27-06-2017 00:24:07 | భారత్ కోచ్ రేసులో లేను | కొలంబో: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగిశాక కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే వైదొలగడంతో ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్తో పాటు రిచర్డ్ పైబస్, టామ్ మూడీ తమ దరఖాస్తులు పంపారు. మరింత మందికి అవకాశం కల్పించడం కోసం బీసీసీఐ గడువు కూడా పెంచింది. ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ పదవికి శ్రీలంక మాజీ బ్యాట్స్మన్ మహేల జయవర్దనె కూ డా దరఖాస్తు చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలకు మహేల కొట్టిపడేశాడు. తాను భారత కోచ్ రేసులో లేనని అన్నాడు. పూర్తిస్థాయి కోచ్గా పని చేయడానికి తాను సిద్ధంగా లేనని జయవర్దనె స్పష్టం చేశాడు. మహేలకు అనుభవం లేదు: ప్రధాన కోచ్ పదవి చేపట్టడానికి మహేలకు తగినంత అనుభవం రాలేదని శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల తెలిపాడు. దీంతో ఇటీవలే ఫోర్డ్ రాజీనామాతో ఖాళీ అయిన శ్రీలంక ప్రధాన కోచ్ రేసులో కూడా జయవర్దనె లేడని స్పష్టమైంది. | sports |
16,996 | 07-03-2017 01:02:55 | ‘ముంబై ముట్టడి’ మా ఉగ్రమూక పనే |
న్యూఢిల్లీ, మార్చి 6: 2008లో ముంబై మారణహోమానికి పాల్పడింది పాక్ ఉగ్రమూకలేనంటూ భారత్ ఇంతకాలం చేసిన వాదన నిజమని స్పష్టమైంది. 26/11 ముంబయి ఉగ్రదాడులు తమ దేశ ఉగ్రవాద సంస్థల పనేనని పాకిస్థాన్ జాతీయ భద్రతా మాజీ సలహాదారు(ఎన్ఎ్సఏ) మహమూద్ అలీ దురానీ ఎట్టకేలకు సోమవారం అంగీకరించారు. ఈ ఉగ్రదాడికి పాక్ గడ్డపైనే కుట్ర జరిగిందని స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదానికి ఇది మంచి ఉదాహరణ అన్నారు. అంతేకాదు.. ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్పై చర్య తీసుకోవాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 166 మంది అమాయకులను బలి తీసుకున్న ముంబయి ఉగ్రదాడి సమయంలో పాక్ జాతీయ భద్రతా సలహాదారునిగానూ, ఐఎస్ఐ జనరల్గానూ పని చేసిన దురానీ ఈ దాడితో ఐఎ్సఐకు, పాక్కు సంబంధం లేదంటూ అప్పుడు బుకాయించారు. ఇంతకాలానికి భారత గడ్డపై వాస్తవాన్ని అంగీకరించడం విశేషం. అయితే, ఈ దాడిలో పాకిస్థాన్ ప్రభుత్వానికి, ఐఎ్సఐకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదంపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్లో సోమవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. హఫీజ్ సయీద్ వల్ల పాక్కు ఎలాంటి లాభం లేదని, అతడిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ నిప్పులు చెరిగారు. ఇదిలావుంటే, పాకిస్థాన్, మాలీలో జరిగిన ఉగ్రదాడుల్లో 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులోని గిరిజన ప్రాంతాల్లో గల పాక్ సైనిక ఔట్పోస్టులపై ఆఫ్ఘనిస్థాన్కు చెందిన ఉగ్రవాదులు దాడులు జరిపారు. | nation |
17,767 | 15-04-2017 03:03:24 | నగదు రహిత ‘నగరాలు’ | నాగ్పూర్, ఏప్రిల్ 14: దేశవ్యాప్తంగా 75 క్యాష్లెష్ టౌన్షిప్పులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. 12 రాష్ట్రాల్లో విస్తరించిన ఈ టౌన్షిప్పుల్లో ఇప్పటికే రోజుకి 1.5 లక్షలు.. ఏడాదికి 5.5 కోట్ల నగదురహిత లావాదేవీలు జరుగుతున్నాయి. మొత్తం 76 టౌన్షిప్పుల్లో 56 గుజరాతలోనే ఉన్నాయి. ఈ టౌన్షిప్పుల్లో.. ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, సెయిల్, బీహెచ్ఈఎల్ టౌన్షిప్పులతోపాటు సహకార రంగానికి చెందిన ఇఫ్కో, క్రిబ్కో టౌన్షిప్పులు, ప్రైవేటు సంస్థలకు చెందిన రిలయన్స్, అదానీ, ఎస్సార్, వంటి సంస్థల టౌన్షిప్పులు కూడా ఉన్నాయి. నగదురహిత బస్తీల ఆలోచనకు నీతి ఆయోగ్ శ్రీకారం చుట్టింది. క్యాష్లెస్ టౌన్షిప్పుల ఎంపిక బాధ్యతను ప్రైస్ వాటర్హౌస్ కూపర్స్ సంస్థకు అప్పగించింది. నగదురహిత టౌన్షిప్పులుగా ఎంపికయ్యేందుకు.. ఆ బస్తీలో నగదురహిత లావాదేవీల నిర్వహణకు అవసరమైన పూర్తి మౌలికసదుపాయాలు ఉండాలి. దీంతోపాటు నగదురహిత లావాదేవీలపై ప్రతి కుటుంబానికీ అవగాహన కల్పించాలి. బస్తీలో జరిగే లావాదేవీల్లో 80 శాతం డిజిటల్ పేమెంట్ విధానంలో జరగాలి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని నగదురహిత బస్తీని ఎంపిక చేస్తారు. ఎస్సార్ టౌన్షిప్పును ‘క్యాష్లెస్ రోల్ మోడల్ టౌన్షిప్పు’గా నీతి ఆయోగ్ ప్రకటించింది. | nation |
4,537 | 19-03-2017 22:59:29 | వచన కవితలకు ఆహ్వానం |
- పెళ్ళూరు సునీల్ | editorial |
8,506 | 01-12-2017 17:47:04 | ‘సీత.. రాముని కోసం’.. నిహారిక పాటల కోసం | శ్రీరంగం శరత్, కారుణ్య హీరోహీరోయిన్లుగా అనిల్ గోపిరెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘సీత.. రాముని కోసం’. తస్మై చిన్మయ ప్రొడక్షన్స్ మరియు రోల్ కేమెరా యాక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో విడుదలకాబోతున్న ఈ చిత్ర ఆడియోని మెగా డాటర్ నిహారిక విడుదల చేశారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. ‘‘టైటిల్ చాలా బాగుంది. సినిమా కూడా అంత మంచి విలువలతో ఉంటుందని నమ్ముతున్నాను. హారర్ సినిమాలు అంటే నాకు కొంచెం భయం. అయినా కూడా నేను ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఎదురు చూస్తున్నాను. హీరో శ్రీరంగం శరత, కారుణ్య, అనిల్ లుక్స్ బాగున్నాయి. చిత్ర యూనిట్కి ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు. చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. ‘‘మనిషికి, మనిషి మరణించిన తరువాత రూపాంతరం చెందే ఆత్మకు మధ్య గల ఒక బంధాన్ని ఈ సినిమాలో సరికొత్తగా అవిష్కరించాం. వాస్తవాలు మాట్లాడుకుంటే అసలు ఆత్మలు ఉన్నాయా..? లేవా..? అవి వట్టి ఊహాగానాలేనా...? మనిషి, ఆత్మ, ప్రేమ, మానవ సంబంధాలు, ఎమోషన్ అనే వాటిని అద్భుత స్క్రీన్ప్లేతో చూపించడం జరిగింది. డిసెంబర్ రెండో వారంలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము..’’ అని తెలిపారు. | entertainment |
3,556 | 09-05-2017 01:27:08 | రవాణా శాఖను ప్రక్షాళన చేయండి! |
ఏసీబీ దాడుల్లో రాష్ట్ర రవాణా శాఖ అధికారుల అక్రమ ఆస్తులు వందల కోట్ల రూపాయల్లో పట్టుబడుతున్న వైనం ఆ శాఖలో అవినీతి ఏ మేరకు జరుగుతుందో చెప్పకనే చెబుతున్నది! వీరి వద్ద ఇన్ని అక్రమ ఆస్తులు ఉన్నాయంటే లబ్ధి పొందిన వారికి ఎన్ని వేలకోట్ల మేలు జరిగి ఉండాలి? ప్రభుత్వానికి ఎంతమేర నష్టం కలిగి ఉంటుందో అంచనాలకు అందదు. ప్రభుత్వ యంత్రాంగమంతా ఓ విష వలయంగా మారింది. పన్నుల మీద పన్నులు వేస్తూ, సామాన్యునిపై భారం మోపుతున్న పాలకులు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ప్రజలకు న్యాయం జరగాలంటే అక్రమంగా ఆస్తులను కూడబెట్టిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. కేసులను త్వరితగతిన పూర్తిచేయటానికి తగిన యంత్రాంగాన్ని సమకూర్చాలి. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి విషయంలో పాలకులు, ప్రజా ప్రతినిధులు స్పష్టమైన వైఖరితో ముందుకు రావాలి!- జి. రామకృష్ణ, ముస్తాబాద్, కృష్ణా జిల్లా | editorial |
20,682 | 19-07-2017 09:05:59 | క్రికెటర్ ఇర్భాన్ పఠాన్పై ముస్లిమ్ల ఆగ్రహం | న్యూఢిల్లీ : క్రికెటర్ ఇర్భాన్ పఠాన్ తన భార్య ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడంపై ముస్లిమ్ పండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇర్ఫాన్ పఠాన్ తండ్రి మసీదులో మౌజాన్గా పనిచేశాడని, ఇస్లాం మత సంప్రదాయాలకు కట్టుబడిన కుటుంబం నుంచి వచ్చి భార్య ఫోటో సోషల్ మీడియాలో పెట్టడం సిగ్గుచేటు అని మౌలానా సాజిద్ రష్దీ చెప్పారు. ఇస్లామ్ ప్రకారం భార్య తన ముఖాన్ని భర్తకు మాత్రమే చూపించాలని సాజిద్ పేర్కొన్నారు. కాని చట్టపరంగా ఆధార్ కార్డు, పాన్ కార్డుల కోసం భార్య ఫోటో దిగవచ్చని ఆయన చెప్పారు. గృహిణి అయిన భార్య ఫోటోను ఇలా సోషల్ మీడియాలో పెట్టడం తప్పని ఆయన ఆక్షేపించారు. ఫోటోలో ఇర్ఫాన్ భార్య చేతి గోళ్లకు నెయిల్ పాలిష్ పెట్టుకుందని, గోళ్లకు నెయిల్ పాలిష్ పెట్టుకోవడం కూడా ఇస్లాం ప్రకారం విరుద్ధమని సాజిద్ చెప్పారు. గోళ్లకు నెయిల్ పాలిష్ పెట్టుకొని నమాజ్ చేయరాదని ఆయన వివరించారు. | sports |
13,484 | 11-03-2017 02:13:24 | విజయం మాదే! | ఎగ్జిట్ పోల్స్ తప్పవుతాయి: రాహుల్ గెలుపుపై అఖిలేశ్, మాయా విశ్వాసం బిహార్ తరహా ఫలితాలపై నమ్మకం 2/3 మెజారిటీ సాధిస్తామన్న బీజేపీ న్యూఢిల్లీ, మార్చి 10: ఐదింట నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వేస్తున్న అంచనాలను కాంగ్రెస్, ఇతర పక్షాలు తోసిపుచ్చాయి. అన్ని పార్టీలూ తమదే గెలుపని విశ్వాసం వ్యక్తం చేశాయి. ఎస్పీ-కాంగ్రెస్ కూటమి యూపీలో తప్పకుండా విజయం సాధిస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ అన్నారు. బిహార్లో కూడా సర్వే సంస్థలు బొక్కబోర్లా పడ్డాయని గుర్తు చేశారు. ఎన్నికల గురించి వివరంగా మార్చి 11నే మాట్లాడతానన్నారు. రాహుల్ మాట నిజమవుతుందని గులాం నబీ ఆజాద్ చెప్పారు. అదే నోటితో యూపీ ఎన్నికలు రాహుల్ పనితీరుపై రెఫరెండం కాదన్నారు. కాంగ్రెస్ మొత్తం ఐదు చోట్లా గెలుస్తుందని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా జోస్యం చెప్పారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. హంగ్ వస్తే బీజేపీని అధికారంలోకి రాకుండా చూసేందుకు బీఎస్పీతో చేతులు కలపడానికి సిద్ధమన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎస్పీ కూటమికే అనుకూలంగా వచ్చాయని, బీజేపీ ఒత్తిడి మేరకు మీడియా సంస్థలు ఫలితాలను మార్చేశాయని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ ఆరోపించారు. బీఎస్పీ చిత్తుగా ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నా తాము గెలిచి తీరతామని పార్టీ అధినేత మాయావతి విశ్వాసం వ్యక్తం చేశారు. బిహార్ ఫలితాలను ఉదాహరణగా చూపారు. ఎగ్జిట్ పోల్స్ పేరుతో చానల్స్ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఆరోపించారు. చానెళ్లపై వస్తున్న ఒత్తిడిని అర్థం చేసుకోగలనన్నారు. ఎగ్జిట్ పోల్స్ శాసీ్త్రయత ఎప్పుడూ ప్రశ్నార్థకమేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఎస్పీ కూటమి విజయం ఖాయమని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ చెప్పారు. తాను యూపీలో ప్రచారం చేశానని, ఈవీఎంలు తెరిచాక ఎవరిసత్తా ఏమిటో తేలుతుందని అన్నారు. యూపీ ఫలితం కేంద్రంపైనా ప్రభావం చూపుతుందని జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ పతనం యూపీతో మొదలవుతుందని అన్నారు. యూపీలో సర్వేలు చెప్పినట్లుగా సాధారణ మెజారిటీ కాకుండా మూడింట రెండు వంతుల మెజారిటీ సాధిస్తామని బీజేపీ ఎంపీ ఆదిత్యనాధ్ దాస్ అన్నారు. ఎస్పీ సంకీర్ణం గురించి మాట్లాడుతూ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందన్నారు. ఈ ఎన్నికల్లో యూపీలో బీజేపీ గెలవబోతోందని అమర్సింగ్ జోస్యం చెప్పారు. మణిపూర్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబీ సింగ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కొన్ని, బీజేపీ వస్తుందనికొన్ని సర్వేలు చెప్పాయి. | nation |
17,760 | 30-10-2017 02:25:55 | 40వేల కోట్లతో సైన్యానికి ఆయుధాలు! | న్యూఢిల్లీ, అక్టోబరు 29: అత్యధిక సైనిక బలగాలు ఉన్న రెండో అతిపెద్ద దేశంగా భారత్ గుర్తింపు పొందింది. అయితే మన సైన్యం వాడుతున్న ఆయుధాలు మాత్రం పాత కాలానికి చెందినవనే అపప్రధ కూడా ఉంది. సైన్యం ఉపయోగిస్తున్న పాత ఆయుధాలకు త్వరలోనే వీడ్కోలు చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఆయుధాల సేకరణకు సంబంధించిన భారీ ప్రణాళికకు భారత సైన్యం ఆమోదం తెలిపింది. పదాతిదళం ఆధునీకరణకు 40వేల కోట్లు వెచ్చించేందుకు నిర్ణయించింది. పాకిస్థాన్, చైనాలకు దీటుగా సమాధానం ఇవ్వడంతోపాటు, రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఆయుధ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 7లక్షల రైఫిళ్లు, 44వేల లైట్ మెషిన్గన్స్(ఎల్ఎంజీ), 44600 కార్బన్ ఆటోమొబైల్స్ కొనుగోలు చేసే ఈ నిర్ణయానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా లభించింది. | nation |
4,317 | 19-10-2017 02:28:49 | కమ్మని పాటలాంటి కవి | అలంకారిక శాస్త్రాన్ని, ఆంతరంగిక రాగాన్ని మేళవించి అందంగా పాటైన కవి శేషేంద్ర శర్మ. వ్యాకరణాల్ని తొక్కుతూ మధుర స్వరాలు ఏరుకొంటూ వచ్చిన ఆ పాటకు మాటల్లేవు మధురిమలే ఉన్నాయి. రాగానికి మేళవించిన తీగెని మీటిన శ్రావ్యమైన పాటే శేషేంద్ర శర్మ. ‘మరచిన తలపింపగ నగు, ఎరుగని నాడెల్ల పాట నెరిగింపనగున్’ అని నన్నయ చెప్పిన మాటలో ఉన్నంత సత్యంగా పాటలాంటి కవి గుంటూరు శేషేంద్రశర్మ. సాహిత్య ప్రక్రియల్లో సర్వ శ్రేష్ఠమైన పాట ప్రక్రియలా ఆయన రచనలన్నీ ప్రజలకు చేరాయి. ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అని కూర్చిన ఆయన పాటలోని సారాంశం కూడా అదే. ఆయనకున్న కవితా శక్తి అపురూపమైంది. కవితా రంగంలో ఆయన ప్రయోగ శీలత అనితర శీలమైంది. 20వ శతాబ్ది కవితాకాశంలో ‘ఆధునిక మహాభారత’ మనే విశ్వమానవ కథా కావ్యాన్ని సృష్టించి తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆధునిక వచన కవితా శకాన్ని నెలకొల్పిన కవిగా ఆయన కీర్తి గడించారు. నదులు, కవులు కలలను ఫలింపజేసే శక్తులుగా నమ్మిన కవి శేషేంద్ర శర్మ: ‘నదులు కంటున్న కలలు పొలాల్లో ఫలిస్తాయి.కవులు కంటున్న కలలు మనుషుల్లో ఫలిస్తాయి.ధరిత్రిని కలందున్నితే అవుతుంది అది ఒక ఇతిహాసం’ అంటున్న ఈ వచన కవి సృజనలో ఒక ప్రకృతి, మనోకృతి నడుమ సజీవ సంబంధం పరివ్యాప్తమై ఉంది. కవిత్వానికి తక్షణ ప్రయోజనం– కవిత్వం విని శ్రోత ఒక ఆత్మిక తృప్తిని పొందాలంటాడు శేషేంద్ర శర్మ. అందుకోసమే విశిష్ఠ భావం, విశిష్ఠ భాష తన రక్తంలో ప్రవహించే ఒక అసాధారణ వాక్యం మాత్రమే కవిత కాగలదన్నాడు. నిరంతరం కవి అంతర్మథనం లోంచి పుట్టినదైతేనే పాటై ప్రజల పక్షం చేరుతుంది. కవి కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ, ‘మనిషి కన్నీరు తుడవడం నీ వంతు. శరీరం పోయినా నిలిచేది నీ గొంతు’ అనడంలో తాత్వికత అదే.‘ఆధునిక భారతం’ను పాటగా చేసుకొని పల్లవించాడు శేషేంద్ర శర్మ. కవితా వస్తువును పాటకు శీర్షికను చేసి చరణాల్లో భావాలను పొదిగాడు. కవితా స్వరూప మంతా తానే. కానీ పక్షి పాట గానో, వేణువు పాటగానో ప్రతిఫలింపజేయడంలో కవి తన లక్ష్యాన్ని చేరుకొన్నాడు. ‘ఓ పక్షి ఎక్కడ్నించో వస్తుంది రెక్కల మీదఈ బాటసారి చెవిలో ఒక పాట పాడేసి వెళ్లి పోతుంది ఒక నిజమైన అనుభూతిని మోసే వాక్యం పాటప్రాణం మోసుకొస్తున్న పక్షిలా నీ దగ్గర వాలుతుంది’ ఈ పాదాల్లో కవి ఆత్మీకరించుకొనే గుణం ప్రధానమై అలరించింది. అంతలోనే కవి పక్షికి కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు. ‘ఓ! పక్షీ! నీ పాట ఇక్కడ పాడబోకు ఎగిరిపోనీ వనాలెక్కడున్నాయో వెతుక్కుంటూ’.... అడవిని పక్షి పాటతో కొలుస్తాను’అంటాడు శేషేంద్ర శర్మ. కవి మదిలో వెలసిన భావమే కావచ్చు కానీ ఈ పాట, ఈ పక్షీ ప్రతీకలై కవిత్వాశయాన్ని శాసిస్తాయి. అలాగే కవన శిల్పానికి తనదైన తీరులో భాష్యం చెప్పాడు కవి. ‘నా గొంతు ప్రజలకు దానం చేశాను, నా జాతే నా భాషకు ప్రాణ వాయువునా దేశం నా శిల్పానికి ఆయువు’ ఇది తన వ్యక్తిత్వం కోసం అనడమేగాదు,‘గాలిలో ఉన్న పక్షులన్నీ కలిసినా నా పాటతో పోటీ పడలేవునా పాట ఆర్కిటిక్ సముద్ర కన్య నా కంఠ సీమల్లో చెక్కిన శిల్పం’అని చెప్తూ అలంకారిక శాస్త్రాన్ని, ఆంతరంగిక రాగాన్ని మేళవించి అందంగా పాటైన కవి శేషేంద్రశర్మ. ఆ కవి వ్యాకరణాల్ని తొక్కుతూ మధుర స్వరాలు ఏరుకొంటూ వచ్చిన పాట. ఆ పాటకు మాటల్లేవు మధురిమలే ఉన్నాయి. రాగానికి మేళవించిన తీగెని మీటిన శ్రావ్యమైన పాటే ఆయన. కమ్మని పాటలాంటి ఈ కవి 90వ జయంతి సభ అక్టోబర్ 20 నాడు హైదరాబాద్లోని త్యాగరాయ గానసభలో జరుపుకోవడం ముదావాహం.ప్రొ. ననుమాసస్వామిరాష్ట్ర అధ్యక్షులు, 1969 తెలంగాణ రాష్ట్ర పోరాటయోధుల సంఘం(నేడు శేషేంద్ర శర్మ 90వ జయంతి) ‘మరచిన తలపింపగ నగు, ఎరుగని నాడెల్ల పాట నెరిగింపనగున్’ అని నన్నయ చెప్పిన మాటలో ఉన్నంత సత్యంగా పాటలాంటి కవి గుంటూరు శేషేంద్రశర్మ. సాహిత్య ప్రక్రియల్లో సర్వ శ్రేష్ఠమైన పాట ప్రక్రియలా ఆయన రచనలన్నీ ప్రజలకు చేరాయి. ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అని కూర్చిన ఆయన పాటలోని సారాంశం కూడా అదే. ఆయనకున్న కవితా శక్తి అపురూపమైంది. కవితా రంగంలో ఆయన ప్రయోగ శీలత అనితర శీలమైంది. 20వ శతాబ్ది కవితాకాశంలో ‘ఆధునిక మహాభారత’ మనే విశ్వమానవ కథా కావ్యాన్ని సృష్టించి తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆధునిక వచన కవితా శకాన్ని నెలకొల్పిన కవిగా ఆయన కీర్తి గడించారు. నదులు, కవులు కలలను ఫలింపజేసే శక్తులుగా నమ్మిన కవి శేషేంద్ర శర్మ: ‘నదులు కంటున్న కలలు పొలాల్లో ఫలిస్తాయి.కవులు కంటున్న కలలు మనుషుల్లో ఫలిస్తాయి.ధరిత్రిని కలందున్నితే అవుతుంది అది ఒక ఇతిహాసం’ అంటున్న ఈ వచన కవి సృజనలో ఒక ప్రకృతి, మనోకృతి నడుమ సజీవ సంబంధం పరివ్యాప్తమై ఉంది. కవిత్వానికి తక్షణ ప్రయోజనం– కవిత్వం విని శ్రోత ఒక ఆత్మిక తృప్తిని పొందాలంటాడు శేషేంద్ర శర్మ. అందుకోసమే విశిష్ఠ భావం, విశిష్ఠ భాష తన రక్తంలో ప్రవహించే ఒక అసాధారణ వాక్యం మాత్రమే కవిత కాగలదన్నాడు. నిరంతరం కవి అంతర్మథనం లోంచి పుట్టినదైతేనే పాటై ప్రజల పక్షం చేరుతుంది. కవి కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ, ‘మనిషి కన్నీరు తుడవడం నీ వంతు. శరీరం పోయినా నిలిచేది నీ గొంతు’ అనడంలో తాత్వికత అదే.‘ఆధునిక భారతం’ను పాటగా చేసుకొని పల్లవించాడు శేషేంద్ర శర్మ. కవితా వస్తువును పాటకు శీర్షికను చేసి చరణాల్లో భావాలను పొదిగాడు. కవితా స్వరూప మంతా తానే. కానీ పక్షి పాట గానో, వేణువు పాటగానో ప్రతిఫలింపజేయడంలో కవి తన లక్ష్యాన్ని చేరుకొన్నాడు. ‘ఓ పక్షి ఎక్కడ్నించో వస్తుంది రెక్కల మీదఈ బాటసారి చెవిలో ఒక పాట పాడేసి వెళ్లి పోతుంది ఒక నిజమైన అనుభూతిని మోసే వాక్యం పాటప్రాణం మోసుకొస్తున్న పక్షిలా నీ దగ్గర వాలుతుంది’ ఈ పాదాల్లో కవి ఆత్మీకరించుకొనే గుణం ప్రధానమై అలరించింది. అంతలోనే కవి పక్షికి కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు. ‘ఓ! పక్షీ! నీ పాట ఇక్కడ పాడబోకు ఎగిరిపోనీ వనాలెక్కడున్నాయో వెతుక్కుంటూ’.... అడవిని పక్షి పాటతో కొలుస్తాను’అంటాడు శేషేంద్ర శర్మ. కవి మదిలో వెలసిన భావమే కావచ్చు కానీ ఈ పాట, ఈ పక్షీ ప్రతీకలై కవిత్వాశయాన్ని శాసిస్తాయి. అలాగే కవన శిల్పానికి తనదైన తీరులో భాష్యం చెప్పాడు కవి. ‘నా గొంతు ప్రజలకు దానం చేశాను, నా జాతే నా భాషకు ప్రాణ వాయువునా దేశం నా శిల్పానికి ఆయువు’ ఇది తన వ్యక్తిత్వం కోసం అనడమేగాదు,‘గాలిలో ఉన్న పక్షులన్నీ కలిసినా నా పాటతో పోటీ పడలేవునా పాట ఆర్కిటిక్ సముద్ర కన్య నా కంఠ సీమల్లో చెక్కిన శిల్పం’అని చెప్తూ అలంకారిక శాస్త్రాన్ని, ఆంతరంగిక రాగాన్ని మేళవించి అందంగా పాటైన కవి శేషేంద్రశర్మ. ఆ కవి వ్యాకరణాల్ని తొక్కుతూ మధుర స్వరాలు ఏరుకొంటూ వచ్చిన పాట. ఆ పాటకు మాటల్లేవు మధురిమలే ఉన్నాయి. రాగానికి మేళవించిన తీగెని మీటిన శ్రావ్యమైన పాటే ఆయన. కమ్మని పాటలాంటి ఈ కవి 90వ జయంతి సభ అక్టోబర్ 20 నాడు హైదరాబాద్లోని త్యాగరాయ గానసభలో జరుపుకోవడం ముదావాహం.ప్రొ. ననుమాసస్వామిరాష్ట్ర అధ్యక్షులు, 1969 తెలంగాణ రాష్ట్ర పోరాటయోధుల సంఘం(నేడు శేషేంద్ర శర్మ 90వ జయంతి) | editorial |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.